ETV Bharat / international

' ఆరు వారాల తర్వాత పెరిగిన కొవిడ్ మృతుల సంఖ్య'

author img

By

Published : Mar 23, 2021, 8:37 AM IST

కరోనా కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ). ఆరు వారాల తర్వాత కొవిడ్ మృతుల సంఖ్య పెరిగిందని వెల్లడించింది.

WHO: Global coronavirus deaths rise for first time in 6 weeks
'6 వారాల్లో భారీగా పెరిగిన కరోనా మరణాలు'

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​ మృతుల సంఖ్య ఆరు వారాల తర్వాత మళ్లీ పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) తెలిపింది. భారీ స్థాయిలో మరణాలు నమోదవడంపై కొవిడ్​-19 ప్రత్యేక నిపుణురాలు మరియా వాన్​ కెర్ఖోవ్​ ఆందోళన వ్యక్తం చేశారు. డబ్ల్యూహెచ్​ఓ గుర్తించిన ఆరు వైరస్​ వ్యాప్తి ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టినప్పటికీ.. నాలుగు చోట్ల పెద్దఎత్తున కరోనా కేసులు బయటపడ్డాయని చెప్పారు.

"ప్రపంచ వ్యాప్తంగా ఒక్క వారంలోనే 8 శాతం కేసులు పెరిగాయి. ఐరోపాలో సుమారు 12శాతానికిపైగా బాధితులు పెరిగారు. బ్రిటన్​లో వెలుగుచూసిన వైరస్​ కారణంగానే ఐరోపాలో కొవిడ్​ తీవ్రత అధికంగా ఉంది."

-మరియా వాన్​ కెర్ఖోవ్, డబ్ల్యూహెచ్​ఓ నిపుణురాలు

ఆగ్నేయాసియా ప్రాంతంలో వారం వ్యవధిలోనే.. 49శాతం కేసులు పెరిగాయని కెర్ఖోవ్​ వెల్లడించారు. పశ్చిమ పసిఫిక్​ ప్రాంతంలో 29శాతం పెరగ్గా.. ఫిలిప్పీన్స్​లో వ్యాప్తి అధికంగా ఉందని చెప్పారు. తూర్పు మధ్యదరా ప్రాంతంలో కేసులు 8 శాతం మేర పెరిగాయన్నారు.

వైరస్​ వ్యాప్తిని అరికట్టేందుకు వ్యాక్సిన్​ మాత్రమే సరిపోదన్న కెర్ఖోవ్​.. ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించడం కీలకమని స్పష్టం చేశారు.

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​ మృతుల సంఖ్య ఆరు వారాల తర్వాత మళ్లీ పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) తెలిపింది. భారీ స్థాయిలో మరణాలు నమోదవడంపై కొవిడ్​-19 ప్రత్యేక నిపుణురాలు మరియా వాన్​ కెర్ఖోవ్​ ఆందోళన వ్యక్తం చేశారు. డబ్ల్యూహెచ్​ఓ గుర్తించిన ఆరు వైరస్​ వ్యాప్తి ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టినప్పటికీ.. నాలుగు చోట్ల పెద్దఎత్తున కరోనా కేసులు బయటపడ్డాయని చెప్పారు.

"ప్రపంచ వ్యాప్తంగా ఒక్క వారంలోనే 8 శాతం కేసులు పెరిగాయి. ఐరోపాలో సుమారు 12శాతానికిపైగా బాధితులు పెరిగారు. బ్రిటన్​లో వెలుగుచూసిన వైరస్​ కారణంగానే ఐరోపాలో కొవిడ్​ తీవ్రత అధికంగా ఉంది."

-మరియా వాన్​ కెర్ఖోవ్, డబ్ల్యూహెచ్​ఓ నిపుణురాలు

ఆగ్నేయాసియా ప్రాంతంలో వారం వ్యవధిలోనే.. 49శాతం కేసులు పెరిగాయని కెర్ఖోవ్​ వెల్లడించారు. పశ్చిమ పసిఫిక్​ ప్రాంతంలో 29శాతం పెరగ్గా.. ఫిలిప్పీన్స్​లో వ్యాప్తి అధికంగా ఉందని చెప్పారు. తూర్పు మధ్యదరా ప్రాంతంలో కేసులు 8 శాతం మేర పెరిగాయన్నారు.

వైరస్​ వ్యాప్తిని అరికట్టేందుకు వ్యాక్సిన్​ మాత్రమే సరిపోదన్న కెర్ఖోవ్​.. ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించడం కీలకమని స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.