ETV Bharat / international

వచ్చే వారంలో యూఏఈకి ఇజ్రాయెల్​ విమానం! - ఇజ్రాయెల్​ యూఏఈ

తమ మధ్య కుదిరిన చారిత్రక ఒప్పందం అనంతరం ఇరు దేశాల మధ్య బంధాన్ని పెంచుకునేందుకు చర్యలు చేపడుతున్నాయి ఇజ్రాయెల్​-యూఏఈ. ఇందులో భాగంగా వచ్చే వారంలో ఇజ్రాయెల్​ నుంచి యూఏఈకి తొలి వాణిజ్య విమానం ప్రయాణిస్తుందని అమెరికా అధికారులు వెల్లడించారు. ఇందులో అమెరికా, ఇజ్రాయెల్​ బృందాలు ఉంటాయని పేర్కొన్నారు.

US officials: 1st Israel-UAE commercial flight next week
త్వరలో యూఏఈకి ఇజ్రాయెల్​ విమానం!
author img

By

Published : Aug 26, 2020, 5:25 AM IST

ఇజ్రాయెల్​-యూఏఈ మధ్య తొలి వాణిజ్య విమానం వచ్చే వారం ప్రయాణించనుందని అమెరికా అధికారులు వెల్లడించారు. ఈ విమానం.. అమెరికా, ఇజ్రాయెల్​ అధికారులను అబుదాబికి తీసుకెళ్లనున్నట్టు తెలిపారు.

తమ మధ్య ఉన్న విభేదాలను పక్కనపెట్టి.. ఇరు దేశాల బంధాన్ని బలోపేతం చేసుకునేందుకు ఇజ్రాయెల్​-యూఏఈ ఇటీవలే అంగీకరించాయి. ఈ చారిత్రక ఒప్పందానికి అమెరికా సాక్ష్యంగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్​-యూఏఈ మధ్య టెలిఫోన్​ సేవలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

తాజా విమాన ప్రయాణ వార్త ఇరు దేశాలను మరింత ఉత్సాహపరిస్తుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ సలహాదారు, ఆయన అల్లుడు జారెడ్​ కుష్నర్, జాతీయ భద్రత సలహాదారు రాబర్డ్​ ఓబ్రెయిన్​​​ నేతృత్వంలోని అమెరికా బృందం, ఇజ్రాయెల్​కు చెందిన ఏవియేషన్​, అంతరిక్షం, ఆరోగ్యం, బ్యాంకింగ్​ రంగ నిపుణులు.. ఈ విమానంలో యూఏఈకి ప్రయాణిస్తారని సమాచారం.

సౌదీ స్వాగతించినట్టేనా?

ఇజ్రాయెల్​-యూఏఈ మధ్య కుదిరిన చారిత్రక ఒప్పందాన్ని అనేక దేశాలు స్వాగితించాయి. గల్ఫ్​ దేశాల్లో అత్యంత ముఖ్యమైన సౌదీ అరేబియా మాత్రం మనస్ఫూర్తిగా ఈ ఒప్పందాన్ని స్వాగతించినట్టు కనపడటం లేదు.

ఈ నేపథ్యంలో తాజా విమాన ప్రయాణ అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఇజ్రాయెల్​ నుంచి యూఏఈకి వెళ్లాలంటే సౌదీ గగనతలాన్ని వినియోగించుకోవాల్సిందే. అయితే ఇప్పటివరకు దీనిపై సౌదీ ఇంకా స్పందించలేదు. అది జరగకపోతే.. యెమెన్ వంటి ప్రమాదకర మార్గాలను విమాన ప్రయాణానికి ఎంచుకోవాల్సి ఉంటుంది.

ఇదీ చూడండి:- ఇజ్రాయెల్​-యూఏఈ డీల్​తో ఎవరికి లాభం?

ఇజ్రాయెల్​-యూఏఈ మధ్య తొలి వాణిజ్య విమానం వచ్చే వారం ప్రయాణించనుందని అమెరికా అధికారులు వెల్లడించారు. ఈ విమానం.. అమెరికా, ఇజ్రాయెల్​ అధికారులను అబుదాబికి తీసుకెళ్లనున్నట్టు తెలిపారు.

తమ మధ్య ఉన్న విభేదాలను పక్కనపెట్టి.. ఇరు దేశాల బంధాన్ని బలోపేతం చేసుకునేందుకు ఇజ్రాయెల్​-యూఏఈ ఇటీవలే అంగీకరించాయి. ఈ చారిత్రక ఒప్పందానికి అమెరికా సాక్ష్యంగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్​-యూఏఈ మధ్య టెలిఫోన్​ సేవలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

తాజా విమాన ప్రయాణ వార్త ఇరు దేశాలను మరింత ఉత్సాహపరిస్తుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ సలహాదారు, ఆయన అల్లుడు జారెడ్​ కుష్నర్, జాతీయ భద్రత సలహాదారు రాబర్డ్​ ఓబ్రెయిన్​​​ నేతృత్వంలోని అమెరికా బృందం, ఇజ్రాయెల్​కు చెందిన ఏవియేషన్​, అంతరిక్షం, ఆరోగ్యం, బ్యాంకింగ్​ రంగ నిపుణులు.. ఈ విమానంలో యూఏఈకి ప్రయాణిస్తారని సమాచారం.

సౌదీ స్వాగతించినట్టేనా?

ఇజ్రాయెల్​-యూఏఈ మధ్య కుదిరిన చారిత్రక ఒప్పందాన్ని అనేక దేశాలు స్వాగితించాయి. గల్ఫ్​ దేశాల్లో అత్యంత ముఖ్యమైన సౌదీ అరేబియా మాత్రం మనస్ఫూర్తిగా ఈ ఒప్పందాన్ని స్వాగతించినట్టు కనపడటం లేదు.

ఈ నేపథ్యంలో తాజా విమాన ప్రయాణ అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఇజ్రాయెల్​ నుంచి యూఏఈకి వెళ్లాలంటే సౌదీ గగనతలాన్ని వినియోగించుకోవాల్సిందే. అయితే ఇప్పటివరకు దీనిపై సౌదీ ఇంకా స్పందించలేదు. అది జరగకపోతే.. యెమెన్ వంటి ప్రమాదకర మార్గాలను విమాన ప్రయాణానికి ఎంచుకోవాల్సి ఉంటుంది.

ఇదీ చూడండి:- ఇజ్రాయెల్​-యూఏఈ డీల్​తో ఎవరికి లాభం?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.