ETV Bharat / international

'సమాచారం ఇస్తే పరిశీలిస్తాం'- పన్నూ హత్య ఆరోపణలపై తొలిసారి స్పందించిన మోదీ

Modi on Pannun Murder News : ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ హత్యకు సంబంధించిన ఆరోపణలపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. భారత దేశ పౌరులు ఇతర దేశాల్లో మంచి లేదా చెడు చేసినట్లు సమాచారం ఇస్తే దానిపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమేరకు ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

author img

By PTI

Published : Dec 20, 2023, 5:00 PM IST

Updated : Dec 20, 2023, 6:49 PM IST

Modi on Pannun Murder News
Modi on Pannun Murder News

Modi on Pannun Murder News : ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత 'సిక్‌ ఫర్‌ జస్టిస్‌' నేత గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ హత్యకు అమెరికాలో జరిగిన కుట్రలో భారత్‌కు చెందిన వ్యక్తి ఉన్నారనే ఆరోపణలపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. ఈ కేసుకు సంబంధించి అలాంటి సమాచారం ఏదైనా తమకు అందిస్తే కచ్చితంగా పరిశీలిస్తామన్నారు. పౌరుడు ఏదైనా మంచి లేదా చెడు చేసినట్లయితే దాన్ని పరిశీలించడానికి సిద్ధంగా ఉన్నట్టు ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఇలాంటి కొన్ని ఘటనలు ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు, ప్రజాస్వామ్య దేశాలైన భారత్‌-అమెరికా మధ్య సంబంధాలను దెబ్బతీయలేవని వ్యాఖ్యానించారు మోదీ.

"భారత దేశ పౌరులు ఇతర దేశాల్లో ఏదైనా చేసినట్లు సమాచారం వస్తే దానిపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. చట్టానికి లోబడి పాలన చేసేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అదేవిధంగా భారత్‌కు వ్యతిరేకంగా కొన్ని ఉగ్రవాద గ్రూపులు విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహించడం ఆందోళనకరం. భావప్రకటనా స్వేచ్ఛ పేరుతో వారు హింసను ప్రేరేపిస్తున్నారు. ఇటీవలి కాలంలో జరిగిన కొన్ని ఘటనలను భారత్‌-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలతో ముడిపెట్టడం భావ్యం కాదు. ఎంతోకాలంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షికంగా బలమైన సంబంధాలు ఉన్నాయి"

--నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

పన్నూ హత్యకు అమెరికాలో కుట్ర జరిగిందంటూ కొన్ని రోజుల క్రితం ఓ కథనం ప్రచురించిన అంతర్జాతీయ మీడియా సంస్థ దాని వెనక భారత్ హస్తం ఉందని పేర్కొంది. ఆ కుట్రలో భారత్‌కు చెందిన నిఖిల్‌ గుప్తా, మరో ప్రభుత్వ ఉద్యోగి ప్రమేయం ఉన్నట్లు అమెరికా ఫెడరల్ ప్రాసిక్యూటర్లు కూడా ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను విదేశాంగ శాఖ ఖండించింది. సంబంధిత విభాగాలు ఆ విషయాన్ని పరిశీలిస్తున్నాయని, దానిపై ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

మరోవైపు 52 ఏళ్ల నిఖిల్ గుప్తాను ఈ ఏడాది జూన్‌లో చెక్ రిపబ్లిక్ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం అతడు ప్రేగ్‌లోని ఓ జైల్లో ఉన్నాడు. అయితే, అతడిని తమకు అప్పగించాలని ఆ దేశంపై అమెరికా ఒత్తిడి తెస్తోంది. ఈ నేపథ్యంలోనే దీనిపై ఇటీవల స్పందించిన భారత వర్గాలు ఈ హత్య కోసం నిఖిల్‌కు భారత్‌ నుంచి ఆదేశాలు అందాయని ఆరోపించడం సరికాదని తెలిపాయి.

