ETV Bharat / international

వేల ఏళ్ల నాటి సంప్రదాయాలు.. బంగారు బగ్గీలో ఊరేగింపు.. రాజు పట్టాభిషేకానికి ఏర్పాట్లు ఘనం

author img

By

Published : May 5, 2023, 3:43 PM IST

UK King coronation : రవి అస్తమించిన బ్రిటిష్‌ సామ్రాజ్యంలో తొలి రాజ పట్టాభిషేకం శనివారం జరగబోతోంది. బ్రిటన్‌ రాజుగా ఇప్పటికే అధికారికంగా నియమితులైన మూడో ఛార్లెస్‌కు వందల ఏళ్లనాటి సంప్రదాయాలను అనుసరించి కిరీటధారణ చేస్తారు. 1953 తర్వాత బ్రిటన్‌లో ఇదే తొలి పట్టాభిషేకం! నిరాడంబరంగా జరగబోతున్న ఈ వేడుకలో ఛార్లెస్‌తో పాటు ఆయన భార్య కెమిల్లా రాణిగా కిరీటం ధరిస్తారు.

UK king coronation
UK king coronation

UK King coronation : బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌-3 పట్టాభిషేకానికి రంగం సిద్ధమైంది. శనివారం ఈ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం ప్రపంచదేశాల అధినేతల మొదలు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు బ్రిటన్‌ తరలివచ్చారు. సుమారు 2వేల మంది అతిథులు, రాజకుటుంబీకులు, విదేశీ ప్రముఖుల సమక్షంలో లండన్‌ వెస్ట్‌మినిస్టర్‌ అబేలో ఈ పట్టాభిషేకం జరుగుతుంది. పట్టాభిషేక కార్యక్రమంలో తొలుత కాంటెర్‌బరీ ఆర్చ్‌బిషప్‌ కింగ్‌ ఛార్లెస్‌ను ఆహూతులకు పరిచయం చేస్తారు. అన్నివైపులా కనిపించేలా నాలుగు దిక్కులా రాజు ప్రదక్షిణ చేస్తున్నట్లు తిరుగుతుంటే ఈ పరిచయం కొనసాగుతుంది. సభికులు 'గాడ్‌ సేవ్‌ ది కింగ్‌' అంటూ ఆశీర్వదిస్తారు.

uk king coronation
వెస్ట్ మినిస్టర్ అబేలోని లోపలి చిత్రం

Coronation King Charles iii : చట్టాన్ని కాపాడతానని, దయతో, న్యాయంతో పాలన కొనసాగిస్తానని ఛార్లెస్‌ ప్రమాణం చేస్తారు. 973లో కింగ్‌ ఎడ్గర్‌ పట్టాభిషేకం సమయంలో చేసిన ప్రమాణంలోని భాగాల్నే చదువుతారు. తర్వాత చర్చి ఆఫ్‌ ఇంగ్లాండ్‌కు నమ్మకస్థుడైన ప్రొటెస్టెంట్‌ క్రిస్టియన్‌గా ఉంటానని ఛార్లెస్‌ రెండో ప్రమాణం చేస్తారు. ప్రమాణం పూర్తికాగానే 1300 సంవత్సరంలో కింగ్‌ ఎడ్వర్డ్‌ చేయించిన సింహాసనంపై కూర్చుంటారు. ఈ సింహాసనం పాతదే అయినా దీనికి సొబగులు అద్దారు. దీనికింది అరలో స్కాట్లాండ్‌ నుంచి తెచ్చిన పవిత్ర రాయిని ఉంచుతారు. 14వ శతాబ్దం నుంచీ పట్టాభిషేకానికి ఇదే కుర్చీని వాడుతున్నారు. ఆ వెంటనే ఆర్చ్‌బిషప్‌ కింగ్‌ ఛార్లెస్‌ను పవిత్ర నూనెతో అభిషేకిస్తారు. చేతులు, ఛాతీ, తలపై నూనెను పోస్తారు. ఇదంతా తెరచాటున జరుగుతుంది. జెరూసలెంలోని పర్వతశ్రేణి మౌంట్‌ ఆఫ్‌ ఆలివ్స్‌లోని ఆలివ్‌ చెట్ల నుంచి తీసిన నూనెను గులాబీ, మల్లె తదితర సుగంధాలతో కలిపి తయారు చేసి తీసుకొస్తారు.

