జయశంకర్ భూపాలపల్లి జిల్లా, రేగొండ మండలం తిరుమలగిరి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి తగాదాల్లో తోడబుట్టిన అన్నను తమ్ముడు బలితీసుకున్నాడు.
గ్రామానికి చెందిన బయ రాజయ్య(60), అతని తమ్ముడు నరసయ్య మధ్య కొన్నిరోజులుగా ఆస్తి విషయంలో వివాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం గొడవ పెద్దది కావడంతో నరసయ్య రోకలిబండతో రాజయ్య తలపై బాదాడు. దీంతో రాజయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. రేగొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: వెంచర్లో మహిళ మృతదేహం.. దారుణ హత్య!