ETV Bharat / international

పాకిస్థాన్​కు సౌదీ షాక్.. భారత్​కు దీపావళి కానుక!

author img

By

Published : Oct 28, 2020, 4:32 PM IST

Updated : Oct 28, 2020, 4:41 PM IST

పాకిస్థాన్​తో సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఆ దేశానికి సౌదీ అరేబియా గట్టి షాకిచ్చింది. ఇటీవల కరెన్సీ నోటు విడుదల చేసిన సౌదీ.. అందులో ముద్రించిన ప్రపంచ పటంలో పీఓకే, గిల్గిత్ బాల్టిస్థాన్​ను పాకిస్థాన్​ మ్యాప్​ నుంచి తొలగించింది. ఈ విషయాన్ని ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు పీఓకే ఉద్యమకారుడు అమ్జద్​ అయ్యూబ్.. భారత్​కు సౌదీ అరేబియా దీపావళి బహుమతిగా ఇచ్చిందని పేర్కొన్నారు.

Saudi Arabia
పాకిస్థాన్​కు సౌదీ షాక్

పాకిస్థాన్​ మ్యాప్​ నుంచి పీఓకే, గిల్గిత్ బాల్టిస్థాన్​ను ప్రాంతాలను సౌదీ అరేబియా తొలగించింది. ఈ విషయాన్ని పీఓకే ఉద్యమకారుడు అమ్జద్ అయ్యూబ్ మీర్జా ట్విట్టర్​ ద్వారా బుధవారం తెలిపారు.

"భారత్​కు దీపావళి బహుమతినిచ్చింది సౌదీ అరేబియా. పాకిస్థాన్ మ్యాప్ నుంచి పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్, గిల్గిత్ బాల్టిస్థాన్​ను తొలగించింది. "

- అమ్జద్ అయ్యూబ్ మీర్జా

నవంబర్ 21-22 తేదీల్లో జరిగే జీ-20 సదస్సుకు సౌదీ అరేబియా అధ్యక్షత వహించనుంది. ఈ సందర్భంగా 20 రియాల్ బ్యాంక్ నోటును సౌదీ విడుదల చేసినట్లు కొన్ని వార్తా కథనాలు వచ్చాయి. ఈ నోటుపై ముద్రించిన ప్రపంచ పటంలో.. పాకిస్థాన్​లో కశ్మీర్​, గిల్గిత్ బాల్టిస్థాన్​ను అంతర్భాగంగా చూపలేదని నివేదించాయి.

రెండు దేశాల​ మధ్య సంబంధాలు బలహీన పడిన నేపథ్యంలో సౌదీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్​కు వ్యతిరేకంగా సౌదీ కొత్త విధానాన్ని అనుసరిస్తోందని ఈ నివేదికలు వెల్లడిస్తున్నాయి.

గిల్గిత్​లో ఎన్నికలు..

గిల్గిత్ బాల్టిస్థాన్​, కశ్మీర్​తోపాటు భారత భూభాగాలైన జునాగఢ్, సర్​క్రీక్, గుజరాత్​లోని మనవాడార్ ప్రాంతాలను తమవిగా చెబుతూ ఇటీవల ఇమ్రాన్​ ప్రభుత్వం జాతీయ పటాన్ని విడుదల చేసింది. గిల్గిత్ బాల్టిస్థాన్​లో ఎన్నికలు నిర్వహించాలన్న పాకిస్థాన్​ నిర్ణయాన్ని భారత్​ తీవ్రంగా ఖండిస్తోంది.

ఇదీ చూడండి: పాక్​ 'గిల్గిత్'​ నోటిఫికేషన్​పై భారత్​ ఫైర్​

పాకిస్థాన్​ మ్యాప్​ నుంచి పీఓకే, గిల్గిత్ బాల్టిస్థాన్​ను ప్రాంతాలను సౌదీ అరేబియా తొలగించింది. ఈ విషయాన్ని పీఓకే ఉద్యమకారుడు అమ్జద్ అయ్యూబ్ మీర్జా ట్విట్టర్​ ద్వారా బుధవారం తెలిపారు.

"భారత్​కు దీపావళి బహుమతినిచ్చింది సౌదీ అరేబియా. పాకిస్థాన్ మ్యాప్ నుంచి పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్, గిల్గిత్ బాల్టిస్థాన్​ను తొలగించింది. "

- అమ్జద్ అయ్యూబ్ మీర్జా

నవంబర్ 21-22 తేదీల్లో జరిగే జీ-20 సదస్సుకు సౌదీ అరేబియా అధ్యక్షత వహించనుంది. ఈ సందర్భంగా 20 రియాల్ బ్యాంక్ నోటును సౌదీ విడుదల చేసినట్లు కొన్ని వార్తా కథనాలు వచ్చాయి. ఈ నోటుపై ముద్రించిన ప్రపంచ పటంలో.. పాకిస్థాన్​లో కశ్మీర్​, గిల్గిత్ బాల్టిస్థాన్​ను అంతర్భాగంగా చూపలేదని నివేదించాయి.

రెండు దేశాల​ మధ్య సంబంధాలు బలహీన పడిన నేపథ్యంలో సౌదీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్​కు వ్యతిరేకంగా సౌదీ కొత్త విధానాన్ని అనుసరిస్తోందని ఈ నివేదికలు వెల్లడిస్తున్నాయి.

గిల్గిత్​లో ఎన్నికలు..

గిల్గిత్ బాల్టిస్థాన్​, కశ్మీర్​తోపాటు భారత భూభాగాలైన జునాగఢ్, సర్​క్రీక్, గుజరాత్​లోని మనవాడార్ ప్రాంతాలను తమవిగా చెబుతూ ఇటీవల ఇమ్రాన్​ ప్రభుత్వం జాతీయ పటాన్ని విడుదల చేసింది. గిల్గిత్ బాల్టిస్థాన్​లో ఎన్నికలు నిర్వహించాలన్న పాకిస్థాన్​ నిర్ణయాన్ని భారత్​ తీవ్రంగా ఖండిస్తోంది.

ఇదీ చూడండి: పాక్​ 'గిల్గిత్'​ నోటిఫికేషన్​పై భారత్​ ఫైర్​

Last Updated : Oct 28, 2020, 4:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.