KING CORONATION
ఛార్లెస్-3 చిత్రపటం

నూనెతో అభిషేకం పూర్తికాగానే.. ఛార్లెస్‌కు బంగారుతాపడంతో చేసిన మహారాజ గౌన్‌ తొడిగి కూర్చోబెడతారు. ఆ తర్వాత శిలువతో ఉన్న గోళాకారంలో ఉండే బంగారు రాజముద్ర, రాజదండంను ఆర్చ్‌బిషప్‌ ఆయనకు అందిస్తారు. కుడిచేతి నాలుగో వేలుకు ఉంగరం తొడిగి కిరీట ధారణ చేస్తారు. దీన్ని సెయింట్‌ ఎడ్వర్డ్‌ కిరీటం అంటారు. 1661లో తయారైన 2.23 కిలోల బరువైన ఈ బంగారు కిరీటాన్ని పట్టాభిషేకం రోజున ఒక గంటసేపు మాత్రమే ధరిస్తారు. ఆ తర్వాత తదుపరి రాజు పట్టాభిషేకం దాకా దీన్ని భద్రంగా దాచిపెడతారు. ప్రజల దర్శనార్థం ఛార్లెస్‌ మరో కిరీటాన్ని ధరిస్తారు. కిరీట ధారణ కాగానే.. వచ్చిన ఆహుతులంతా మరోమారు 'గాడ్‌ సేవ్‌ ది కింగ్‌' అంటూ నినాదాలు చేస్తారు.

KING CORONATION
బంగారు తాపడంతో చేసిన బగ్గీ

coronation gold state coach : రాజు ఛార్లెస్‌ పట్టాభిషేక కుర్చీలోంచి లేచి.. రాజ ఖడ్గాన్ని చేతిలో పట్టుకొని మెట్లుదిగి వచ్చి ప్రత్యేకంగా చేయించిన సింహాసనంపై ఆసీనులవుతారు. సింహాసనంపై రాజు కూర్చోగానే ఆర్చ్‌బిషప్‌తో పాటు రాజకుటుంబికులు, రక్తసంబంధీకులైన యువరాజులు, రాజ కుటుంబ సిబ్బంది మోకాళ్లపై వంగి కూర్చొని రాజు కాళ్లకు చేతిని ఆనించి... ఆయన కుడి చేతిని ముద్దాడతారు. ఇది కాగానే... రాణి కెమిల్లాపై పవిత్ర నూనె చల్లి నిరాడంబరంగా కిరీట ధారణ చేస్తారు. ఆమెకు ఎలాంటి ప్రమాణం ఉండదు. మొత్తం ఈ ప్రక్రియంతా 2 గంటల పాటు సాగే అవకాశముంది. 1762లో తయారు చేసి 1831 నుంచి ప్రతి పట్టాభిషేకానికి వాడుతున్న బంగారు తాపడం బగ్గీలో రాజు, రాణి ప్రయాణిస్తారు. 1953 నాటి పట్టాభిషేక కార్యక్రమంతో పోలిస్తే ఊరేగింపు మార్గం తక్కువగా ఉంటుందట. అయినప్పటికీ అది పూర్తికావడానికి 40నిమిషాల సమయం పడుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు.

uk king coronation
రాజవస్త్రాలు

కోహినూర్ లేకుండానే..
రాజు ధరించే బంగారు గౌను, ఇతర దుస్తులు 1821లో జార్జ్‌-4 పట్టాభిషేకం సమయంలో తయారు చేయించినవి. వివాదాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో రాణి కిరీటం లోంచి ప్రతిష్ఠాత్మక కోహినూర్‌ వజ్రాన్ని ఈసారి తొలగించారు. రాణి ధరించే కిరీటాన్ని క్వీన్‌ మేరీ కిరీటం అంటారు. దీన్ని 1911లో చేయించారు. పట్టాభిషేకంలో కిరీటంతో పాటు ఇతర ఆభరణాలన్నీ కలిపి సుమారు 100 దాకా ఉంటాయి. వీటిలో 23వేల రత్నాలు, పగడాల్లాంటివి అమర్చారు. పట్టాభిషేకం కాగానే వీటన్నింటినీ టవర్‌ ఆఫ్‌ లండన్‌లో దాచి ఉంచుతారు. పట్టాభిషేకంలో ధరించే రాజాభరణాల విలువ 300 కోట్ల నుంచి 500 కోట్ల పౌండ్ల దాకా ఉంటుందని అంచనా.

KING CORONATION
ప్రిన్స్ విలియం భార్య కేథరిన్

పట్టాభిషేక కార్యక్రమానికి భారత కరెన్సీలో సుమారు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నట్లు అంచనా. ఈ అధికారిక కార్యక్రమానికి అయ్యే ఖర్చును బ్రిటన్‌ ప్రభుత్వమే చెల్లించనుంది. సాధారణంగా రాజకుటుంబీకుల వివాహాలను సొంత ఖర్చుతో చేసుకున్నప్పటికీ పట్టాభిషేకాన్ని మాత్రం ప్రభుత్వ ఖర్చుతో నిర్వహిస్తున్నారు. అయితే, ఈ కార్యక్రమ టీవీ ప్రసార హక్కుల నుంచి వచ్చే ఆదాయం భారీగానే ఉండనున్నట్లు సమాచారం. కార్యక్రమానికి అయ్యే ఖర్చు కంటే ఎక్కువగా వస్తుందని.. అంతేకాకుండా ఇది పర్యాటకానికి ఎంతో ఊతమిస్తుందని బ్రిటన్‌ మీడియా పేర్కొంది. ఈ కార్యక్రమాన్ని బ్రిటన్‌లో 3.7కోట్ల మంది తిలకిస్తారని అంచనా.

