ETV Bharat / international

అమెరికా నుంచి రష్యాకు ఆయుధ పరికరాల అక్రమ రవాణా.. బైడెన్​ అప్రమత్తం

author img

By

Published : Oct 21, 2022, 6:32 AM IST

ఉక్రెయిన్‌పై దాడికి దిగిన రష్యాను కట్టడి చేసేందుకు అమెరికా ఎన్నో ఆంక్షలను విధించి అమలు చేస్తుండగా.. ఏకంగా ఆ దేశం నుంచే ఆయుధ పరికరాలు అక్రమ మార్గాల్లో తరలిపోతున్న విషయం వెలుగు చూసింది.

america weapons
america weapons

ఉక్రెయిన్‌పై దాడికి దిగిన రష్యాను కట్టడి చేసేందుకు అమెరికా ఎన్నో ఆంక్షలను విధించి అమలు చేస్తుండగా.. ఏకంగా ఆ దేశం నుంచే ఆయుధ పరికరాలు అక్రమ మార్గాల్లో తరలిపోతున్న విషయం వెలుగు చూసింది. నిఘా వర్గాల హెచ్చరికలతో అప్రమత్తమైన బైడెన్‌ ప్రభుత్వాధికారులు.. అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాల గుట్టును ఛేదించారు. న్యూయార్క్‌, కనెక్టికట్‌లలో విడివిడిగా తొమ్మిది మందిపై కేసులు నమోదు చేశారు. నిందితులు అమెరికా కంపెనీల నుంచి ఆయుధ సాంకేతికతలను సేకరించి ఇవ్వడం ద్వారా సంపన్న రష్యా వ్యాపారవేత్తల నుంచి అక్రమ మార్గాల్లో భారీ మొత్తాల్లో నగదును పొందుతున్నారని అభియోగాల్లో అధికారులు ఆరోపించారు. పుతిన్‌ అనుచరులతో పాటు రష్యా సంస్థలు, వ్యాపారవేత్తలపై అమెరికా ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.

ఉక్రెయిన్‌లోని రణ క్షేత్రాల్లో లభించిన పరికరాలను పరిశీలించినప్పుడు అమెరికా నుంచి ఆయుధ వ్యవస్థలు దొంగ రవాణా అవుతున్న విషయం బయటపడింది. రష్యాకు తరలిస్తున్న అణ్వాయుధ సాంకేతిక పరిజ్ఞానం మార్గమధ్యలో లాత్వియాలో పట్టుబడిందని కూడా అమెరికా న్యాయ శాఖ వెల్లడించింది. న్యూయార్క్‌లో అభియోగాలు నమోదైన అయిదుగురు నిందితులూ రష్యన్‌ జాతీయులే. వీరిలో ఇద్దరిని ఇప్పటికే అరెస్టు చేశారు. కనెక్టికట్‌లో కేసులు నమోదైన నలుగురు నిందితుల్లో ఒకరు ఉక్రెయిన్‌ వాసి కాగా ముగ్గురు లాత్వియా జాతీయులు. రష్యాకు అక్రమంగా తరలిస్తున్న పరికరాల్లో బాలిస్టిక్‌, హైపర్‌సోనిక్‌ క్షిపణి వ్యవస్థల్లో, యుద్ధ విమానాల్లో వినియోగించే అధునాతన సెమీకండక్టర్లు, మైక్రోప్రాసెసర్లూ ఉన్నాయి. ఎనిమిది నెలలుగా కొనసాగుతున్న యుద్ధంలో రష్యా... ఆయుధ వ్యవస్థల్లో వినియోగించే పరికరాల కొరతను తీవ్రంగా ఎదుర్కొంటోందని స్పష్టమవుతోందని అమెరికా అధికారులు పేర్కొన్నారు.

ఉక్రెయిన్‌లో తీవ్రమైన విద్యుత్‌ కష్టాలు
విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలపై రష్యా దాడులు ముమ్మరం కావడంతో ఉక్రెయిన్‌లో కరెంటు సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీంతో బంకర్లలో తలదాచుకుంటున్న ఆ దేశ ప్రజల ఇబ్బందులు తీవ్రమయ్యాయి. తమ దేశంలోని విద్యుత్తు వ్యవస్థల్లో 40శాతానికి పైగా దెబ్బతిన్నాయని ఉక్రెయిన్‌ అధికారి ఒకరు తెలిపారు. నీటి సరఫరా వ్యవస్థలూ ధ్వంసమయ్యాయని వెల్లడించారు. శీతాకాలం ప్రారంభం కావడంతో నివాస ప్రాంతాలను వెచ్చగా ఉంచేందుకు విద్యుత్తు సరఫరా ఎంతో కీలకం. దీంతో పగటి పూట విద్యుత్తు సరఫరాలో కోత విధిస్తున్నారు.

