ETV Bharat / international

'భారత్ సమర్థ దేశం.. భారతీయులు ప్రతిభావంతులు'.. పుతిన్‌ ప్రశంసలు

భారత్‌పై వరుసగా ప్రశంసలు కురిపిస్తున్నారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌. ఇటీవలే ప్రధాని మోదీ విదేశాంగ విధానాన్ని పొగిడిన ఆయన.. తాజాగా భారతీయుల నైపుణ్యాన్ని కొనియాడారు.

author img

By

Published : Nov 5, 2022, 3:43 PM IST

Putin praises Indians
భారతీయులు టాలెంటెడ్‌

భారతీయులు ప్రతిభావంతులు అని, అభివృద్ధిలో అత్యుత్తమ ఫలితాలను సాధించగలిగే సమర్థులని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ కొనియాడారు. నవంబరు 4న రష్యా ఐక్యతా దినోత్సవం సందర్భంగా మాస్కోలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పుతిన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ చిరకాల మిత్రదేశమైన భారత్‌పై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు.

"భారత్‌ను చూడండి, దేశ అభివృద్ధి కోసం కృషి చేసే ఎంతో మంది ప్రతిభావంతులు అక్కడ ఉన్నారు. దాదాపు 150 కోట్ల మందితో ఇప్పుడు భారత్‌ సమర్థవంతమైన దేశంగా ఉంది. అభివృద్ధిలో కచ్చితంగా అత్యుత్తమ ఫలితాలను సాధిస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు."
-పుతిన్‌

గతవారం భారత ప్రధాని నరేంద్ర మోదీని పుతిన్‌ పొగడ్తలతో ముంచెత్తారు. ఆయన స్వతంత్ర విదేశాంగ విధానంతో భారత్‌ మరింత పురోగతి సాధించిందని కొనియాడారు. మోదీ గొప్ప దేశభక్తుడని అభివర్ణించారు. "ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అయినందుకు భారత్‌ గర్వించాలి. భవిష్యత్తు భారత్‌దే" అని పుతిన్‌ ప్రశంసించారు.

కాగా, వచ్చే వారంలో భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ రష్యా పర్యటన నేపథ్యంలో.. భారతీయులపై పుతిన్‌ ప్రశంసలు కురిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది. నవంబరు 7-8 తేదీల్లో జైశంకర్‌ మాస్కోలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌తో ద్వైపాక్షిక భేటీలో పాల్గొననున్నారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారంపై వీరు చర్చించనున్నారు.

భారతీయులు ప్రతిభావంతులు అని, అభివృద్ధిలో అత్యుత్తమ ఫలితాలను సాధించగలిగే సమర్థులని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ కొనియాడారు. నవంబరు 4న రష్యా ఐక్యతా దినోత్సవం సందర్భంగా మాస్కోలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పుతిన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ చిరకాల మిత్రదేశమైన భారత్‌పై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు.

"భారత్‌ను చూడండి, దేశ అభివృద్ధి కోసం కృషి చేసే ఎంతో మంది ప్రతిభావంతులు అక్కడ ఉన్నారు. దాదాపు 150 కోట్ల మందితో ఇప్పుడు భారత్‌ సమర్థవంతమైన దేశంగా ఉంది. అభివృద్ధిలో కచ్చితంగా అత్యుత్తమ ఫలితాలను సాధిస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు."
-పుతిన్‌

గతవారం భారత ప్రధాని నరేంద్ర మోదీని పుతిన్‌ పొగడ్తలతో ముంచెత్తారు. ఆయన స్వతంత్ర విదేశాంగ విధానంతో భారత్‌ మరింత పురోగతి సాధించిందని కొనియాడారు. మోదీ గొప్ప దేశభక్తుడని అభివర్ణించారు. "ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అయినందుకు భారత్‌ గర్వించాలి. భవిష్యత్తు భారత్‌దే" అని పుతిన్‌ ప్రశంసించారు.

కాగా, వచ్చే వారంలో భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ రష్యా పర్యటన నేపథ్యంలో.. భారతీయులపై పుతిన్‌ ప్రశంసలు కురిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది. నవంబరు 7-8 తేదీల్లో జైశంకర్‌ మాస్కోలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌తో ద్వైపాక్షిక భేటీలో పాల్గొననున్నారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారంపై వీరు చర్చించనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.