ETV Bharat / jagte-raho

పండుగ పూట విషాదం: విద్యుదాఘాతంతో యువతి మృతి

author img

By

Published : Oct 25, 2020, 5:30 PM IST

దసరా పండుగ పూట ఆ ఇంట్లో విషాదం నెలకొంది. నీళ్ల మోటార్ వేస్తుండగా విద్యుదాఘాతానికి గురై యువతి మృతి చెందింది. అప్పటి వరకు తమ కళ్ల ముందే ఉన్న కూతరు.. ఒక్కసారిగా విగతజీవిగా పడి ఉండటంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

a woman died of current shock in mahabubabad district
పండుగ పూట విషాదం: విద్యుదాఘాతంతో యువతి మృతి

మహబూబాబాద్ జిల్లా కేంద్రం బెస్త బజారులో విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో నీళ్ల మోటర్ వేస్తుండగా.. శ్రీలేఖ అనే యువతి ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురైంది. గుర్తించిన కుటుంబ సభ్యులు శ్రీలేఖను వెంటనే పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు యువతి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు.

విషయం తెలుసుకున్న బంధుమిత్రులు, కాలనీ వాసులు ఘటనా స్థలానికి చేరుకొని.. కన్నీరు మున్నీరుగా విలపించారు. శ్రీలేఖ హైదరాబాద్​లోని శ్రీ హిందూ ఫార్మసీ కాలేజీలో బీ ఫార్మసీ చదువుతోంది.

మహబూబాబాద్ జిల్లా కేంద్రం బెస్త బజారులో విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో నీళ్ల మోటర్ వేస్తుండగా.. శ్రీలేఖ అనే యువతి ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురైంది. గుర్తించిన కుటుంబ సభ్యులు శ్రీలేఖను వెంటనే పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు యువతి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు.

విషయం తెలుసుకున్న బంధుమిత్రులు, కాలనీ వాసులు ఘటనా స్థలానికి చేరుకొని.. కన్నీరు మున్నీరుగా విలపించారు. శ్రీలేఖ హైదరాబాద్​లోని శ్రీ హిందూ ఫార్మసీ కాలేజీలో బీ ఫార్మసీ చదువుతోంది.

ఇదీ చూడండి.. నువ్వే లేని లోకానా... నేనుండ లేను

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.