ETV Bharat / international

ఎంపీలకు ప్రధాని డ్రింక్స్ పార్టీ- వారికి మాత్రమే ఎంట్రీ!

author img

By

Published : Sep 7, 2021, 9:58 PM IST

సీనియర్ ఎంపీలకు ప్రధాని ఇవనున్న డ్రింక్స్​ పార్టీ వివాదానికి కారణమైంది. పార్టీకి వచ్చే ఎంపీలు కొవిడ్ పాస్​ తీసుకురావాలని నిబంధనల విధించడమే ఇందుకు కారణం. అయితే ఇది బ్రిటన్​లో జరిగింది.

PM drinks party
ఎంపీలకు డ్రింక్స్ పార్టీ

బ్రిటన్​ ప్రధానమంత్రి బోరిస్​ జాన్సన్​.. ఎంపీలకు ఇవనున్న డ్రింక్స్​ పార్టీ చర్చనీయాంశమైంది. కరోనా కట్టడిలో భాగంగా విధించిన రూల్స్ ఇందుకు ప్రధాన కారణం.

ఇంతకీ ఏమైంది?

సొంత పార్టీకి చెందిన సీనియర్ ఎంపీలకు మంగళవారం సాయంత్రం(యూకే కాలమానం ప్రకారం) 10 డౌనింగ్ స్ట్రీట్​లో విందు, డ్రింక్స్​ పార్టీ ఇవనున్నారు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్​. అయితే పార్టీకి వచ్చే వారంతా.. కొవిడ్ పాస్​ తీసుకురావాలని నిబంధన పెట్టారు. అంటే.. రెండు డోసుల కొవిడ్​ వ్యాక్సిన్​ లేదా కరోనా నెగెటివ్ రిపోర్ట్​ (కొత్తది) ఉండాలనేదే ఈ కొవిడ్​ పాస్​. కరోనా వేగంగా విజృంభిస్తున్నందున.. కట్టడి చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

అయితే దీనిపై పలువురు ఎంపీలు సంతృప్తిగా లేరని ఓ వార్తా సంస్థ కథనం రాసుకొచ్చింది. అదే పార్టీపై కొందరు ఎంపీలు చేసిన వ్యాఖ్యలను ఆ కథనంలో పేర్కొంది.

'పార్టీకి వచ్చినప్పుడు నన్ను కొవిడ్ రిపోర్ట్​ అడిగితే దానిని మార్యాదపూర్వకంగా తిరస్కరిస్తా. ఇది కాకపోతే చాలా పార్టీలు ఉన్నాయి,' కన్జర్వేటివ్​ పార్టీ ఎంపీ సర్​ డెస్మోండ్​ స్వైనీ.

'బోరిస్​ జాన్సన్​ను పార్లమెంట్​లో కలిసేందుకు అవసరం లేని కొవిడ్ పాస్​.. డౌనింగ్ స్ట్రీట్​లో మాత్రమే ఎందుకు?,' అని మరో ఎంపీ ప్రశ్నించారు.

ఈ వివాదం నేపథ్యంలో డౌనింగ్ స్ట్రీట్ వివరణ ఇచ్చింది. ఒకవేళ ఎవరైనా వ్యాక్సిన్, కొవిడ్ రిపోర్ట్​తో రాకుంటే వారిని తిరిగి పంపరని డౌనింగ్​ స్ట్రీట్​ వర్గాలు.. స్పష్టతనిచ్చాయి.

ఇదీ చదవండి: అఫ్గాన్ నుంచి పౌరుల తరలింపునకు అమెరికా​ కొత్త స్కెచ్​

బ్రిటన్​ ప్రధానమంత్రి బోరిస్​ జాన్సన్​.. ఎంపీలకు ఇవనున్న డ్రింక్స్​ పార్టీ చర్చనీయాంశమైంది. కరోనా కట్టడిలో భాగంగా విధించిన రూల్స్ ఇందుకు ప్రధాన కారణం.

ఇంతకీ ఏమైంది?

సొంత పార్టీకి చెందిన సీనియర్ ఎంపీలకు మంగళవారం సాయంత్రం(యూకే కాలమానం ప్రకారం) 10 డౌనింగ్ స్ట్రీట్​లో విందు, డ్రింక్స్​ పార్టీ ఇవనున్నారు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్​. అయితే పార్టీకి వచ్చే వారంతా.. కొవిడ్ పాస్​ తీసుకురావాలని నిబంధన పెట్టారు. అంటే.. రెండు డోసుల కొవిడ్​ వ్యాక్సిన్​ లేదా కరోనా నెగెటివ్ రిపోర్ట్​ (కొత్తది) ఉండాలనేదే ఈ కొవిడ్​ పాస్​. కరోనా వేగంగా విజృంభిస్తున్నందున.. కట్టడి చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

అయితే దీనిపై పలువురు ఎంపీలు సంతృప్తిగా లేరని ఓ వార్తా సంస్థ కథనం రాసుకొచ్చింది. అదే పార్టీపై కొందరు ఎంపీలు చేసిన వ్యాఖ్యలను ఆ కథనంలో పేర్కొంది.

'పార్టీకి వచ్చినప్పుడు నన్ను కొవిడ్ రిపోర్ట్​ అడిగితే దానిని మార్యాదపూర్వకంగా తిరస్కరిస్తా. ఇది కాకపోతే చాలా పార్టీలు ఉన్నాయి,' కన్జర్వేటివ్​ పార్టీ ఎంపీ సర్​ డెస్మోండ్​ స్వైనీ.

'బోరిస్​ జాన్సన్​ను పార్లమెంట్​లో కలిసేందుకు అవసరం లేని కొవిడ్ పాస్​.. డౌనింగ్ స్ట్రీట్​లో మాత్రమే ఎందుకు?,' అని మరో ఎంపీ ప్రశ్నించారు.

ఈ వివాదం నేపథ్యంలో డౌనింగ్ స్ట్రీట్ వివరణ ఇచ్చింది. ఒకవేళ ఎవరైనా వ్యాక్సిన్, కొవిడ్ రిపోర్ట్​తో రాకుంటే వారిని తిరిగి పంపరని డౌనింగ్​ స్ట్రీట్​ వర్గాలు.. స్పష్టతనిచ్చాయి.

ఇదీ చదవండి: అఫ్గాన్ నుంచి పౌరుల తరలింపునకు అమెరికా​ కొత్త స్కెచ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.