బిహార్ రాష్ట్రానికి చెందిన అమిత్ మిశ్రా అనే యువకుడు బ్రతుకు తెరువు కోసం వచ్చాడు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం గండెగూడ గ్రామంలో ఉన్న అగర్వాల్ స్టీల్ పరిశ్రమలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ బొల్లారం గ్రామంలో నివాసం ఉంటున్నాడు. అమిత్ బిహార్ నుంచి వచ్చి 45 రోజులే అయ్యింది.
అయితే ఆదివారం ఉదయం పరిశ్రమలోని షెడ్పై ఉన్న ఇనుప కమ్మికి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న అమీన్పూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతనికి ప్రేమ వ్యవహారం ఉందని స్నేహితులు చెబుతున్నారు. ప్రేమ విఫలమైందా లేక ఇతర కారణాలు ఏమైనా అతని మరణానికి దారితీశాయనా..? అని పోలీసులు విచారిస్తున్నారు.
ఇదీ చూడండి: విహారానికి వెళ్లి జలప్రవాహానికి కొట్టుకుపోయాడు!