ETV Bharat / jagte-raho

బుద్వేల్​లో ప్రాణం తీసిన ఈత సరదా

author img

By

Published : Sep 24, 2020, 10:53 AM IST

Updated : Sep 24, 2020, 3:06 PM IST

వాగులో ఈతకు వెళ్లిన ఓ యువకుడు మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా బుద్వేల్​ గ్రామంలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

వాగులో ఈతకు వెళ్లి  గల్లంతైన యువకుడు
వాగులో ఈతకు వెళ్లి గల్లంతైన యువకుడు

ఈత సరదా ఓ యువకుడి ప్రాణం తీసింది. నలుగురు యువకులు కలిసి సరదాగా ఈతకు వెళ్లగా అందులో ఒకరు నీట మునిగి మృత్యువాత పడ్డారు. రంగారెడ్డి జిల్లా బుద్వేల్ బస్తీకి చెందిన నలుగురు యువకులు సమీపంలోని మూసీ వాగు వద్దకు వెళ్లారు. వీరిలో కిరణ్​ అనే యువకుడు ఈత కొట్టేందుకు నీటిలోకి దిగాడు.

కొంతసేపటి తర్వాత నీళ్ల మధ్యలో ఉన్న రాళ్లల్లో చిక్కుకొని నీటమునిగాడు. మిగతా ముగ్గురికి ఈత రాకపోవడం వల్ల కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. వారు అక్కడికి చేరుకునేలోపే కిరణ్ నీటిలో గల్లంతయ్యాడు. మృతదేహాన్ని ట్యాంక్ బండ్​కు చెందిన గజ ఈతగాడు శివ సహకారంతో వెలికితీశారు. అనంతరం పోస్ట్​మార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

ఈత సరదా ఓ యువకుడి ప్రాణం తీసింది. నలుగురు యువకులు కలిసి సరదాగా ఈతకు వెళ్లగా అందులో ఒకరు నీట మునిగి మృత్యువాత పడ్డారు. రంగారెడ్డి జిల్లా బుద్వేల్ బస్తీకి చెందిన నలుగురు యువకులు సమీపంలోని మూసీ వాగు వద్దకు వెళ్లారు. వీరిలో కిరణ్​ అనే యువకుడు ఈత కొట్టేందుకు నీటిలోకి దిగాడు.

కొంతసేపటి తర్వాత నీళ్ల మధ్యలో ఉన్న రాళ్లల్లో చిక్కుకొని నీటమునిగాడు. మిగతా ముగ్గురికి ఈత రాకపోవడం వల్ల కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. వారు అక్కడికి చేరుకునేలోపే కిరణ్ నీటిలో గల్లంతయ్యాడు. మృతదేహాన్ని ట్యాంక్ బండ్​కు చెందిన గజ ఈతగాడు శివ సహకారంతో వెలికితీశారు. అనంతరం పోస్ట్​మార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

ఇదీ చదవండి: అధికారులు సహకరించటం లేదని సర్పంచ్​ ఆత్మహత్యాయత్నం

Last Updated : Sep 24, 2020, 3:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.