ETV Bharat / jagte-raho

సింహాచలం అప్పన్న బంగారం కేసులో ముగ్గురు వ్యక్తులు అరెస్టు

author img

By

Published : Sep 9, 2020, 8:34 PM IST

సింహాచలం అప్పన్న బంగారం అమ్మకం పేరిట రూ.38 లక్షలు మోసానికి పాల్పడ్డారని ఏపీలోని విశాఖ క్రైమ్ డీసీపీ సురేశ్ బాబు వెల్లడించారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేశామన్నారు.

3-persons-arrestd-in-simhadri-appanna-swamy-gold-case
సింహాచలం అప్పన్న బంగారం కేసులో ముగ్గురు వ్యక్తులు అరెస్టు

ఆంధ్రప్రదేశ్​లోని సింహాచలం అప్పన్న బంగారం అమ్మకం కేసులో నిందితులు హైమావతి, వాసు, నాగేంద్రను అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ సురేశ్ బాబు తెలిపారు. ఇద్దరు దేవస్థాన సిబ్బంది పాత్ర ఉన్నట్టు గుర్తించామన్నారు.

శ్రావణి అనే బాధిత మహిళ ఫిర్యాదుతో దర్యాప్తు చేశామని.. మోసం చేయడానికి గోపాలపట్నంలో ఒక రసీదును డిజైన్ చేశారని డీసీపీ పేర్కొన్నారు. స్టాంపును ద్వారకానగర్‌లో తయారు చేయించారని వివరించారు. నిందితుల నుంచి రూ.2 లక్షలు రికవరీ చేశామన్న డీసీపీ సూళ్లూరుపేటలోనూ ఒక కేసు నమోదు చేశామన్నారు.

ఆంధ్రప్రదేశ్​లోని సింహాచలం అప్పన్న బంగారం అమ్మకం కేసులో నిందితులు హైమావతి, వాసు, నాగేంద్రను అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ సురేశ్ బాబు తెలిపారు. ఇద్దరు దేవస్థాన సిబ్బంది పాత్ర ఉన్నట్టు గుర్తించామన్నారు.

శ్రావణి అనే బాధిత మహిళ ఫిర్యాదుతో దర్యాప్తు చేశామని.. మోసం చేయడానికి గోపాలపట్నంలో ఒక రసీదును డిజైన్ చేశారని డీసీపీ పేర్కొన్నారు. స్టాంపును ద్వారకానగర్‌లో తయారు చేయించారని వివరించారు. నిందితుల నుంచి రూ.2 లక్షలు రికవరీ చేశామన్న డీసీపీ సూళ్లూరుపేటలోనూ ఒక కేసు నమోదు చేశామన్నారు.

ఇదీ చూడండి: కార్పొరేట్ ఆస్పత్రుల దందా అరికడతాం: కేసీఆర్‌

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.