ETV Bharat / jagte-raho

గోదావరిలో గల్లంతైన నలుగురి మృతదేహాలు లభ్యం

author img

By

Published : Nov 15, 2020, 11:48 AM IST

Updated : Nov 15, 2020, 12:19 PM IST

ములుగు జిల్లాలో గోదావరిలో స్నానానికెళ్లి గల్లంతైన ఘటనలో నలుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. వెంకటాపురం మండలం మరికాల గోదావరి రేవు వద్ద శనివారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. స్నేహితుడి పుట్టినరోజు సందర్భంగా పార్టీ చేసుకోవడానికి వెళ్లిన 20 మందిలో నలుగురు ప్రమాదవశాత్తు నదిలో కొట్టుకుపోయారు.

dead bodies
గోదావరిలో గల్లంతైన నలుగురి మృతదేహాలు లభ్యం

ములుగు జిల్లాలో గోదావరిలో స్నానానికెళ్లి నలుగురు గల్లంతైన ఘటనలో వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. నిన్న ఇద్దరు మృతదేహాలు దొరకగా ఈ రోజు శ్రీకాంత్, అన్వేష్​ల మృతదేహాలను వెలికితీశారు.

వెంకటాపురం మండలం మరికాల గ్రామ సమీపంలో ఉన్న గోదావరి రేవుకి శనివారం సాయంత్రం 20 మంది.. పుట్టినరోజు వేడుక చేసుకోవడానికి వెళ్లారు. పార్టీ అనంతరం నదిలో ఈతకు దిగారు. ఈ క్రమంలోనే నలుగురు యువకులు గల్లంతయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. జాలర్ల సహాయంతో మృతదేహాలను వెలికి తీశారు.

ములుగు జిల్లాలో గోదావరిలో స్నానానికెళ్లి నలుగురు గల్లంతైన ఘటనలో వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. నిన్న ఇద్దరు మృతదేహాలు దొరకగా ఈ రోజు శ్రీకాంత్, అన్వేష్​ల మృతదేహాలను వెలికితీశారు.

వెంకటాపురం మండలం మరికాల గ్రామ సమీపంలో ఉన్న గోదావరి రేవుకి శనివారం సాయంత్రం 20 మంది.. పుట్టినరోజు వేడుక చేసుకోవడానికి వెళ్లారు. పార్టీ అనంతరం నదిలో ఈతకు దిగారు. ఈ క్రమంలోనే నలుగురు యువకులు గల్లంతయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. జాలర్ల సహాయంతో మృతదేహాలను వెలికి తీశారు.

సంబంధిత వార్తలు: నది ఒడ్డున పార్టీ... ఇద్దరు గల్లంతు

Last Updated : Nov 15, 2020, 12:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.