'డిసెంబర్​ 13కు ముందు భారత పార్లమెంట్​పై దాడి చేస్తా'- ఖలిస్థానీ ఉగ్రవాది హెచ్చరిక

'ఆ తేదీన విమానాల్లో ప్రయాణిస్తే ప్రమాదమే'- గురుపత్వంత్​ మరోసారి వార్నింగ్​

Modi on Pannun Murder News : ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత 'సిక్‌ ఫర్‌ జస్టిస్‌' నేత గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ హత్యకు అమెరికాలో జరిగిన కుట్రలో భారత్‌కు చెందిన వ్యక్తి ఉన్నారనే ఆరోపణలపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. ఈ కేసుకు సంబంధించి అలాంటి సమాచారం ఏదైనా తమకు అందిస్తే కచ్చితంగా పరిశీలిస్తామన్నారు. పౌరుడు ఏదైనా మంచి లేదా చెడు చేసినట్లయితే దాన్ని పరిశీలించడానికి సిద్ధంగా ఉన్నట్టు ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఇలాంటి కొన్ని ఘటనలు ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు, ప్రజాస్వామ్య దేశాలైన భారత్‌-అమెరికా మధ్య సంబంధాలను దెబ్బతీయలేవని వ్యాఖ్యానించారు మోదీ.

"భారత దేశ పౌరులు ఇతర దేశాల్లో ఏదైనా చేసినట్లు సమాచారం వస్తే దానిపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. చట్టానికి లోబడి పాలన చేసేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అదేవిధంగా భారత్‌కు వ్యతిరేకంగా కొన్ని ఉగ్రవాద గ్రూపులు విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహించడం ఆందోళనకరం. భావప్రకటనా స్వేచ్ఛ పేరుతో వారు హింసను ప్రేరేపిస్తున్నారు. ఇటీవలి కాలంలో జరిగిన కొన్ని ఘటనలను భారత్‌-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలతో ముడిపెట్టడం భావ్యం కాదు. ఎంతోకాలంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షికంగా బలమైన సంబంధాలు ఉన్నాయి"

--నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

పన్నూ హత్యకు అమెరికాలో కుట్ర జరిగిందంటూ కొన్ని రోజుల క్రితం ఓ కథనం ప్రచురించిన అంతర్జాతీయ మీడియా సంస్థ దాని వెనక భారత్ హస్తం ఉందని పేర్కొంది. ఆ కుట్రలో భారత్‌కు చెందిన నిఖిల్‌ గుప్తా, మరో ప్రభుత్వ ఉద్యోగి ప్రమేయం ఉన్నట్లు అమెరికా ఫెడరల్ ప్రాసిక్యూటర్లు కూడా ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను విదేశాంగ శాఖ ఖండించింది. సంబంధిత విభాగాలు ఆ విషయాన్ని పరిశీలిస్తున్నాయని, దానిపై ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

మరోవైపు 52 ఏళ్ల నిఖిల్ గుప్తాను ఈ ఏడాది జూన్‌లో చెక్ రిపబ్లిక్ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం అతడు ప్రేగ్‌లోని ఓ జైల్లో ఉన్నాడు. అయితే, అతడిని తమకు అప్పగించాలని ఆ దేశంపై అమెరికా ఒత్తిడి తెస్తోంది. ఈ నేపథ్యంలోనే దీనిపై ఇటీవల స్పందించిన భారత వర్గాలు ఈ హత్య కోసం నిఖిల్‌కు భారత్‌ నుంచి ఆదేశాలు అందాయని ఆరోపించడం సరికాదని తెలిపాయి.

'డిసెంబర్​ 13కు ముందు భారత పార్లమెంట్​పై దాడి చేస్తా'- ఖలిస్థానీ ఉగ్రవాది హెచ్చరిక

'ఆ తేదీన విమానాల్లో ప్రయాణిస్తే ప్రమాదమే'- గురుపత్వంత్​ మరోసారి వార్నింగ్​

Last Updated : Dec 20, 2023, 6:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.