ETV Bharat / jagte-raho

రామతీర్థం ఘటన వెనక కుట్రకోణం ఏమైనా ఉందా? : ఏపీ డీజీపీ - రామతీర్థం ఘటనపై డీజీపీ కామెంట్స్

రామతీర్థం ఘటన వెనక కుట్రకోణం ఏమైనా ఉందా? అనేది పరిశీలిస్తున్నట్లు ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. ఆ దిశగా లభించిన ఆధారాలను విశ్లేషిస్తున్నామన్నారు.

AP DGP Gautam Sawang
ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌
author img

By

Published : Jan 7, 2021, 2:39 PM IST

రామతీర్థం ఘటనపై కుట్రకోణాన్ని పరిశీలిస్తున్నామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. బోడికొండపై రామాలయానికి విద్యుత్ సదుపాయం కల్పించి రెండు మూడు రోజుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో దాడి జరగడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఆలయం, పరిసరాలు బాగా తెలిసినవారే ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చు అన్న డీజీపీ.. దర్యాప్తు పురోగతిలో ఉందని వెల్లడించారు.

మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగాలు, వ్యాఖ్యలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వీలుగా న్యాయ నిపుణుల సలహా కోరామన్న ఏపీ డీజీపీ.... ఈ ప్రసంగాల వల్ల సమాజంలో సామరస్యత దెబ్బతింటోందని పేర్కొన్నారు. వరుస ఘటనలకు ఒక దానికి మరో దానితో సంబంధం ఏమైనా ఉందా? అని విశ్లేషిస్తున్నామని తెలిపారు. నిర్మానుష్య ప్రాంతాల్లో ఉన్న దేవాలయాల్ని లక్ష్యంగా చేసుకునే దాడులు జరుగుతున్నట్లు గుర్తించామని ఆయన వివరించారు.

రామతీర్థం ఘటనపై కుట్రకోణాన్ని పరిశీలిస్తున్నామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. బోడికొండపై రామాలయానికి విద్యుత్ సదుపాయం కల్పించి రెండు మూడు రోజుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో దాడి జరగడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఆలయం, పరిసరాలు బాగా తెలిసినవారే ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చు అన్న డీజీపీ.. దర్యాప్తు పురోగతిలో ఉందని వెల్లడించారు.

మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగాలు, వ్యాఖ్యలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వీలుగా న్యాయ నిపుణుల సలహా కోరామన్న ఏపీ డీజీపీ.... ఈ ప్రసంగాల వల్ల సమాజంలో సామరస్యత దెబ్బతింటోందని పేర్కొన్నారు. వరుస ఘటనలకు ఒక దానికి మరో దానితో సంబంధం ఏమైనా ఉందా? అని విశ్లేషిస్తున్నామని తెలిపారు. నిర్మానుష్య ప్రాంతాల్లో ఉన్న దేవాలయాల్ని లక్ష్యంగా చేసుకునే దాడులు జరుగుతున్నట్లు గుర్తించామని ఆయన వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.