ETV Bharat / jagte-raho

రెచ్చిపోతున్న సైబర్​ నేరగాళ్లు.. మోసపోతున్న అమాయకులు - latest cyber crime news in hyderabad

పోలీసులు, మీడియా ఎంత అవగాహన కల్పించినా కొంత మంది మోసపోతూనే ఉన్నారు. అమాయకత్వంతో సైబర్​ నేరగాళ్ల వలలో పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. మోసపోయామని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు.

cyber cheaters looting lakhs of rupees in hyderabad
రెచ్చిపోతున్న సైబర్​ నేరగాళ్లు.. మోసపోతున్న అమాయకులు
author img

By

Published : Jul 26, 2020, 3:47 PM IST

హైదరాబాద్​లో సైబర్​ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకుల నుంచి డబ్బులు కాజేస్తున్నారు. జూబ్లీహిల్స్​కు చెందిన రచనకు ఓ జాతీయ బ్యాంక్​లో కరెంట్ అకౌంట్ ఉంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి బ్యాంకు నుంచి మాట్లాడుతున్నట్లు నమ్మించాడు. మీ డెబిట్ కార్డుకు వాల్యుయాడేడ్ పాయింట్స్ బాగా వచ్చాయి. వాటిని మీ డెబిట్ కార్డుకు జోడించాలంటే... కార్డు సీవీవీ నంబరు చెప్పాలన్నాడు. ఆమె అమాయకంగా ఆ నంబర్లు చెప్పింది. దీంతో రచన ఖాతాలోని రూ.55 వేలు మాయమయ్యాయి.

బతుకమ్మకుంటకు చెందిన వినీత్... అన్​లైన్​లో ఓ కంపెనీ నుంచి వర్క్ ఫ్రం హోం జాబ్​ పొందాడు. వినీత్ ఎంతో కష్టపడి నిర్ణీత సమయానికి పని పూర్తి చేశాడు. కానీ... ఆ కంపెనీ ప్రతినిధి తాము అప్పగించిన పనుల్లో అన్నీ తప్పులే ఉన్నాయని... దీనికి తగిన మూల్యం చెల్లించాలని బెదిరింపులకు పాల్పడుతుండటంతో భయపడిన వినీత్... తిరిగి ఆ కంపెనీ ప్రతినిధికి రూ.25 వేలు చెల్లించాడు. ఇంకా డబ్బులు ఇవ్వాలంటూ బెదిరించడం వల్ల బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

పంజాగుట్ట ఆదర్శనగర్​కు చెందిన విజయనారాయణ కారు కొనుగోలు చేద్దామని ఓఎల్​ఎక్స్​లో చూశారు. అందులో ఓ కారు కనిపించింది. రూ. 2.50 లక్షలకు కారు బేరమాడుకున్నారు. వెంటనే విజయనారాయణ ఆ మొత్తాన్ని ఆన్​లైన్ ద్వారా ట్రాన్స్​ఫర్ చేశారు. ఆ తర్వాత ఎంతకాలం ఎదురు చూసినా కారు రాలేదు. అవతలి వ్యక్తికి ఫోన్ చేస్తే స్వీచ్​ ఆఫ్​ వచ్చింది. మోసపోయానని గ్రహించిన బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.

ఇవీ చూడండి: శరవేగంగా వైరస్​ వ్యాప్తి‌.. మూడు వారాల్లోనే మూడు రెట్లు పెరిగిన కేసులు

హైదరాబాద్​లో సైబర్​ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకుల నుంచి డబ్బులు కాజేస్తున్నారు. జూబ్లీహిల్స్​కు చెందిన రచనకు ఓ జాతీయ బ్యాంక్​లో కరెంట్ అకౌంట్ ఉంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి బ్యాంకు నుంచి మాట్లాడుతున్నట్లు నమ్మించాడు. మీ డెబిట్ కార్డుకు వాల్యుయాడేడ్ పాయింట్స్ బాగా వచ్చాయి. వాటిని మీ డెబిట్ కార్డుకు జోడించాలంటే... కార్డు సీవీవీ నంబరు చెప్పాలన్నాడు. ఆమె అమాయకంగా ఆ నంబర్లు చెప్పింది. దీంతో రచన ఖాతాలోని రూ.55 వేలు మాయమయ్యాయి.

బతుకమ్మకుంటకు చెందిన వినీత్... అన్​లైన్​లో ఓ కంపెనీ నుంచి వర్క్ ఫ్రం హోం జాబ్​ పొందాడు. వినీత్ ఎంతో కష్టపడి నిర్ణీత సమయానికి పని పూర్తి చేశాడు. కానీ... ఆ కంపెనీ ప్రతినిధి తాము అప్పగించిన పనుల్లో అన్నీ తప్పులే ఉన్నాయని... దీనికి తగిన మూల్యం చెల్లించాలని బెదిరింపులకు పాల్పడుతుండటంతో భయపడిన వినీత్... తిరిగి ఆ కంపెనీ ప్రతినిధికి రూ.25 వేలు చెల్లించాడు. ఇంకా డబ్బులు ఇవ్వాలంటూ బెదిరించడం వల్ల బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

పంజాగుట్ట ఆదర్శనగర్​కు చెందిన విజయనారాయణ కారు కొనుగోలు చేద్దామని ఓఎల్​ఎక్స్​లో చూశారు. అందులో ఓ కారు కనిపించింది. రూ. 2.50 లక్షలకు కారు బేరమాడుకున్నారు. వెంటనే విజయనారాయణ ఆ మొత్తాన్ని ఆన్​లైన్ ద్వారా ట్రాన్స్​ఫర్ చేశారు. ఆ తర్వాత ఎంతకాలం ఎదురు చూసినా కారు రాలేదు. అవతలి వ్యక్తికి ఫోన్ చేస్తే స్వీచ్​ ఆఫ్​ వచ్చింది. మోసపోయానని గ్రహించిన బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.

ఇవీ చూడండి: శరవేగంగా వైరస్​ వ్యాప్తి‌.. మూడు వారాల్లోనే మూడు రెట్లు పెరిగిన కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.