మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాలానగర్ పరిధి రంగారెడ్డినగర్లో అగ్నిప్రమాదం జరిగింది. స్థానికంగా ఉన్న శక్తి పెయింట్స్ కంపెనీలో తెల్లవారుజామున 4 గంటల సమయంలో విద్యుదాఘాతంతో అగ్నిప్రమాదం సంభవించింది. గమనించిన వాచ్మెన్ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించాడు.
ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణనష్టం తప్పింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న బాలానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.