హైదరాబాద్ బంజారాహిల్స్లో శనివారం రాత్రి ఓ హోటల్లో జరిగిన పార్టీ ఘటనపై కేసు నమోదయింది. ఎపిడమిక్ డిసీస్ యాక్ట్ కింద పోలీసులు కేసు పెట్టారు. ఈ కేసులో ఓ మంత్రి మేనల్లుడు ఉన్నట్లు తెలిసింది. పార్టీలో ఉక్రెయిన్ యువతి సహా నలుగురు యువతులు పాల్గొన్నారు. పార్టీలో రఘువీర్రెడ్డి, విజయరామారావు, సంతోష్రెడ్డి, భానుకిరణ్ అనే యువకులు ఉన్నారు. మొత్తం 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చూడండి: విదేశీ యాప్లకు ప్రత్యామ్నాయంగా 'ఎలిమెంట్స్'