మతిస్థిమితం లేని మహిళపై అత్యాచారయత్నం చేసినట్లు బాధితురాలి తరఫు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం నంది వడ్డేమానలో ఈ ఘటన జరిగింది. రెండు రోజుల క్రితం జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
మద్యం మత్తులో మతిస్థిమితం లేని 40 ఏళ్ల మహిళపై తిరుపతయ్య, మన్యం, చిన్నరాములు అత్యాచారానికి యత్నించారు. రెండు రోజుల క్రితం ఈ ఘటన జరిగింది.
- బాధితులు
బాధితులు, గ్రామస్థులు ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేశాం. వైద్యులు ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం. దర్యాప్తు ప్రారంభించాం.
- వెంకటేశ్, బిజినపల్లి ఎస్సై
ఇవీచూడండి: పెళ్లితో ఒక్కటి కాలేక.. చావులో ఒక్కటయ్యారు!