ETV Bharat / jagte-raho

ఎన్​కౌంటర్​.. ములుగు జిల్లాకు చెందిన దళ కమాండర్​ మృతి - దళ కమాండర్​ అభిలాష్ మృతి వార్తలు

మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంతంలో జరిగిన ఎన్​కౌంటర్​లో ములుగు జిల్లా వాసి మృతి చెందాడు. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో కొట్టె అభిలాష్​ అనే దళ కమాండర్​ మరణించినట్లు పోలీసులు వెల్లడించారు.

encounter in maharastra a dala kamander dead belonging to mulugu
ఎన్​కౌంటర్​.. ములుగు జిల్లాకు చెందిన దళ కమాండర్​ మృతి
author img

By

Published : Jul 5, 2020, 10:20 AM IST

తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లోని గడ్చిరోలి జిల్లా ఏటపల్లి తాలూకా హెడ్రీ పీఎస్​ పరిధిలోని ఎలదుడమి అటవీ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ఎన్​కౌంటర్​ జరిగింది. ఈ ఘటనలో ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం ప్రాజెక్టునగర్​కు చెందిన కొట్టె అభిలాష్​ అలియాస్​ చందు అలియాస్​ సోమ అనే పెరమిళి దళ కమాండర్​ మృతి చెందినట్లు గడ్చిరోలి ఎస్పీ శైలేష్ బాల్కావుడే శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.

మావోయిస్టులు, పోలీసు బలగాల నడుమ జరిగిన ఎదురుకాల్పుల్లో ఇతను మృతి చెందాడని ఎస్పీ పేర్కొన్నారు. ఎన్​కౌంటర్​ స్థలంలో ఓ తుపాకీ, వాకీటాకీలు, ప్రెషర్​కుక్కర్లు, 20 కిట్ బ్యాగులు, సామగ్రి, విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఇతనిపై రూ.8 లక్షల రివార్డు ఉన్నట్లు తెలిపారు.

తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లోని గడ్చిరోలి జిల్లా ఏటపల్లి తాలూకా హెడ్రీ పీఎస్​ పరిధిలోని ఎలదుడమి అటవీ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ఎన్​కౌంటర్​ జరిగింది. ఈ ఘటనలో ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం ప్రాజెక్టునగర్​కు చెందిన కొట్టె అభిలాష్​ అలియాస్​ చందు అలియాస్​ సోమ అనే పెరమిళి దళ కమాండర్​ మృతి చెందినట్లు గడ్చిరోలి ఎస్పీ శైలేష్ బాల్కావుడే శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.

మావోయిస్టులు, పోలీసు బలగాల నడుమ జరిగిన ఎదురుకాల్పుల్లో ఇతను మృతి చెందాడని ఎస్పీ పేర్కొన్నారు. ఎన్​కౌంటర్​ స్థలంలో ఓ తుపాకీ, వాకీటాకీలు, ప్రెషర్​కుక్కర్లు, 20 కిట్ బ్యాగులు, సామగ్రి, విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఇతనిపై రూ.8 లక్షల రివార్డు ఉన్నట్లు తెలిపారు.

ఇదీచూడండి: డేంజరస్: కాలకుండానే వదిలేస్తున్నారు... ప్రజలు వణికిపోతున్నారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.