నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 220కేవీ విద్యుత్ సబ్స్టేషన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కెపాసిటర్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.
విద్యుత్ సిబ్బంది వెంటనే అప్రమత్తం అవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. సబ్స్టేషన్ పరిధిలోని గ్రామాలకు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. జరిగిన అగ్నిప్రమాదంపై శాఖాపరమైన విచారణ చేపడుతున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: హరితహారంలో కేసీఆర్.. నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ ప్రారంభించిన సీఎం