KING CORONATION
.

UK King coronation : బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌-3 పట్టాభిషేకానికి రంగం సిద్ధమైంది. శనివారం ఈ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం ప్రపంచదేశాల అధినేతల మొదలు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు బ్రిటన్‌ తరలివచ్చారు. సుమారు 2వేల మంది అతిథులు, రాజకుటుంబీకులు, విదేశీ ప్రముఖుల సమక్షంలో లండన్‌ వెస్ట్‌మినిస్టర్‌ అబేలో ఈ పట్టాభిషేకం జరుగుతుంది. పట్టాభిషేక కార్యక్రమంలో తొలుత కాంటెర్‌బరీ ఆర్చ్‌బిషప్‌ కింగ్‌ ఛార్లెస్‌ను ఆహూతులకు పరిచయం చేస్తారు. అన్నివైపులా కనిపించేలా నాలుగు దిక్కులా రాజు ప్రదక్షిణ చేస్తున్నట్లు తిరుగుతుంటే ఈ పరిచయం కొనసాగుతుంది. సభికులు 'గాడ్‌ సేవ్‌ ది కింగ్‌' అంటూ ఆశీర్వదిస్తారు.

uk king coronation
వెస్ట్ మినిస్టర్ అబేలోని లోపలి చిత్రం

Coronation King Charles iii : చట్టాన్ని కాపాడతానని, దయతో, న్యాయంతో పాలన కొనసాగిస్తానని ఛార్లెస్‌ ప్రమాణం చేస్తారు. 973లో కింగ్‌ ఎడ్గర్‌ పట్టాభిషేకం సమయంలో చేసిన ప్రమాణంలోని భాగాల్నే చదువుతారు. తర్వాత చర్చి ఆఫ్‌ ఇంగ్లాండ్‌కు నమ్మకస్థుడైన ప్రొటెస్టెంట్‌ క్రిస్టియన్‌గా ఉంటానని ఛార్లెస్‌ రెండో ప్రమాణం చేస్తారు. ప్రమాణం పూర్తికాగానే 1300 సంవత్సరంలో కింగ్‌ ఎడ్వర్డ్‌ చేయించిన సింహాసనంపై కూర్చుంటారు. ఈ సింహాసనం పాతదే అయినా దీనికి సొబగులు అద్దారు. దీనికింది అరలో స్కాట్లాండ్‌ నుంచి తెచ్చిన పవిత్ర రాయిని ఉంచుతారు. 14వ శతాబ్దం నుంచీ పట్టాభిషేకానికి ఇదే కుర్చీని వాడుతున్నారు. ఆ వెంటనే ఆర్చ్‌బిషప్‌ కింగ్‌ ఛార్లెస్‌ను పవిత్ర నూనెతో అభిషేకిస్తారు. చేతులు, ఛాతీ, తలపై నూనెను పోస్తారు. ఇదంతా తెరచాటున జరుగుతుంది. జెరూసలెంలోని పర్వతశ్రేణి మౌంట్‌ ఆఫ్‌ ఆలివ్స్‌లోని ఆలివ్‌ చెట్ల నుంచి తీసిన నూనెను గులాబీ, మల్లె తదితర సుగంధాలతో కలిపి తయారు చేసి తీసుకొస్తారు.

KING CORONATION
ఛార్లెస్-3 చిత్రపటం

నూనెతో అభిషేకం పూర్తికాగానే.. ఛార్లెస్‌కు బంగారుతాపడంతో చేసిన మహారాజ గౌన్‌ తొడిగి కూర్చోబెడతారు. ఆ తర్వాత శిలువతో ఉన్న గోళాకారంలో ఉండే బంగారు రాజముద్ర, రాజదండంను ఆర్చ్‌బిషప్‌ ఆయనకు అందిస్తారు. కుడిచేతి నాలుగో వేలుకు ఉంగరం తొడిగి కిరీట ధారణ చేస్తారు. దీన్ని సెయింట్‌ ఎడ్వర్డ్‌ కిరీటం అంటారు. 1661లో తయారైన 2.23 కిలోల బరువైన ఈ బంగారు కిరీటాన్ని పట్టాభిషేకం రోజున ఒక గంటసేపు మాత్రమే ధరిస్తారు. ఆ తర్వాత తదుపరి రాజు పట్టాభిషేకం దాకా దీన్ని భద్రంగా దాచిపెడతారు. ప్రజల దర్శనార్థం ఛార్లెస్‌ మరో కిరీటాన్ని ధరిస్తారు. కిరీట ధారణ కాగానే.. వచ్చిన ఆహుతులంతా మరోమారు 'గాడ్‌ సేవ్‌ ది కింగ్‌' అంటూ నినాదాలు చేస్తారు.

