ETV Bharat / jagte-raho

బాలుడిని తరిమిన వానరం.. కిందపడి పసివాడు మృతి - మైలారంలో ఆరేళ్ల బాలుడి మృతి

వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం మైలారంలో విషాద ఘదన చోటుచేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిని వానరం తరమడం వల్ల కిందపడి ఆరేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

boy death in monkey attack in mylaram village warangal rural district
వానరం వెంటపడటం వల్ల బాలుడు బలి
author img

By

Published : Jan 13, 2021, 4:11 AM IST

వానరం తరమడం వల్ల కిందపడి బాలుడు మృతి చెందిన విషాద ఘటన వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం మైలారంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సంపత్-సంధ్య దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారుడు రిషివర్ధన్(6) ఇంట్లో ఆడుకుంటుండగా కోతి వెంటపడింది. భయంతో పరిగెత్తుతూ కిందపడి అక్కడికక్కడే చనిపోయాడు.

అప్పటి వరకు ఇంటి ముందే ఆడుకున్న తమ గారాల కుమారుడు కళ్లుమూసి తెరిచేలోపే విగత జీవిగా మారడం వల్ల ఆ తల్లిదండ్రుల రోదన వర్ణనాతీతంగా మారింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి కోతుల బెడద నుండి రక్షించాలని గ్రామస్థలు కోరారు.

వానరం తరమడం వల్ల కిందపడి బాలుడు మృతి చెందిన విషాద ఘటన వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం మైలారంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సంపత్-సంధ్య దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారుడు రిషివర్ధన్(6) ఇంట్లో ఆడుకుంటుండగా కోతి వెంటపడింది. భయంతో పరిగెత్తుతూ కిందపడి అక్కడికక్కడే చనిపోయాడు.

అప్పటి వరకు ఇంటి ముందే ఆడుకున్న తమ గారాల కుమారుడు కళ్లుమూసి తెరిచేలోపే విగత జీవిగా మారడం వల్ల ఆ తల్లిదండ్రుల రోదన వర్ణనాతీతంగా మారింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి కోతుల బెడద నుండి రక్షించాలని గ్రామస్థలు కోరారు.

ఇదీ చూడండి: చెట్లకు ఉరివేసుకుని స్నేహితుల ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.