ETV Bharat / jagte-raho

మద్యం మత్తు.. మామపై కోపం... కన్నకొడుకునే చంపేసింది! - telangana news updates

ప్రపంచంలో కన్న తల్లికంటే బిడ్డలను ఎవరూ అమితంగా చూసుకోలేరంటారు. కానీ రక్షించాల్సిన చేతులే... ప్రాణాలు తీశాయి. క్షణికావేశం, మద్యం ఈ రెండు ఓ తల్లి తన బిడ్డ ప్రాణాలను తనే తీసుకునేలా చేశాయి. ఈ దారుణమైన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

మద్యం మత్తులో రెండేళ్ల కుమారుడిని గొంతుపిసికి చంపేసింది
మద్యం మత్తులో రెండేళ్ల కుమారుడిని గొంతుపిసికి చంపేసింది
author img

By

Published : Feb 3, 2021, 7:43 AM IST

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం రామన్నగూడలో దారుణం చోటుచేసుకుంది. మామపై కోపం.. మద్యం మత్తులో తల్లి తన రెండేళ్ల కుమారుడిని గొంతుపిసికి చంపేసింది.

అసలేం జరిగిందంటే...

రామన్నగూడకు చెందిన దుంస పరమేశ్వరి మద్యానికి బానిసగా మారింది. భర్త శివకుమార్​ కూలీ పని చేసేవాడు. మంగళవారం భర్త పనికి వెళ్లాడు. సాయంత్రం పరమేశ్వరి కల్లు తాగింది. అది చూసి మామ వెంకటయ్య కోడలిని మందలించాడు. అదే కోపంతో మద్యం మత్తులో తన రెండేళ్ల కొడుకు ధనుశ్​కుమార్​ను చేతులతో గొంతు పిసికి చంపేసింది.

చుట్టు పక్కల వారికి తెలియడంతో 100కు కాల్​ చేసి పోలీసులకు సమాచారం అందించారు. రాత్రి 10 గంటలకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరమేశ్వరిని అదుపులోకి తీసుకున్నారు. బాబుని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ఆసుపత్రికి తరలించారు.

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం రామన్నగూడలో దారుణం చోటుచేసుకుంది. మామపై కోపం.. మద్యం మత్తులో తల్లి తన రెండేళ్ల కుమారుడిని గొంతుపిసికి చంపేసింది.

అసలేం జరిగిందంటే...

రామన్నగూడకు చెందిన దుంస పరమేశ్వరి మద్యానికి బానిసగా మారింది. భర్త శివకుమార్​ కూలీ పని చేసేవాడు. మంగళవారం భర్త పనికి వెళ్లాడు. సాయంత్రం పరమేశ్వరి కల్లు తాగింది. అది చూసి మామ వెంకటయ్య కోడలిని మందలించాడు. అదే కోపంతో మద్యం మత్తులో తన రెండేళ్ల కొడుకు ధనుశ్​కుమార్​ను చేతులతో గొంతు పిసికి చంపేసింది.

చుట్టు పక్కల వారికి తెలియడంతో 100కు కాల్​ చేసి పోలీసులకు సమాచారం అందించారు. రాత్రి 10 గంటలకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరమేశ్వరిని అదుపులోకి తీసుకున్నారు. బాబుని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ఆసుపత్రికి తరలించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.