ETV Bharat / international

అంబులెన్స్​ కాన్వాయ్​పై వైమానిక దాడి- తీవ్రంగా భయపడ్డానన్న ఐరాస చీఫ్!​

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 5, 2023, 8:52 AM IST

Israel Strikes Ambulance UN : గాజా పట్టీలోని షిఫా ఆస్పత్రి బయట అంబులెన్స్​ల కాన్వాయ్​పై జరిగిన వైమానిక దాడి పట్ల ఐక్యరాజ్య సమితి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనతో తాను తీవ్ర భయాందోళనకు గురయ్యానని ఐరాస చీఫ్‌ ఆంటోనియో గుటెరస్‌ తెలిపారు.

Israel Hamas War Latest News
Israel Strikes Ambulance

Israel Strikes Ambulance : గాజాలోని అల్‌ షిఫా ఆస్పత్రి వెలుపల అంబులెన్స్‌ల కాన్వాయ్‌పై వైమానిక దాడి జరగడంపై ఐక్యరాజ్య సమితి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. అంబులెన్స్ కాన్వాయ్‌పై దాడి ఘటనతో తాను తీవ్ర భయాందోళనకు గురయ్యానని ఐరాస చీఫ్‌ ఆంటోనియో గుటెరస్‌ తెలిపారు. అల్‌ షిఫా ఆసుపత్రి వద్ద రహదారులపై చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాల చిత్రాలు భయానకంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆస్పత్రులను ఆహారం, నీరు, ఔషధ, ఇంధన కొరతలు తీవ్రంగా వేధిస్తున్నాయని అక్కడి భయంకర మానవతా సంక్షోభాన్ని గుటెర్రెస్ నొక్కిచెప్పారు. ఆస్పత్రుల్లోని శవాగారాలన్నీ మృతదేహాలతో నిండిపోయాయన్నారు. పిల్లలకు రోగాలు, శ్వాసకోశ వ్యాధుల ప్రబలే అవకాశం ఉందని ఐరాస హెచ్చరించింది. ఇప్పటికైనా బందీలను బేషరతుగా విడిచిపెట్టాలని హమాస్‌కు స్పష్టం చేసింది. ఐక్యరాజ్య సమితి చీఫ్‌ వ్యాఖ్యలపై ఐరాసలోని ఇజ్రాయెల్‌ శాశ్వత ప్రతినిధి ఎర్డాన్‌ మండిపడ్డారు. గుటెరస్‌ వాస్తవం తెలుసుకోకుండా మాట్లాడుతున్నాడని వ్యాఖ్యానించారు.

Israel Hamas War Latest News
గాజా నగరంపై ఇజ్రాయెల్ దాడులు

శరణార్థ శిబిరంపై వైమానిక దాడి!
అంతర్జాతీయంగా కాల్పుల విరమణ విషయంలో పలు దేశాల నుంచి ఒత్తిడి ఎదురవుతున్నా ఇజ్రాయెల్‌ మాత్రం వెనకడుగు వేయటం లేదు. గాజా పట్టీలోని హమాస్‌ మిలిటెంట్ల స్థావరాలపై భీకర దాడులు చేస్తోంది. ప్రధానంగా ఆసుపత్రులు, విద్యాసంస్థలను లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడుతోంది. వీటిని కేంద్రంగా చేసుకొనే హమాస్‌ కార్యకలాపాలు కొనసాగిస్తోందని ఇజ్రాయెల్‌ ముందునుంచి చెబుతూ వస్తోంది. ఇటీవల జబాలియా శరణార్థి శిబిరంపై కూడా దాడికి దిగింది ఇజ్రాయెల్‌. శనివారం మరోసారి ఆ శిబిరంపై వైమానిక దాడి నిర్వహించింది. ఈ ఘటనలో శిబిరంలోని అల్‌ ఫకూరా పాఠశాలలో తలదాచుకుంటున్న 15 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని.. 54 మంది గాయలపాలయ్యారని పాలస్తీనా రెడ్‌ క్రిసెంట్‌ సంస్థ వెల్లడిచింది.

