ETV Bharat / international

'రైతులు, కేంద్రం సంయమనం పాటించాలి'

author img

By

Published : Feb 6, 2021, 8:09 AM IST

నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతోన్న ఆందోళనలపై ఐరాస మానవహక్కుల కమిషన్​ స్పందించింది. రైతులు, కేంద్రం సంయమనం పాటించాలని కోరింది. అందరి మానవ హక్కులను గౌరవిస్తూ సమస్యకు పరిష్కారం కనుగొనాలని తెలిపింది.

Farmers protest-UN
'రైతులు, కేంద్రం సంయమనం పాటించాలి'

కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారత్​లో సాగుతున్న రైతు ఉద్యమంపై ఐక్యరాజ్య సమితిలోని మానవ హక్కుల కమిషన్​ కార్యాలయం(ఓహెచ్​సీహెచ్​ఆర్​) స్పందించింది. పాలనాయంత్రాంగం, ఆందోళనాకారులు గరిష్ఠ సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది.

అందరి మానవ హక్కులను తగు రీతిలో గౌరవిస్తూ సమస్యలకు నిష్పాక్షిక పరిష్కార మార్గాలను కనుగొనాలని కోరింది. శాంతియుతంగా సమావేశామయ్యేందుకు, భావ వ్యక్తీకరణకు ఉద్దేశించిన హక్కులను ఆఫ్​లైన్​లోనూ, ఆన్​లైన్​లోనూ పరిరక్షించాలని విజ్ఞప్తి చేసింది.

కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారత్​లో సాగుతున్న రైతు ఉద్యమంపై ఐక్యరాజ్య సమితిలోని మానవ హక్కుల కమిషన్​ కార్యాలయం(ఓహెచ్​సీహెచ్​ఆర్​) స్పందించింది. పాలనాయంత్రాంగం, ఆందోళనాకారులు గరిష్ఠ సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది.

అందరి మానవ హక్కులను తగు రీతిలో గౌరవిస్తూ సమస్యలకు నిష్పాక్షిక పరిష్కార మార్గాలను కనుగొనాలని కోరింది. శాంతియుతంగా సమావేశామయ్యేందుకు, భావ వ్యక్తీకరణకు ఉద్దేశించిన హక్కులను ఆఫ్​లైన్​లోనూ, ఆన్​లైన్​లోనూ పరిరక్షించాలని విజ్ఞప్తి చేసింది.

ఇదీ చూడండి: నేడు రైతుల చక్కాజామ్​- దిల్లీ పోలీసులు అప్రమత్తం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.