తమ వద్ద మదుపు చేస్తే నెలకు నూటికి రూ.5 నుంచి రూ.10 వడ్డీ ఇస్తామంటూ మోసం చేస్తూ 13 నెలల్లో రూ.13 కోట్లు కొల్లగొట్టిన దంపతులు పీట పద్మజ, పీట వరప్రసాద్ను హైదరాబాద్ సీసీఎస్ శుక్రవారం అరెస్ట్ చేశారు. మోతీనగర్లో ఉంటున్న ఈ నిందితులపై 20 మంది ఫిర్యాదు చేశారని, విచారణ అనంతరం జ్యుడిషియల్ కస్టడీకి తరలించామని ఇన్స్పెక్టర్ కె.వి.సూర్యప్రకాష్ అన్నారు.
ఈ దంపతులు సినిమాల నిర్మాణంలోనూ భాగస్వాములుగా ఉన్నారు. విజయవాడకు చెందిన ఘరానా మోసగాడు యార్లగడ్డ రఘు హైదరాబాద్లో ప్రారంభించిన స్వధాత్రి ఇన్ఫ్రాలో సైతం ఏజెంట్లుగా చేరారు. రఘు రూ.కోట్లు స్వాహా చేస్తున్నాడని గ్రహించారు. స్వధాత్రిలో అంతర్భాగమైన రుణధార సంస్థకు డైరెక్టర్లు తామేనని మదుపరులను నమ్మించారు. తీసుకున్న సొమ్ముకు నకిలీ రసీదులిచ్చేవారన్నారు.
ఇదీ చూడండి: 'యుద్ధప్రాతిపదికన దెబ్బతిన్న రోడ్లను పునరుద్ధరించండి'