మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ సమీపంలో ట్రాక్టర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఘటనలో బైక్పై ఉన్న సునీత అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.
నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలానికి చెందిన వెంకటేశ్, సునీత దంపతులు ద్విచక్ర వాహనంపై జడ్చర్లకు వెళ్తుండగా.. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ సమీపంలో ట్రాక్టర్ వీరి బైకును ఢీకొట్టింది. ఘటనలో సునీత ట్రాక్టర్ చక్రాల కింద పడటం వల్ల అక్కడికక్కడే మృతి చెందింది. వెంకటేశ్కు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.