ఉక్రెయిన్‌పై డ్రోన్ల దాడి వెనుక ఇరాన్‌ హస్తం: అమెరికా
ఉక్రెయిన్‌లోని పలు లక్ష్యాలపై ఆత్మాహుతి డ్రోన్లతో జరుగుతున్న దాడుల వెనుక ఇరాన్‌ ప్రత్యక్ష హస్తముందని అమెరికా ఆరోపించింది. దీనికి తగిన ఆధారాలున్నాయని తెలిపింది. కొంత మంది ఇరాన్‌ సైనికులు క్రిమియా నుంచి ఆ డ్రోన్లను ఆపరేట్‌ చేస్తున్నారని, రష్యా సైనికులకు శిక్షణ ఇవ్వడంతో పాటు సాంకేతిక మద్దతునూ అందిస్తున్నారని పేర్కొంది. అమెరికా జాతీయ భద్రత మండలి అధికార ప్రతినిధి జాన్‌ కిర్బీ గురువారం వాషింగ్టన్‌లో విలేకరులకు ఈ విషయాన్ని తెలిపారు. ఉక్రెయిన్‌పై దాడికి వినియోగించేందుకు ఇరాన్‌ నుంచి రష్యా డ్రోన్లు కొనుగోలు చేసిందని తొలుత వెల్లడించింది అమెరికానే.

బ్రిటన్‌ నిఘా విమానంపైకి రష్యా క్షిపణి!
నల్లసముద్రంపై ఉన్న అంతర్జాతీయ గగనతలంలో గత నెల ఓ పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పింది. బ్రిటన్‌ వైమానిక దళానికి చెందిన నిఘా విమానం వైపునకు రష్యాకు చెందిన ఎస్‌యు-27 యుద్ధ విమానం నుంచి క్షిపణి ఒకటి దూసుకువచ్చింది. ఆ సమయంలో బ్రిటన్‌ విమానం, రెండు ఎస్‌యు-27 యుద్ధ విమానాలు గగనతలంలో కొద్ది దూరంలో ఎదురెదురుగా వచ్చాయి. అయితే, సాంకేతిక లోపం వల్లే తమ విమానం నుంచి క్షిపణి విడుదలైందని రష్యా రక్షణ మంత్రి సెర్గెయ్‌ షోయిగు ఈ నెల 10న వివరణ పంపించారని బ్రిటన్‌ రక్షణ మంత్రి బెన్‌ వాలెస్‌ గురువారం బ్రిటన్‌ పార్లమెంటుకు తెలిపారు.

ఉక్రెయిన్‌ను వెంటనే వీడండి
ఉక్రెయిన్‌లో యుద్ధం మరింత తీవ్రమవుతున్నందున అక్కడ ఉన్న భారతీయ పౌరులు, విద్యార్థులు వెంటనే ఆ దేశాన్ని వీడి వెళ్లిపోవాలని ఇండియన్‌ ఎంబసీ సూచించింది. ఉక్రెయిన్‌లో పర్యటించడం క్షేమం కాదని హెచ్చరించింది.

ఉక్రెయిన్‌పై దాడికి దిగిన రష్యాను కట్టడి చేసేందుకు అమెరికా ఎన్నో ఆంక్షలను విధించి అమలు చేస్తుండగా.. ఏకంగా ఆ దేశం నుంచే ఆయుధ పరికరాలు అక్రమ మార్గాల్లో తరలిపోతున్న విషయం వెలుగు చూసింది. నిఘా వర్గాల హెచ్చరికలతో అప్రమత్తమైన బైడెన్‌ ప్రభుత్వాధికారులు.. అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాల గుట్టును ఛేదించారు. న్యూయార్క్‌, కనెక్టికట్‌లలో విడివిడిగా తొమ్మిది మందిపై కేసులు నమోదు చేశారు. నిందితులు అమెరికా కంపెనీల నుంచి ఆయుధ సాంకేతికతలను సేకరించి ఇవ్వడం ద్వారా సంపన్న రష్యా వ్యాపారవేత్తల నుంచి అక్రమ మార్గాల్లో భారీ మొత్తాల్లో నగదును పొందుతున్నారని అభియోగాల్లో అధికారులు ఆరోపించారు. పుతిన్‌ అనుచరులతో పాటు రష్యా సంస్థలు, వ్యాపారవేత్తలపై అమెరికా ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.

