కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గొల్లపల్లి గేట్ వద్ద ట్రాక్టర్ బోల్తాపడింది. ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. గూడెం గ్రామానికి చెందిన బాబాగౌడ్... ట్రాక్టర్ తీసుకుని తన బంధువుల గ్రామమైన మోషాంపూర్కు వెళ్తుండగా గొల్లపల్లి వద్ద పంటపొలంలో ట్రాక్టర్ బోల్తా పడింది.
ప్రమాదంలో బాబాగౌడ్పై ట్రాక్టర్ పడడం వల్ల అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.