టెక్నాలజీని ఆయుధంగా మార్చుకొని రోజురోజుకు సైబర్ నేరగాళ్లు అక్రమాలకు పాల్పడుతున్నారని, అమాయకులకు ఆశ చూపి ఆన్లైన్లో డబ్బులు దోచేస్తున్నారని భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్దత్ అన్నారు. ఆన్లైన్లో పాత సామాగ్రి క్రయవిక్రయాల పేరుతో వచ్చే మెసేజ్లు, యాప్స్, కాల్స్ నమ్మవద్దని సూచించారు.
జిల్లాలోని అశ్వాపురం మండలం చింతిర్యాల క్రాస్రోడ్డుకు చెందిన ఓ వ్యక్తి ఆగష్టు 1న మొబైల్ కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకొని ఆన్లైన్లో డబ్బులు పంపించాడు. ఆ తర్వాత అతనికి మొబైల్ రాలేదు. సదరు మోసగాళ్లకు ఫోన్ చేసినా ఎత్తలేదు. మోసపోయానని గ్రహించిన బాధితుడు భద్రాద్రి కొత్తగూడెం సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడని ఎస్పీ తెలిపారు. వెంటనే రంగంలోకి దిగిన కొత్తగూడెం పోలీసులు నిందితులను పట్టుకొని వారి నుంచి కొంతవరకు తిరిగి ఇప్పించామని, సమస్యను పరిష్కరించిన సీఐ అబ్బయ్య, కానిస్టేబుల్ గోపిని ఎస్పీ అభినందించారు.
ఇవీ చూడండి: దిల్లీలో ఐటీ మంత్రి కేటీఆర్.. కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ పూరీతో భేటీ