Israel Hamas War Latest News
గాజా పట్టీలో యుద్ధ వాతావరణం

ఇజ్రాయెల్‌ సైనిక పోస్టులపై రాకెట్లు!
ఆల్‌-ఖద్‌ ఆసుపత్రి సమీపంలోనూ ఇజ్రాయెల్‌ భద్రతా దళాలు బాంబులతో బీభత్సం సృష్టంచాయి. ఈ ఘటనలో 21 మంది గాయపడ్డారు. గాజాపై ఇజ్రాయెల్‌ ప్రదర్శిస్తోన్న దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు లెబనాన్‌ నుంచి దాడులు చేసున్న హెజ్‌బొల్లా శనివారం కూడా వాటిని కొనసాగించింది. ఇజ్రాయెల్‌ సైనిక పోస్టులను లక్ష్యంగా చేసుకొని రాకెట్లను ప్రయోగించింది. ఈ పరిణామంతో టెల్‌ అవీవ్‌.. తమ యుద్ధ విమానాలను కూడా రంగంలోకి దింపింది. లెబనాన్‌లో హెజ్‌బొల్లా స్థావరాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. తమ సైనిక పోస్టులపై రాకెట్‌ దాడులు చేయడం వల్లే తాము కూడా ఎదురుదాడికి దిగామని ఇజ్రాయెల్‌ స్పష్టం చేసింది. హమాస్‌కు అండగా ఉంటామని.. అందుకోసం దేనికైనా సిద్ధమని శుక్రవారం హెజ్‌బొల్లా నేత సయ్యద్‌ హసన్‌ నస్రల్లా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా దాడులు జరగాయి. గాజాపై ఇజ్రాయెల్‌ యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి.. లెబనాన్‌ సరిహద్దుల్లో హెజ్‌బొల్లా కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది.

'ఆయనతో నేనిక మాట్లాడను..'
కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్‌ అంగీకరించకపోవడం వల్ల తమ రాయబారిని వెనక్కి రప్పిస్తున్నట్లు తుర్కియే ప్రకటించింది. అయితే ఆ దేశంతో దౌత్య సంబంధాలను మాత్రం పూర్తిగా తెంచుకోవాలనుకోవట్లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్​కు ఎంత చెబుతున్నా మొండిపట్టుతో వ్యవహరిస్తోందని.. ఇక ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుతో తానిక మాట్లాడనని తుర్కియే అధ్యక్షుడు ఎర్డొగాన్‌ పేర్కొన్నారు. అగ్రరాజ్యం అమెరికా సహా ఇతర పశ్చిమ దేశాలు ఇజ్రాయెల్‌కు అండగా నిలబడటాన్ని ఎర్డొగాన్‌ తప్పుబట్టారు. మరోవైపు లాటిన్‌ అమెరికా దేశం హోండురస్‌ కూడా తమ రాయబారిని వెనక్కి పిలిపిస్తున్నట్లు ప్రకటించింది.

హమాస్‌ కీలక నేత ఇంటిపై దాడి!
ఉత్తర గాజాలోని హమాస్‌ సీనియర్‌ నేత ఇస్మాయిల్‌ హనియా నివాసాన్ని కూడా ఇజ్రాయెల్‌ ధ్వంసం చేసింది. ఈ దాడి విషయాన్ని హమాస్‌ అధికారికంగా ధ్రువీకరించింది. ఆ ఇంట్లో హనియా ఇద్దరు కుమారులు ఉంటున్నారని పేర్కొంది. హమాస్‌ వ్యవస్థాపకుడు దివంగత అహ్మద్‌ యాసిన్‌కు సన్నిహితుడైన హనియా 2019 నుంచి ప్రవాస జీవితం గడుపుతున్నారు.