KING CORONATION
బంగారు తాపడంతో చేసిన బగ్గీ

coronation gold state coach : రాజు ఛార్లెస్‌ పట్టాభిషేక కుర్చీలోంచి లేచి.. రాజ ఖడ్గాన్ని చేతిలో పట్టుకొని మెట్లుదిగి వచ్చి ప్రత్యేకంగా చేయించిన సింహాసనంపై ఆసీనులవుతారు. సింహాసనంపై రాజు కూర్చోగానే ఆర్చ్‌బిషప్‌తో పాటు రాజకుటుంబికులు, రక్తసంబంధీకులైన యువరాజులు, రాజ కుటుంబ సిబ్బంది మోకాళ్లపై వంగి కూర్చొని రాజు కాళ్లకు చేతిని ఆనించి... ఆయన కుడి చేతిని ముద్దాడతారు. ఇది కాగానే... రాణి కెమిల్లాపై పవిత్ర నూనె చల్లి నిరాడంబరంగా కిరీట ధారణ చేస్తారు. ఆమెకు ఎలాంటి ప్రమాణం ఉండదు. మొత్తం ఈ ప్రక్రియంతా 2 గంటల పాటు సాగే అవకాశముంది. 1762లో తయారు చేసి 1831 నుంచి ప్రతి పట్టాభిషేకానికి వాడుతున్న బంగారు తాపడం బగ్గీలో రాజు, రాణి ప్రయాణిస్తారు. 1953 నాటి పట్టాభిషేక కార్యక్రమంతో పోలిస్తే ఊరేగింపు మార్గం తక్కువగా ఉంటుందట. అయినప్పటికీ అది పూర్తికావడానికి 40నిమిషాల సమయం పడుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు.

uk king coronation
రాజవస్త్రాలు

కోహినూర్ లేకుండానే..
రాజు ధరించే బంగారు గౌను, ఇతర దుస్తులు 1821లో జార్జ్‌-4 పట్టాభిషేకం సమయంలో తయారు చేయించినవి. వివాదాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో రాణి కిరీటం లోంచి ప్రతిష్ఠాత్మక కోహినూర్‌ వజ్రాన్ని ఈసారి తొలగించారు. రాణి ధరించే కిరీటాన్ని క్వీన్‌ మేరీ కిరీటం అంటారు. దీన్ని 1911లో చేయించారు. పట్టాభిషేకంలో కిరీటంతో పాటు ఇతర ఆభరణాలన్నీ కలిపి సుమారు 100 దాకా ఉంటాయి. వీటిలో 23వేల రత్నాలు, పగడాల్లాంటివి అమర్చారు. పట్టాభిషేకం కాగానే వీటన్నింటినీ టవర్‌ ఆఫ్‌ లండన్‌లో దాచి ఉంచుతారు. పట్టాభిషేకంలో ధరించే రాజాభరణాల విలువ 300 కోట్ల నుంచి 500 కోట్ల పౌండ్ల దాకా ఉంటుందని అంచనా.

KING CORONATION
ప్రిన్స్ విలియం భార్య కేథరిన్

పట్టాభిషేక కార్యక్రమానికి భారత కరెన్సీలో సుమారు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నట్లు అంచనా. ఈ అధికారిక కార్యక్రమానికి అయ్యే ఖర్చును బ్రిటన్‌ ప్రభుత్వమే చెల్లించనుంది. సాధారణంగా రాజకుటుంబీకుల వివాహాలను సొంత ఖర్చుతో చేసుకున్నప్పటికీ పట్టాభిషేకాన్ని మాత్రం ప్రభుత్వ ఖర్చుతో నిర్వహిస్తున్నారు. అయితే, ఈ కార్యక్రమ టీవీ ప్రసార హక్కుల నుంచి వచ్చే ఆదాయం భారీగానే ఉండనున్నట్లు సమాచారం. కార్యక్రమానికి అయ్యే ఖర్చు కంటే ఎక్కువగా వస్తుందని.. అంతేకాకుండా ఇది పర్యాటకానికి ఎంతో ఊతమిస్తుందని బ్రిటన్‌ మీడియా పేర్కొంది. ఈ కార్యక్రమాన్ని బ్రిటన్‌లో 3.7కోట్ల మంది తిలకిస్తారని అంచనా.

KING CORONATION
.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.