ETV Bharat / international

రెండు నిమిషాలకో ప్రసూతి మరణం.. 10లక్షల మంది మహిళలకు ముప్పు!

మెరుగైన వైద్య సదుపాయాల లేమి, పోషకాహార లోపం వంటి కారణాల వల్ల ప్రతి రెండు నిమిషాలకు ఓ మహిళ ప్రాణాలు కోల్పోతున్నట్లు ఐరాస నివేదిక వెల్లడించింది. 2020లో ప్రపంచవ్యాప్తంగా 2.87 లక్షల ప్రసూతి మరణాలు సంభవించినట్లు పేర్కొంది.

author img

By

Published : Feb 23, 2023, 5:18 PM IST

higher death rates during pregnancy in women
ప్రసవ సమయంలో ప్రతి రెండు నిమిషాలకు ఒక మహిళ మృతి

గర్భధారణ సమయంలో ఎదురవుతున్న అనేక ఆరోగ్య సమస్యలు మహిళలకు ప్రాణాంతకంగా మారుతున్నాయని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ఈ సమస్యల కారణంగా ప్రతి రెండు నిమిషాలకు ఒక మహిళ మరణిస్తున్నట్లు ఐరాస గురువారం ఓ నివేదికను విడుదల చేసింది. 'ట్రెండ్స్ ఇన్​ మెటెర్నల్ మోర్టాలిటీ' పేరుతో ఐరాస ఏజెన్సీలు.. ఇటీవలి కాలంలో మహిళల ఆరోగ్యంపై చేసిన రీసెర్చ్​లో ఈ అంశాలు వెలుగులోకి వచ్చాయి. 2020లో ప్రపంచవ్యాప్తంగా 287,000 ప్రసూతి మరణాలు సంభవించినట్లు ఈ నివేదిక వెల్లడించింది. తీవ్ర రక్తస్రావం, అధిక రక్తపోటు, గర్భధారణ సమయంలో వచ్చే అంటువ్యాధులు, హెచ్​ఐవీ, ఎయిడ్స్, మలేరియా వంటి అనేక వ్యాధుల కారణంగా ప్రెగ్నెన్సీ మహిళల మరణాలు సంభవిస్తున్నాయి. నాణ్యమైన వైద్యం అందిస్తే ఈ మరణాలను నివారించవచ్చని నివేదిక పేర్కొంది.

"గర్భధారణ అనేది మహిళలకు గొప్ప వరం. గర్భధారణ అనేది సానుకూలమైన అనుభవంగా ఉండాలి. కానీ చాలా మందికి సమయానికి మెరుగైన వైద్యం, పోషకాహారం అందకపోవటం కారణంగా ఈ మధురానుభవం వారిలో విషాదాన్ని మిగుల్చుతోంది" అని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి స్త్రీకి గర్భధారణ మొదలుకొని ప్రసవం వరకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని ఈ అధ్యయనం చెబుతోందని టెడ్రోస్ పేర్కొన్నారు. ప్రాథమిక వైద్య కేంద్రాలకు సరైన వసతులు కల్పించాలని పిలుపునిచ్చారు. శిశువులకు టీకాలు, పోషకాహారం అందించడం సహా కుటుంబ నియంత్రణ వంటి సేవల కోసం కమ్యూనిటీ సెంటర్లను బలోపేతం చేయాలని సూచించారు.

ప్రసూతి వైద్య సంరక్షణను కరోనా మహమ్మారి మరింతగా దెబ్బతీసిందని నివేదిక పేర్కొంది. గర్భధారణ సమయంలో వచ్చే సమస్యలను కరోనా ఇన్ఫెక్షన్ మరింత పెంచిందని పేర్కొంది. ప్రసూతి మరణాలు నియంత్రణలోకి రావాలంటే దేశాలు పదునైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. లేదంటే 2030 నాటికి 10 లక్షల మంది మహిళల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని హెచ్చరించింది.

ఇవీ చదవండి:

గర్భధారణ సమయంలో ఎదురవుతున్న అనేక ఆరోగ్య సమస్యలు మహిళలకు ప్రాణాంతకంగా మారుతున్నాయని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ఈ సమస్యల కారణంగా ప్రతి రెండు నిమిషాలకు ఒక మహిళ మరణిస్తున్నట్లు ఐరాస గురువారం ఓ నివేదికను విడుదల చేసింది. 'ట్రెండ్స్ ఇన్​ మెటెర్నల్ మోర్టాలిటీ' పేరుతో ఐరాస ఏజెన్సీలు.. ఇటీవలి కాలంలో మహిళల ఆరోగ్యంపై చేసిన రీసెర్చ్​లో ఈ అంశాలు వెలుగులోకి వచ్చాయి. 2020లో ప్రపంచవ్యాప్తంగా 287,000 ప్రసూతి మరణాలు సంభవించినట్లు ఈ నివేదిక వెల్లడించింది. తీవ్ర రక్తస్రావం, అధిక రక్తపోటు, గర్భధారణ సమయంలో వచ్చే అంటువ్యాధులు, హెచ్​ఐవీ, ఎయిడ్స్, మలేరియా వంటి అనేక వ్యాధుల కారణంగా ప్రెగ్నెన్సీ మహిళల మరణాలు సంభవిస్తున్నాయి. నాణ్యమైన వైద్యం అందిస్తే ఈ మరణాలను నివారించవచ్చని నివేదిక పేర్కొంది.

"గర్భధారణ అనేది మహిళలకు గొప్ప వరం. గర్భధారణ అనేది సానుకూలమైన అనుభవంగా ఉండాలి. కానీ చాలా మందికి సమయానికి మెరుగైన వైద్యం, పోషకాహారం అందకపోవటం కారణంగా ఈ మధురానుభవం వారిలో విషాదాన్ని మిగుల్చుతోంది" అని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి స్త్రీకి గర్భధారణ మొదలుకొని ప్రసవం వరకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని ఈ అధ్యయనం చెబుతోందని టెడ్రోస్ పేర్కొన్నారు. ప్రాథమిక వైద్య కేంద్రాలకు సరైన వసతులు కల్పించాలని పిలుపునిచ్చారు. శిశువులకు టీకాలు, పోషకాహారం అందించడం సహా కుటుంబ నియంత్రణ వంటి సేవల కోసం కమ్యూనిటీ సెంటర్లను బలోపేతం చేయాలని సూచించారు.

ప్రసూతి వైద్య సంరక్షణను కరోనా మహమ్మారి మరింతగా దెబ్బతీసిందని నివేదిక పేర్కొంది. గర్భధారణ సమయంలో వచ్చే సమస్యలను కరోనా ఇన్ఫెక్షన్ మరింత పెంచిందని పేర్కొంది. ప్రసూతి మరణాలు నియంత్రణలోకి రావాలంటే దేశాలు పదునైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. లేదంటే 2030 నాటికి 10 లక్షల మంది మహిళల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని హెచ్చరించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.