శిథిలాల దిబ్బగా గాజా- స్కూల్​పై ఇజ్రాయెల్​ దాడిలో 15 మంది మృతి

ఆస్పత్రి ప్రాంగణంపై ఇజ్రాయెల్​ రాకెట్ల దాడి- అంబులెన్స్​లు ధ్వంసం, అనేక మంది రోగులు మృతి

Israel Strikes Ambulance : గాజాలోని అల్‌ షిఫా ఆస్పత్రి వెలుపల అంబులెన్స్‌ల కాన్వాయ్‌పై వైమానిక దాడి జరగడంపై ఐక్యరాజ్య సమితి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. అంబులెన్స్ కాన్వాయ్‌పై దాడి ఘటనతో తాను తీవ్ర భయాందోళనకు గురయ్యానని ఐరాస చీఫ్‌ ఆంటోనియో గుటెరస్‌ తెలిపారు. అల్‌ షిఫా ఆసుపత్రి వద్ద రహదారులపై చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాల చిత్రాలు భయానకంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆస్పత్రులను ఆహారం, నీరు, ఔషధ, ఇంధన కొరతలు తీవ్రంగా వేధిస్తున్నాయని అక్కడి భయంకర మానవతా సంక్షోభాన్ని గుటెర్రెస్ నొక్కిచెప్పారు. ఆస్పత్రుల్లోని శవాగారాలన్నీ మృతదేహాలతో నిండిపోయాయన్నారు. పిల్లలకు రోగాలు, శ్వాసకోశ వ్యాధుల ప్రబలే అవకాశం ఉందని ఐరాస హెచ్చరించింది. ఇప్పటికైనా బందీలను బేషరతుగా విడిచిపెట్టాలని హమాస్‌కు స్పష్టం చేసింది. ఐక్యరాజ్య సమితి చీఫ్‌ వ్యాఖ్యలపై ఐరాసలోని ఇజ్రాయెల్‌ శాశ్వత ప్రతినిధి ఎర్డాన్‌ మండిపడ్డారు. గుటెరస్‌ వాస్తవం తెలుసుకోకుండా మాట్లాడుతున్నాడని వ్యాఖ్యానించారు.

Israel Hamas War Latest News
గాజా నగరంపై ఇజ్రాయెల్ దాడులు

శరణార్థ శిబిరంపై వైమానిక దాడి!
అంతర్జాతీయంగా కాల్పుల విరమణ విషయంలో పలు దేశాల నుంచి ఒత్తిడి ఎదురవుతున్నా ఇజ్రాయెల్‌ మాత్రం వెనకడుగు వేయటం లేదు. గాజా పట్టీలోని హమాస్‌ మిలిటెంట్ల స్థావరాలపై భీకర దాడులు చేస్తోంది. ప్రధానంగా ఆసుపత్రులు, విద్యాసంస్థలను లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడుతోంది. వీటిని కేంద్రంగా చేసుకొనే హమాస్‌ కార్యకలాపాలు కొనసాగిస్తోందని ఇజ్రాయెల్‌ ముందునుంచి చెబుతూ వస్తోంది. ఇటీవల జబాలియా శరణార్థి శిబిరంపై కూడా దాడికి దిగింది ఇజ్రాయెల్‌. శనివారం మరోసారి ఆ శిబిరంపై వైమానిక దాడి నిర్వహించింది. ఈ ఘటనలో శిబిరంలోని అల్‌ ఫకూరా పాఠశాలలో తలదాచుకుంటున్న 15 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని.. 54 మంది గాయలపాలయ్యారని పాలస్తీనా రెడ్‌ క్రిసెంట్‌ సంస్థ వెల్లడిచింది.

