ETV Bharat / jagte-raho

కార్తిక దీపం.. బాలిక పాలిట శాపం..

author img

By

Published : Nov 30, 2020, 11:33 PM IST

ఎంతో సంబరంగా కార్తిక దీపం వెలిగించేందుకు గుడికి వెళ్లిన ఓ బాలిక అగ్నికిలల్లో చిక్కుకుంది. కాలిన గాయాలతో తల్లడిల్లుతూ.. ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

ap news
కార్తిక దీపం.. బాలిక పాలిట శాపం..

కడప జిల్లా రైల్వే కోడూరు మండలం చియ్యవరం గ్రామంలో కార్తిక దీపం ఓ ఇంటికి శాపమైంది. ఆలయంలో దీపం వెలిగించేందుకు వెళ్లిన పాప దుస్తులకు ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని గాయపడింది.

తల్లితో పాటు దీపం వెలిగించేందుకు కావేరి గుడికి వెళ్లింది. ఆలయ ప్రాంగణంలో ఆడుకుంటుండగా.. పాప గౌనుకు దీపం అంటుకుని ఒళ్లంతా కాలిపోయింది. అమ్మాయి తల్లిదండ్రులు వెంటనే బాలికను ఓ ప్రైవేటు​ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం తిరుపతి ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించినట్లు బాలిక తల్లిదండ్రులు తెలిపారు.

కడప జిల్లా రైల్వే కోడూరు మండలం చియ్యవరం గ్రామంలో కార్తిక దీపం ఓ ఇంటికి శాపమైంది. ఆలయంలో దీపం వెలిగించేందుకు వెళ్లిన పాప దుస్తులకు ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని గాయపడింది.

తల్లితో పాటు దీపం వెలిగించేందుకు కావేరి గుడికి వెళ్లింది. ఆలయ ప్రాంగణంలో ఆడుకుంటుండగా.. పాప గౌనుకు దీపం అంటుకుని ఒళ్లంతా కాలిపోయింది. అమ్మాయి తల్లిదండ్రులు వెంటనే బాలికను ఓ ప్రైవేటు​ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం తిరుపతి ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించినట్లు బాలిక తల్లిదండ్రులు తెలిపారు.

ఇవీచూడండి: తాగుడుకు బానిసై...మద్యం మత్తులో భార్యను కొట్టి చంపిన భర్త

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.