ETV Bharat / international

కరోనా విజృంభణతో ప్రపంచవ్యాప్తంగా మళ్లీ ఆంక్షలు

author img

By

Published : Mar 28, 2021, 9:53 PM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. వివిధ దేశాల్లో కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పెళ్లిళ్లు, బహిరంగ సమావేశాలపై నిషేధం విధించాలని నిర్ణయించింది పాకిస్థాన్​. ఫ్రాన్స్​లోనూ లాక్​డౌన్​ విధించాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. బ్రిటన్​లో మాత్రం టీకా ప్రక్రియ పెద్ద ఎత్తున జరుగుతున్నందున ఆంక్షలు సడలిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

doctors demand for lockdown in France
ఫ్రాన్స్​లో లాక్​డౌన్​కు డిమాండ్

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో వైరస్​ నియంత్రణకు వివిధ దేశాలు కొత్తగా ఆంక్షలు విధిస్తున్నాయి. పలు దేశాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి.

పాక్​లో సమావేశాలపై ఆంక్షలు..

కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్​లో ఏప్రిల్​ 5 నుంచి సమావేశాలపై ఆంక్షలు విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాజిటివిటీ రేటు 8 శాతంకన్నా ఎక్కువగా ఉంటే.. ఆయా ప్రాంతాల్లో వివాహ వేడుకలన్నింటిపైనా నిషేధం విధించాలని సూచించింది. అత్యవసరం అనుకుంటే ఏప్రిల్​ 5 కన్నా ముందే ఆంక్షలు అమలు చేసేందుకు స్థానిక యంత్రాంగానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది.

పాకిస్థాన్​లో ఇప్పటి వరకు 6,54,591 కేసులు నమోదయ్యాయి. 14,215 మంది మరణించారు.

బ్రిటన్​లో ఆంక్షల సడలింపులు..

ఐరోపాలోని పొరుగుదేశాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నా.. లాక్​డౌన్​పై బ్రిటన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పక్క దేశాలతో పోలిస్తే.. వ్యాక్సినేషన్​ రేటు అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రధాని బోరిస్​ జాన్సన్​ 'స్టే ఎట్​ హోం' నిబంధనలను కాస్త సడలించారు. దీనితో ఆరుగురికి మించకుండా బహిరంగ ప్రదేశాల్లో ఇతరులను కలిసేందుకు వీలు కలగనుంది. గోల్ఫ్​, టెన్నిస్​, బాస్కెట్ బాల్ వంటి ఆటలకు కూడా వెసులుబాటు ఇచ్చింది ప్రభుత్వం.

స్కాట్​లాండ్​, వేల్స్​, నార్తన్​ ఐర్లాండ్​​లు కూడా ఇంచు మించు ఇలాంటి సడలింపులే ఇచ్చాయి.

ఫ్రాన్స్​లో డాక్టర్ల హెచ్చరిక..

కరోనా కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో అత్యవసర సేవలందించే డాక్టర్లు ప్రజలు, ప్రభుత్వానికి హెచ్చరికలు చేశారు. కేసులు ఇదే స్థాయిలో పెరిగితే.. పారిస్​లో సామర్థ్యానికి మించి రోగులు చేరొచ్చని తెలిపారు. ఈ కారణంగా దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ విధించాలని డిమాండ్​ చేస్తున్నారు.

ఇమాన్యుయల్ మేక్రాన్​ ప్రభుత్వం మాత్రం ఈ ఏడాది జనవరి నుంచి లాక్​డౌన్​కి​ బదులు.. రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తూ క్రమంగా ఆంక్షలను సడలిస్తూ వస్తోంది. మరో మారు దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ ఉండబోదని చెబుతోంది.

ఇదీ చదవండి:లాక్​డౌన్​ వద్దంటూ బ్రిటన్​లో హింస

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో వైరస్​ నియంత్రణకు వివిధ దేశాలు కొత్తగా ఆంక్షలు విధిస్తున్నాయి. పలు దేశాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి.

పాక్​లో సమావేశాలపై ఆంక్షలు..

కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్​లో ఏప్రిల్​ 5 నుంచి సమావేశాలపై ఆంక్షలు విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాజిటివిటీ రేటు 8 శాతంకన్నా ఎక్కువగా ఉంటే.. ఆయా ప్రాంతాల్లో వివాహ వేడుకలన్నింటిపైనా నిషేధం విధించాలని సూచించింది. అత్యవసరం అనుకుంటే ఏప్రిల్​ 5 కన్నా ముందే ఆంక్షలు అమలు చేసేందుకు స్థానిక యంత్రాంగానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది.

పాకిస్థాన్​లో ఇప్పటి వరకు 6,54,591 కేసులు నమోదయ్యాయి. 14,215 మంది మరణించారు.

బ్రిటన్​లో ఆంక్షల సడలింపులు..

ఐరోపాలోని పొరుగుదేశాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నా.. లాక్​డౌన్​పై బ్రిటన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పక్క దేశాలతో పోలిస్తే.. వ్యాక్సినేషన్​ రేటు అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రధాని బోరిస్​ జాన్సన్​ 'స్టే ఎట్​ హోం' నిబంధనలను కాస్త సడలించారు. దీనితో ఆరుగురికి మించకుండా బహిరంగ ప్రదేశాల్లో ఇతరులను కలిసేందుకు వీలు కలగనుంది. గోల్ఫ్​, టెన్నిస్​, బాస్కెట్ బాల్ వంటి ఆటలకు కూడా వెసులుబాటు ఇచ్చింది ప్రభుత్వం.

స్కాట్​లాండ్​, వేల్స్​, నార్తన్​ ఐర్లాండ్​​లు కూడా ఇంచు మించు ఇలాంటి సడలింపులే ఇచ్చాయి.

ఫ్రాన్స్​లో డాక్టర్ల హెచ్చరిక..

కరోనా కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో అత్యవసర సేవలందించే డాక్టర్లు ప్రజలు, ప్రభుత్వానికి హెచ్చరికలు చేశారు. కేసులు ఇదే స్థాయిలో పెరిగితే.. పారిస్​లో సామర్థ్యానికి మించి రోగులు చేరొచ్చని తెలిపారు. ఈ కారణంగా దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ విధించాలని డిమాండ్​ చేస్తున్నారు.

ఇమాన్యుయల్ మేక్రాన్​ ప్రభుత్వం మాత్రం ఈ ఏడాది జనవరి నుంచి లాక్​డౌన్​కి​ బదులు.. రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తూ క్రమంగా ఆంక్షలను సడలిస్తూ వస్తోంది. మరో మారు దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ ఉండబోదని చెబుతోంది.

ఇదీ చదవండి:లాక్​డౌన్​ వద్దంటూ బ్రిటన్​లో హింస

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.