ETV Bharat / jagte-raho

పోలీసుల సోదాల్లో 3కోట్ల 20లక్షల నగదు పట్టివేత

ఎన్నికల తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడుతోంది. బంజారాహిల్స్​లో రూ.3.20 కోట్లు లభ్యమైంది. కేసు నమోదు చేసిన పోలీసులు... వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

author img

By

Published : Apr 5, 2019, 8:51 AM IST

పోలీసుల సోదాల్లో 3కోట్ల 20లక్షల నగదు పట్టివేత

బంజారాహిల్స్ పోలీసుల తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. రోడ్డు నంబర్ 10లోని జహీరానగర్ చౌరస్తాలో సోదాలు నిర్వహిస్తుండగా కారులో నగదు లభ్యమైంది. వాహనంలో ఉన్న ఇద్దరు వ్యక్తులను ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు ఇచ్చారు. వాళ్లు చెప్పిన చిరునామాకు వెళ్లి తనిఖీ చేయగా మొత్తం రూ.3కోట్ల 20లక్షలు బయటపడింది. వాటికి సరైన ఆధారాలు చూపించకపోవడం వల్ల పోలీసులు డబ్బును స్వాధీనం చేసుకుని... ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్​కు నగదును తరలించారు.

అబిడ్స్​లో ఉండే బంగారు నగల వ్యాపారి అనిల్ అగర్వాల్​కు చెందిన నగదుగా పోలీసులు గుర్తించారు. వ్యాపారానికి సంబంధించిన సొమ్మా లేకపోతే హవాలా మార్గం ద్వారా తరలిస్తున్న నగదా... అనే కోణంలోనూ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఆభరణాల వ్యాపారికి రాజకీయ నాయకులతో ఏమైనా సంబంధాలున్నాయా అని ఆరా తీస్తున్నారు.

పోలీసుల సోదాల్లో 3కోట్ల 20లక్షల నగదు పట్టివేత

ఇదీ చదవండి: ఆదిలాబాద్​లో చోరీ... 15 తులాల పసిడి మాయం

బంజారాహిల్స్ పోలీసుల తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. రోడ్డు నంబర్ 10లోని జహీరానగర్ చౌరస్తాలో సోదాలు నిర్వహిస్తుండగా కారులో నగదు లభ్యమైంది. వాహనంలో ఉన్న ఇద్దరు వ్యక్తులను ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు ఇచ్చారు. వాళ్లు చెప్పిన చిరునామాకు వెళ్లి తనిఖీ చేయగా మొత్తం రూ.3కోట్ల 20లక్షలు బయటపడింది. వాటికి సరైన ఆధారాలు చూపించకపోవడం వల్ల పోలీసులు డబ్బును స్వాధీనం చేసుకుని... ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్​కు నగదును తరలించారు.

అబిడ్స్​లో ఉండే బంగారు నగల వ్యాపారి అనిల్ అగర్వాల్​కు చెందిన నగదుగా పోలీసులు గుర్తించారు. వ్యాపారానికి సంబంధించిన సొమ్మా లేకపోతే హవాలా మార్గం ద్వారా తరలిస్తున్న నగదా... అనే కోణంలోనూ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఆభరణాల వ్యాపారికి రాజకీయ నాయకులతో ఏమైనా సంబంధాలున్నాయా అని ఆరా తీస్తున్నారు.

పోలీసుల సోదాల్లో 3కోట్ల 20లక్షల నగదు పట్టివేత

ఇదీ చదవండి: ఆదిలాబాద్​లో చోరీ... 15 తులాల పసిడి మాయం

Hyd_Tg_82_04_Enivation_Electronic Kata_Ab_C15
యాంకర్:మైక్రో గ్రామ్ కన్నా తక్కువ బరువు ఉన్న వస్తువులను కొలవగలిగే ఎలక్ట్రానిక్ కటా ను అవుష్కరించిన స్మార్ట్ ల్యాబ్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ.... హైదరాబాద్ మాదాపూర్ లోని హోటల్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు.... ఈ కార్యక్రమంలో స్మార్ట్ ల్యాబ్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, జర్మనీ sartorius గ్రూప్ ఎవల్యూషన్ టు రివల్యూషన్ పేరుతో ఫార్మ ఇండస్ట్రీ పరిశోధన లో అతి తక్కువ బరువు ఉన్న వస్తువులను కొలవగలిగే క్యూబిస్ 2 ఎలక్ట్రానిక్ కటా ను ఆవిష్కరించారు.... ఈ సందర్భంగా స్మార్ట్ ల్యాబ్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సత్య ప్రసాద్ మాట్లాడుతూ అతి తక్కువ అ బరువున్న వస్తువులను అలాగే ద్రవపదార్థాలను అంతరిక్షంలో లో లభించే వస్తువులను క్యూబ్స్ టు ఉ పరికరం కలుగుతుందని తెలిపారు అంతేకాకుండా డా లో ఇందులో లో ఎప్పటికప్పుడు సమాచారం భద్ర పరుచుకునే సౌలభ్యం ఎలాంటి అవకతవకలు జరగకుండా జాగ్రత్తలు చేపట్టడం జరిగిందన్నారు....
బైట్:సత్య ప్రసాద్, మేనేజింగ్ డైరెక్టర్ స్మార్ట్ ల్యాబ్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.