ETV Bharat / international

'కరోనా మూలాలపై దర్యాప్తును రాజకీయం చేయొద్దు'

author img

By

Published : Dec 1, 2020, 9:23 AM IST

కొవిడ్​-19 వైరస్​పై ప్రపంచ ఆరోగ్య సంస్థ వైఖరి స్పష్టంగా ఉందని పునరుద్ఘాటించారు ఆ సంస్థ చీఫ్​ టెడ్రోస్​ అథనోమ్​. వైరస్​ మూలాల్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, అది భవిష్యత్తు మహమ్మారులను నివారించేందుకు దోహదపడుతుందని సూచించారు. కరోనా మూలాల్ని కనుగొనే దర్యాప్తుపై రాజకీయం చేయొద్దని ప్రపంచ నేతలను కోరారు.

Tedros Adhanom
టెడ్రోస్​ అథనోమ్

కరోనా మహమ్మారి మూలాల్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధినేత టెడ్రోస్​ అథనోమ్​​. కొవిడ్​ మూలాలపై జరుగుతున్న దర్యాప్తును రాజకీయం చేయొద్దని ప్రపంచ నేతలను కోరారు. అది కరోనా వెనకున్న నిజానిజాలు తెల్చేందుకు ఉపయోగపడదని సూచించారు.

ఈ మేరకు మీడియా సమావేశంలో కీలక విషయాలు వెల్లడించారు టెడ్రోస్​. కరోనా మూలాలపై అధ్యయనాన్ని వుహాన్​ నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. అక్కడ లభించిన ఆధారాల మేరకు అవసరమైతే ఇతర కేంద్రాలకు విస్తరిస్తామని తెలిపారు.

" కొవిడ్​ మూలాల్ని తెలుసుకునేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నాం. కొందరు దీనిని రాజకీయం చేస్తున్నారు. వుహాన్​ నుంచి ఈ అధ్యయనం ప్రారంభమవుతుందని స్పష్టంగా తెలియజేస్తున్నాం. అక్కడ ఏం జరుగుతోందని తెలుసుకోవటం సహా లభించిన ఆధారాలను అనుసరించి ఇతర ప్రాంతాలకు విస్తరిస్తాం. కరోనాపై డబ్ల్యూహెచ్​ఓ వైఖరి చాలా స్పష్టంగా ఉందని మీకు భరోసా ఇస్తున్నా. వైరస్​ మూలాల్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అది భవిష్యత్తులో ఎదురయ్యే మహమ్మారులను నివారించేందుకు సాయపడుతుంది. "

- టెడ్రోస్​ అథనోమ్​, డబ్ల్యూహెచ్​ఓ చీఫ్​

ఐరోపాలో కొత్త కేసుల నమోదులో తగ్గుదలతో గత సెప్టెంబర్​ నుంచి ప్రపంచవ్యాప్తంగా కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయన్నారు టెడ్రోస్​. అందుకు కఠిన చర్యలు అమలు చేసిన దేశాలకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే.. ఇప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లేదంటే ఇన్నాళ్లు సాధించిన విజయం కోల్పోయే ప్రమాదం లేకపోలేదని హెచ్చరించారు.

ఇదీ చూడండి:చైనాలో కరోనా పుట్టలేదనడం ఊహే: డబ్ల్యూహెచ్‌ఓ

కరోనా మహమ్మారి మూలాల్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధినేత టెడ్రోస్​ అథనోమ్​​. కొవిడ్​ మూలాలపై జరుగుతున్న దర్యాప్తును రాజకీయం చేయొద్దని ప్రపంచ నేతలను కోరారు. అది కరోనా వెనకున్న నిజానిజాలు తెల్చేందుకు ఉపయోగపడదని సూచించారు.

ఈ మేరకు మీడియా సమావేశంలో కీలక విషయాలు వెల్లడించారు టెడ్రోస్​. కరోనా మూలాలపై అధ్యయనాన్ని వుహాన్​ నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. అక్కడ లభించిన ఆధారాల మేరకు అవసరమైతే ఇతర కేంద్రాలకు విస్తరిస్తామని తెలిపారు.

" కొవిడ్​ మూలాల్ని తెలుసుకునేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నాం. కొందరు దీనిని రాజకీయం చేస్తున్నారు. వుహాన్​ నుంచి ఈ అధ్యయనం ప్రారంభమవుతుందని స్పష్టంగా తెలియజేస్తున్నాం. అక్కడ ఏం జరుగుతోందని తెలుసుకోవటం సహా లభించిన ఆధారాలను అనుసరించి ఇతర ప్రాంతాలకు విస్తరిస్తాం. కరోనాపై డబ్ల్యూహెచ్​ఓ వైఖరి చాలా స్పష్టంగా ఉందని మీకు భరోసా ఇస్తున్నా. వైరస్​ మూలాల్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అది భవిష్యత్తులో ఎదురయ్యే మహమ్మారులను నివారించేందుకు సాయపడుతుంది. "

- టెడ్రోస్​ అథనోమ్​, డబ్ల్యూహెచ్​ఓ చీఫ్​

ఐరోపాలో కొత్త కేసుల నమోదులో తగ్గుదలతో గత సెప్టెంబర్​ నుంచి ప్రపంచవ్యాప్తంగా కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయన్నారు టెడ్రోస్​. అందుకు కఠిన చర్యలు అమలు చేసిన దేశాలకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే.. ఇప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లేదంటే ఇన్నాళ్లు సాధించిన విజయం కోల్పోయే ప్రమాదం లేకపోలేదని హెచ్చరించారు.

ఇదీ చూడండి:చైనాలో కరోనా పుట్టలేదనడం ఊహే: డబ్ల్యూహెచ్‌ఓ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.