Israel Hamas War Latest News
గాజా పట్టీలో యుద్ధ వాతావరణం

ఇజ్రాయెల్‌ సైనిక పోస్టులపై రాకెట్లు!
ఆల్‌-ఖద్‌ ఆసుపత్రి సమీపంలోనూ ఇజ్రాయెల్‌ భద్రతా దళాలు బాంబులతో బీభత్సం సృష్టంచాయి. ఈ ఘటనలో 21 మంది గాయపడ్డారు. గాజాపై ఇజ్రాయెల్‌ ప్రదర్శిస్తోన్న దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు లెబనాన్‌ నుంచి దాడులు చేసున్న హెజ్‌బొల్లా శనివారం కూడా వాటిని కొనసాగించింది. ఇజ్రాయెల్‌ సైనిక పోస్టులను లక్ష్యంగా చేసుకొని రాకెట్లను ప్రయోగించింది. ఈ పరిణామంతో టెల్‌ అవీవ్‌.. తమ యుద్ధ విమానాలను కూడా రంగంలోకి దింపింది. లెబనాన్‌లో హెజ్‌బొల్లా స్థావరాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. తమ సైనిక పోస్టులపై రాకెట్‌ దాడులు చేయడం వల్లే తాము కూడా ఎదురుదాడికి దిగామని ఇజ్రాయెల్‌ స్పష్టం చేసింది. హమాస్‌కు అండగా ఉంటామని.. అందుకోసం దేనికైనా సిద్ధమని శుక్రవారం హెజ్‌బొల్లా నేత సయ్యద్‌ హసన్‌ నస్రల్లా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా దాడులు జరగాయి. గాజాపై ఇజ్రాయెల్‌ యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి.. లెబనాన్‌ సరిహద్దుల్లో హెజ్‌బొల్లా కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది.

'ఆయనతో నేనిక మాట్లాడను..'
కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్‌ అంగీకరించకపోవడం వల్ల తమ రాయబారిని వెనక్కి రప్పిస్తున్నట్లు తుర్కియే ప్రకటించింది. అయితే ఆ దేశంతో దౌత్య సంబంధాలను మాత్రం పూర్తిగా తెంచుకోవాలనుకోవట్లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్​కు ఎంత చెబుతున్నా మొండిపట్టుతో వ్యవహరిస్తోందని.. ఇక ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుతో తానిక మాట్లాడనని తుర్కియే అధ్యక్షుడు ఎర్డొగాన్‌ పేర్కొన్నారు. అగ్రరాజ్యం అమెరికా సహా ఇతర పశ్చిమ దేశాలు ఇజ్రాయెల్‌కు అండగా నిలబడటాన్ని ఎర్డొగాన్‌ తప్పుబట్టారు. మరోవైపు లాటిన్‌ అమెరికా దేశం హోండురస్‌ కూడా తమ రాయబారిని వెనక్కి పిలిపిస్తున్నట్లు ప్రకటించింది.

హమాస్‌ కీలక నేత ఇంటిపై దాడి!
ఉత్తర గాజాలోని హమాస్‌ సీనియర్‌ నేత ఇస్మాయిల్‌ హనియా నివాసాన్ని కూడా ఇజ్రాయెల్‌ ధ్వంసం చేసింది. ఈ దాడి విషయాన్ని హమాస్‌ అధికారికంగా ధ్రువీకరించింది. ఆ ఇంట్లో హనియా ఇద్దరు కుమారులు ఉంటున్నారని పేర్కొంది. హమాస్‌ వ్యవస్థాపకుడు దివంగత అహ్మద్‌ యాసిన్‌కు సన్నిహితుడైన హనియా 2019 నుంచి ప్రవాస జీవితం గడుపుతున్నారు.

శిథిలాల దిబ్బగా గాజా- స్కూల్​పై ఇజ్రాయెల్​ దాడిలో 15 మంది మృతి

ఆస్పత్రి ప్రాంగణంపై ఇజ్రాయెల్​ రాకెట్ల దాడి- అంబులెన్స్​లు ధ్వంసం, అనేక మంది రోగులు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.