ETV Bharat / jagte-raho

ఆసీస్​ ఆయిల్​ విక్రయిస్తున్న విద్యార్థుల అరెస్ట్

author img

By

Published : Dec 11, 2020, 12:26 PM IST

ఒకరు డిగ్రీ, మరొకరు డిప్లొమా చదివే విద్యార్థులు. మత్తుకు బానిసలై గంజాయి విక్రయించడం వృత్తిగా ఎంచుకున్నారు. ఎక్కువ ఆదాయం కోసం గంజాయి నుంచి తీసిన ఆసీస్​ ఆయిల్​ను విశాఖపట్నం నుంచి తీసుకువచ్చి అమ్ముతున్నారు. పక్కా సమాచారంతో దాడి చేసిన కుత్బుల్లాపూర్ పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని, 240 గ్రాముల ఆసీస్​ ఆయిల్​, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Arrest of students selling asis oil in khuthbullapur in medchal dist
ఆసీస్​ ఆయిల్​ విక్రయిస్తున్న విద్యార్థుల అరెస్ట్

గంజాయి నుంచి తీసిన ఆసీస్​ ఆయిల్​ విక్రయిస్తున్న ఇద్దరు విద్యార్థులను కుత్బుల్లాపూర్​ ఎక్సైజ్​ పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్​కు తరలించారు. చింతల్​కు చెందిన సాయిగిరీశ్(21) డిగ్రీ ద్వితీయ సంవత్సరం, షేక్​ సోయల్​(21) డిప్లొమా చదువుతున్నారు. గతంలో భద్రాచలంలో గంజాయి కేసులో అరెస్టైన గిరీశ్ పద్ధతి మార్చుకోకుండా స్నేహితుడు సోయల్​ సాయంతో ఆసీస్​ ఆయిల్ విక్రయిస్తున్నాడు.

విశాఖపట్నం నుంచి తీసుకువచ్చి, పద్మానగర్​ ఫేజ్​-2లో రాత్రి సమయాల్లో విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి ద్విచక్రవాహనం, 240 గ్రాముల నూనె స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపు రూ.30 వేల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి:బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలు కూల్చివేత

గంజాయి నుంచి తీసిన ఆసీస్​ ఆయిల్​ విక్రయిస్తున్న ఇద్దరు విద్యార్థులను కుత్బుల్లాపూర్​ ఎక్సైజ్​ పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్​కు తరలించారు. చింతల్​కు చెందిన సాయిగిరీశ్(21) డిగ్రీ ద్వితీయ సంవత్సరం, షేక్​ సోయల్​(21) డిప్లొమా చదువుతున్నారు. గతంలో భద్రాచలంలో గంజాయి కేసులో అరెస్టైన గిరీశ్ పద్ధతి మార్చుకోకుండా స్నేహితుడు సోయల్​ సాయంతో ఆసీస్​ ఆయిల్ విక్రయిస్తున్నాడు.

విశాఖపట్నం నుంచి తీసుకువచ్చి, పద్మానగర్​ ఫేజ్​-2లో రాత్రి సమయాల్లో విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి ద్విచక్రవాహనం, 240 గ్రాముల నూనె స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపు రూ.30 వేల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి:బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలు కూల్చివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.