ETV Bharat / jagte-raho

ఆదివాసీ ఐక్య సంఘాల పిలుపు.. భద్రాచలం బంద్​

author img

By

Published : Sep 29, 2020, 10:17 AM IST

Updated : Sep 29, 2020, 1:01 PM IST

ఆదివాసీ ఐక్య సంఘాల నేతలు ఇచ్చిన మన్యం బంద్​ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఆదివాసీ నేతలు బంద్​ చేపట్టారు. వాహనాల రాకపోకలను నిలిపి వేసి.. దుకాణాలను మూసి వేయించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

bhadrachalam bandh by the call of the Tribal United Nations
ఆదివాసీ ఐక్య సంఘాల పిలుపు.. భద్రాచలం బంద్​

తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఆదివాసీల హక్కులకు భంగం వాటిల్లుతోందని ఆదివాసీ ఐక్య సంఘాల నేతలు మన్యం బంద్​కు పిలుపునివ్వడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఆదివాసీ నేతలు బంద్​ను చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఎదుట కొద్దిసేపు ధర్నా నిర్వహించి.. బస్సులను నిలిపివేశారు. అనంతరం పట్టణంలో తిరుగుతూ అన్ని దుకాణాలు బంద్ చేయించారు. ప్రైవేటు వాహనాలు నడపరాదంటూ నినాదాలు చేశారు.

bhadrachalam-bandh-by-the-call-of-the-tribal-united-nations
ఇల్లందులో బైక్​ ర్యాలీ

అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించేందుకు యత్నించిన ఆదివాసీ సంఘాలు, వామపక్ష నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, నాయకులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. అనంతరం పోలీసులు అనుమతించడం వల్ల అంబేడ్కర్​ సెంటర్ నుంచి యూబీ రోడ్డు పాత మార్కెట్ ఏరియా బ్రిడ్జి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు.

bhadrachalam-bandh-by-the-call-of-the-tribal-united-nations
భద్రాచలంలో ర్యాలీ నిర్వహిస్తున్న నేతలు

చాలా కాలంగా ఆదివాసీల పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని.. ఆదివాసీలకు అనుకూలంగా ఉన్న జీవో నెంబర్​ 3కు చట్టబద్ధత తేవాలని, ఆదివాసీల హక్కులు కాపాడాలనే తదితర డిమాండ్లతో బందు చేపట్టినట్లు ఆదివాసీ సంఘాలు తెలిపాయి.

ఇల్లందులో బైక్​ ర్యాలీ..

మరోవైపు మన్యం బంద్​ను విజయవంతం చేయాలని కోరుతూ ఆదివాసీ సంఘాలు, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఇల్లందులో బైక్​ ర్యాలీ నిర్వహించారు. పోడు భూముల సమస్యలను స్వయంగా పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్​ హామీ ఇచ్చినప్పటికీ.. ఎలాంటి పురోగతి లేదని నాయకులు ఆరోపించారు. పోడు భూములకు పట్టాలివ్వాలని.. అటవీ శాఖ నుంచి ఇబ్బందులను తొలగించాలని, భూముల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

మరోవైపు మన్యం బంద్​ పిలుపు మేరకు పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎప్పటికప్పుడు ఆదివాసీ నేతలను పరిశీలిస్తూ.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.

ఇదీచూడండి: 'దేవాదాయ భూముల రిజిస్ట్రేషన్లను నిషేధించిన ప్రభుత్వం'

తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఆదివాసీల హక్కులకు భంగం వాటిల్లుతోందని ఆదివాసీ ఐక్య సంఘాల నేతలు మన్యం బంద్​కు పిలుపునివ్వడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఆదివాసీ నేతలు బంద్​ను చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఎదుట కొద్దిసేపు ధర్నా నిర్వహించి.. బస్సులను నిలిపివేశారు. అనంతరం పట్టణంలో తిరుగుతూ అన్ని దుకాణాలు బంద్ చేయించారు. ప్రైవేటు వాహనాలు నడపరాదంటూ నినాదాలు చేశారు.

bhadrachalam-bandh-by-the-call-of-the-tribal-united-nations
ఇల్లందులో బైక్​ ర్యాలీ

అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించేందుకు యత్నించిన ఆదివాసీ సంఘాలు, వామపక్ష నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, నాయకులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. అనంతరం పోలీసులు అనుమతించడం వల్ల అంబేడ్కర్​ సెంటర్ నుంచి యూబీ రోడ్డు పాత మార్కెట్ ఏరియా బ్రిడ్జి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు.

bhadrachalam-bandh-by-the-call-of-the-tribal-united-nations
భద్రాచలంలో ర్యాలీ నిర్వహిస్తున్న నేతలు

చాలా కాలంగా ఆదివాసీల పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని.. ఆదివాసీలకు అనుకూలంగా ఉన్న జీవో నెంబర్​ 3కు చట్టబద్ధత తేవాలని, ఆదివాసీల హక్కులు కాపాడాలనే తదితర డిమాండ్లతో బందు చేపట్టినట్లు ఆదివాసీ సంఘాలు తెలిపాయి.

ఇల్లందులో బైక్​ ర్యాలీ..

మరోవైపు మన్యం బంద్​ను విజయవంతం చేయాలని కోరుతూ ఆదివాసీ సంఘాలు, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఇల్లందులో బైక్​ ర్యాలీ నిర్వహించారు. పోడు భూముల సమస్యలను స్వయంగా పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్​ హామీ ఇచ్చినప్పటికీ.. ఎలాంటి పురోగతి లేదని నాయకులు ఆరోపించారు. పోడు భూములకు పట్టాలివ్వాలని.. అటవీ శాఖ నుంచి ఇబ్బందులను తొలగించాలని, భూముల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

మరోవైపు మన్యం బంద్​ పిలుపు మేరకు పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎప్పటికప్పుడు ఆదివాసీ నేతలను పరిశీలిస్తూ.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.

ఇదీచూడండి: 'దేవాదాయ భూముల రిజిస్ట్రేషన్లను నిషేధించిన ప్రభుత్వం'

Last Updated : Sep 29, 2020, 1:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.