యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణానికి చెందిన ఓ కుటుంబం ఉపాధి కోసం నేరెడ్మెట్కు వలస వెళ్లారు. ఆ కుటుంబానికి చెందిన యువతికి అదే ప్రాంతంలో ఉండే ఓ యువకుడితో పరిచయం పెంచుకుంది. అది కాస్తా ప్రేమగా మారి ఆమె గర్భం దాల్చింది. పెళ్లి చేసుకోమని కోరగా.. ప్రియుడు ముఖం చాటేశాడు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తు కొనసాగుతోంది. కాగా.. సదరు యువతి సెప్టెంబర్ 12న భువనగిరిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 14న రూ.60వేలకు ఆ శిశువును మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం ఏదులాబాద్కు చెందిన ఓ మహిళకు విక్రయించింది.
యువకుడి మీద పెట్టిన కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు బాధితురాలిని శిశువు గురించి అడిగారు. డీఎన్ఏ పరీక్షల కోసం శిశువును తీసుకురావాల్సిందిగా కోరారు. కాగా.. శిశువు చనిపోయినట్టు యువతి పోలీసులకు చెప్పింది. ఆమె ప్రవర్తన మీద అనుమానం వచ్చిన పోలీసులు గట్టిగా అడగగా.. రూ.60 వేలకు అమ్మేసినట్టు తెలిపింది. పసిబిడ్డను అమ్మినందుకు గానూ.. పోలీసులు యువతితో పాటు మరొకరి మీద కేసు నమోదు చేసి.. అరెస్టు చేశారు. తల్లీబిడ్డలను సఖి కేంద్రంలో ఉంచారు. అనంతరం నల్లగొండలోని బాలల పరిరక్షణ కేంద్రానికి తరలించారు. యువతికి, శిశువుకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించడం కోసం.. వారిని శుక్రవారం నాడు హైదరాబాద్కు తరలించనున్నట్టు జిల్లా బాలల పరిరక్షణ అధికారి సైదులు తెలిపారు.
ఇవీచూడండి: పోలీసు స్టేషన్కు పిలిచారని మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్య