హైదరాబాద్ వారసిగూడ పార్సిగుట్టకు చెందిన అరుణ్కుమార్ తన స్నేహితులు సాయి, సంతోష్, కిరణ్తో కలిసి ట్యాంక్ బండ్లో వినాయక నిమజ్జనం చేయడానికి స్కార్పియో కారులో వచ్చారు. చిల్డ్రన్ పార్క్ సమీపం వద్దకు రాగానే వెనుక నుంచి ద్విచక్రవాహనం వేగంగా వస్తోంది. ఆయన స్నేహితులు వారిని మందలించారు. దీంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది.
అంతలోనే ద్విచక్రవాహనంపై వచ్చిన యువకులు వారి స్నేహితులకు ఫోన్ చేయడంతో... మరో వాహనాలపై గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి వీరితో గొడవ పడ్డారు. అదే సమయంలోనే స్కార్పియో కారులో మంటలు అంటుకుని కాలిపోయింది. దీంతో అరుణ్ స్థానిక గాంధీ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ గొడవలో ద్విచక్ర వాహనంపై వచ్చిన పదిమంది గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయడంతో... సంతోష్, కిరణ్కు గాయాలయ్యాయి. అయితే గొడవ జరుగుతున్న సమయంలో కారును గుర్తుతెలియని వ్యక్తులు తగులబెట్టారా... లేదా ప్రమాదవశాత్తు జరిగిందా... అన్న కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: స్వచ్ఛమైన గాలి.. మట్టివాసన... ఫామ్టూర్స్కు నగరవాసులు