ఉక్రెయిన్‌లోని రణ క్షేత్రాల్లో లభించిన పరికరాలను పరిశీలించినప్పుడు అమెరికా నుంచి ఆయుధ వ్యవస్థలు దొంగ రవాణా అవుతున్న విషయం బయటపడింది. రష్యాకు తరలిస్తున్న అణ్వాయుధ సాంకేతిక పరిజ్ఞానం మార్గమధ్యలో లాత్వియాలో పట్టుబడిందని కూడా అమెరికా న్యాయ శాఖ వెల్లడించింది. న్యూయార్క్‌లో అభియోగాలు నమోదైన అయిదుగురు నిందితులూ రష్యన్‌ జాతీయులే. వీరిలో ఇద్దరిని ఇప్పటికే అరెస్టు చేశారు. కనెక్టికట్‌లో కేసులు నమోదైన నలుగురు నిందితుల్లో ఒకరు ఉక్రెయిన్‌ వాసి కాగా ముగ్గురు లాత్వియా జాతీయులు. రష్యాకు అక్రమంగా తరలిస్తున్న పరికరాల్లో బాలిస్టిక్‌, హైపర్‌సోనిక్‌ క్షిపణి వ్యవస్థల్లో, యుద్ధ విమానాల్లో వినియోగించే అధునాతన సెమీకండక్టర్లు, మైక్రోప్రాసెసర్లూ ఉన్నాయి. ఎనిమిది నెలలుగా కొనసాగుతున్న యుద్ధంలో రష్యా... ఆయుధ వ్యవస్థల్లో వినియోగించే పరికరాల కొరతను తీవ్రంగా ఎదుర్కొంటోందని స్పష్టమవుతోందని అమెరికా అధికారులు పేర్కొన్నారు.

ఉక్రెయిన్‌లో తీవ్రమైన విద్యుత్‌ కష్టాలు
విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలపై రష్యా దాడులు ముమ్మరం కావడంతో ఉక్రెయిన్‌లో కరెంటు సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీంతో బంకర్లలో తలదాచుకుంటున్న ఆ దేశ ప్రజల ఇబ్బందులు తీవ్రమయ్యాయి. తమ దేశంలోని విద్యుత్తు వ్యవస్థల్లో 40శాతానికి పైగా దెబ్బతిన్నాయని ఉక్రెయిన్‌ అధికారి ఒకరు తెలిపారు. నీటి సరఫరా వ్యవస్థలూ ధ్వంసమయ్యాయని వెల్లడించారు. శీతాకాలం ప్రారంభం కావడంతో నివాస ప్రాంతాలను వెచ్చగా ఉంచేందుకు విద్యుత్తు సరఫరా ఎంతో కీలకం. దీంతో పగటి పూట విద్యుత్తు సరఫరాలో కోత విధిస్తున్నారు.

ఉక్రెయిన్‌పై డ్రోన్ల దాడి వెనుక ఇరాన్‌ హస్తం: అమెరికా
ఉక్రెయిన్‌లోని పలు లక్ష్యాలపై ఆత్మాహుతి డ్రోన్లతో జరుగుతున్న దాడుల వెనుక ఇరాన్‌ ప్రత్యక్ష హస్తముందని అమెరికా ఆరోపించింది. దీనికి తగిన ఆధారాలున్నాయని తెలిపింది. కొంత మంది ఇరాన్‌ సైనికులు క్రిమియా నుంచి ఆ డ్రోన్లను ఆపరేట్‌ చేస్తున్నారని, రష్యా సైనికులకు శిక్షణ ఇవ్వడంతో పాటు సాంకేతిక మద్దతునూ అందిస్తున్నారని పేర్కొంది. అమెరికా జాతీయ భద్రత మండలి అధికార ప్రతినిధి జాన్‌ కిర్బీ గురువారం వాషింగ్టన్‌లో విలేకరులకు ఈ విషయాన్ని తెలిపారు. ఉక్రెయిన్‌పై దాడికి వినియోగించేందుకు ఇరాన్‌ నుంచి రష్యా డ్రోన్లు కొనుగోలు చేసిందని తొలుత వెల్లడించింది అమెరికానే.

బ్రిటన్‌ నిఘా విమానంపైకి రష్యా క్షిపణి!
నల్లసముద్రంపై ఉన్న అంతర్జాతీయ గగనతలంలో గత నెల ఓ పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పింది. బ్రిటన్‌ వైమానిక దళానికి చెందిన నిఘా విమానం వైపునకు రష్యాకు చెందిన ఎస్‌యు-27 యుద్ధ విమానం నుంచి క్షిపణి ఒకటి దూసుకువచ్చింది. ఆ సమయంలో బ్రిటన్‌ విమానం, రెండు ఎస్‌యు-27 యుద్ధ విమానాలు గగనతలంలో కొద్ది దూరంలో ఎదురెదురుగా వచ్చాయి. అయితే, సాంకేతిక లోపం వల్లే తమ విమానం నుంచి క్షిపణి విడుదలైందని రష్యా రక్షణ మంత్రి సెర్గెయ్‌ షోయిగు ఈ నెల 10న వివరణ పంపించారని బ్రిటన్‌ రక్షణ మంత్రి బెన్‌ వాలెస్‌ గురువారం బ్రిటన్‌ పార్లమెంటుకు తెలిపారు.

ఉక్రెయిన్‌ను వెంటనే వీడండి
ఉక్రెయిన్‌లో యుద్ధం మరింత తీవ్రమవుతున్నందున అక్కడ ఉన్న భారతీయ పౌరులు, విద్యార్థులు వెంటనే ఆ దేశాన్ని వీడి వెళ్లిపోవాలని ఇండియన్‌ ఎంబసీ సూచించింది. ఉక్రెయిన్‌లో పర్యటించడం క్షేమం కాదని హెచ్చరించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.