ETV Bharat / international

రష్యా విధ్వంసం.. దద్దరిల్లిపోతున్న ఆవాస ప్రాంతాలు.. కీవ్​పైనా బాంబుల మోత

author img

By

Published : Mar 2, 2022, 7:00 AM IST

Updated : Mar 2, 2022, 7:41 AM IST

Russia Ukraine War: చర్చలు విఫలమైన మరుక్షణం రష్యా పేట్రేగిపోతోంది. ఉక్రెయిన్‌పై పూర్తి పట్టు సాధించడమే లక్ష్యంగా నింగి నుంచి క్షిపణులతో నిప్పులు కురిపిస్తోంది. పౌర ఆవాసాల జోలికి వెళ్లడం లేదంటూనే ప్రధాన నగరాలను నిర్మూలించేటంత కసితో ఆయుధాలకు పని చెబుతోంది. యుద్ధంలో సాధారణ ప్రజలతో పాటు భారీగా సైనికులూ ప్రాణాలు కోల్పోతున్నారు. తమను తాము రక్షించుకునేందుకు ప్రజలు కుటుంబాలతో సహా భూగర్భ స్టేషన్లకు, బంకర్లకు పరుగులు తీస్తున్నారు. ఇలాంటి సురక్షిత ప్రాంతం నుంచి బయటకు వచ్చిన భారతదేశ విద్యార్థి ఒకరు దాడుల్లో దుర్మరణం చెందడం తీవ్ర ఆవేదనను మిగిల్చింది. అణు జలాంతర్గాములను, ఖండాంతర క్షిపణుల సన్నద్ధతతను రష్యా పరీక్షిస్తుండడం మరింత ఆందోళనకరంగా మారింది.

Russia Ukraine War
రష్యా ఉక్రెయిన్ యుద్ధం

Russia Ukraine War: ఉక్రెయిన్‌పై యుద్ధంలో ఆరో రోజైన మంగళవారం రష్యా మరింత దూకుడు పెంచింది. 56 రాకెట్లు, 113 క్షిపణులను ఉక్రెయిన్‌ నగరాలపై ప్రయోగించి పెను విధ్వంసాన్ని మిగిల్చింది. అనేక భవంతులు నేలమట్టమయ్యాయి. ఇంతవరకు 14 మంది చిన్నారులు సహా 352 మంది పౌరులు మృతి చెందినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది. ఒకపక్క కీవ్‌ నగరాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేస్తూనే మరోపక్క.. రెండో అతిపెద్ద నగరమైన ఖర్కివ్‌పైనా రష్యా మళ్లీ గురిపెట్టింది. క్షిపణి దాడిలో ఆ నగర నడిబొడ్డున ఉన్న అతిపెద్ద భవంతి 'ఫ్రీడం స్క్వేర్‌' నామరూపాల్లేకుండా పోయింది. దాడి సమయంలో అదొక అగ్నిగోళాన్ని తలపించింది. కనీసం ఆరుగురి మృతదేహాలు లభ్యమైనట్లు తెలుస్తున్నా ఈ దాడిలో ప్రాణనష్టంపై పూర్తి వివరాలు వెల్లడికాలేదు. సోవియెట్‌ యూనియన్‌ హయాం నుంచి పరిపాలన కేంద్రంగా ఈ భవంతి ఉంది. అక్కడి ప్రసూతి వార్డును.. బాంబుల నుంచి రక్షణ కల్పించే ప్రాంతంగా అప్పటికప్పుడు మార్చారు. '..ఈ దాడి రష్యా ప్రభుత్వ ఉగ్ర చర్య. దీనిని ఎవరూ మరిచిపోలేరు. ఎవరూ క్షమించలేరు. మేమేంటో రుజువు చేసుకుంటున్నాం' అని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు. రష్యా విమానాలు, హెలికాప్టర్లు, క్షిపణులు ఉక్రెయిన్‌ మీదుగా వెళ్లకుండా పూర్తిస్థాయి నిషేధం విధించాలని నాటోను కోరారు. కీవ్‌లో ఒక టీవీ టవర్‌పైనా దాడి జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారు. పుతిన్‌తో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌ ఫోన్‌లో మాట్లాడి సైనిక దాడి ముగించాలని మరోసారి సూచించారు.

Russia Ukraine War
ఖర్కివ్​లోని ప్రాంతీయ పరిపాలన భవనంపై క్షిపణి దాడి వీడియో దృశ్యాలు
Russia Ukraine War
రష్యా దాడుల అనంతరం ఖర్కివ్​లో భీతావహ స్థితి

క్లస్టర్‌ బాంబుల్ని ప్రయోగించారా?

నగరాలపై దాడులకు దిగడంతో పాటు మూడు జన సమ్మర్థ ప్రాంతాలపై క్లస్టర్‌ బాంబుల్ని రష్యా వాడినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇది నిజమైతే రష్యాపై ఇతర దేశాలు మరింతగా ఆంక్షలు విధించే అవకాశం ఉంది. పౌరుల ఆవాసాలు, ఆసుపత్రులు, పాఠశాలలపై దాడులు చేయలేదని, సైనిక స్థావరాలే తమ లక్ష్యమని రష్యా పదేపదే చెబుతోంది. వీడియో దృశ్యాలు మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. లక్ష్యాన్ని సాధించేవరకు వెనక్కి తగ్గబోమని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తాజాగానూ స్పష్టం చేయడం గమనార్హం. బెలారస్‌ నుంచి సైనిక బలగాలు యుద్ధంలోకి దిగాయని ఉక్రెయిన్‌ సైనిక వర్గాలు తెలిపినా తదుపరి వివరాలు వెల్లడించలేదు. ఖేర్సన్‌ ప్రధాన ఓడరేవును రష్యా స్తంభింపజేసిందని తెలిపాయి. పిల్లల్ని చంపడానికి క్షిపణులు ప్రయోగించడం ద్వారా రష్యా అనాగరిక, విచక్షణ రహిత విధానాలు అనుసరిస్తోందని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తప్పుపట్టారు.

Russia Ukraine War
క్షిపణి దాడికి గురైన ఖర్కివ్​లోని ప్రాంతీయ పరిపాలనా భవనం, ధ్వంసమైన వాహనాలు
Russia Ukraine War
దాడుల్లో దెబ్బతిన్న ఖర్కివ్​లోని సిటీహాల్​ భవనం

ఇసుక నింపిన ట్రాక్టర్‌ టైర్లతో అడ్డంకులు

రష్యాను నిలువరించడానికి ఉక్రెయిన్‌ ప్రజలు జాతీయ రహదారులపై పలు ప్రాంతాల్లో ట్రాక్టర్‌ టైర్లలో ఇసుక నింపి అడ్డంగా వేస్తున్నారు. ఇసుక బస్తాలనూ దీనికోసం వాడుతున్నారు. 'రష్యా సైనికుడా.. ఆగు! మీ కుటుంబాన్ని గుర్తు తెచ్చుకో. నిష్కళంక అంతరాత్మతో ఇంటికి వెళ్లు' వంటి అర్థమిచ్చే నినాదాలు పలుచోట్ల కనిపిస్తున్నాయి. తాగునీటి సరఫరా మార్గాలు, విద్యుత్తు సరఫరా వ్యవస్థలపైనా రష్యా దాడి చేయడంతో అనేకమంది ప్రజలు అల్లాడిపోతున్నారు. విద్యుత్తు పంపిణీ తీగలకు సమీపంలో ఉన్న ప్రజలు అక్కడి నుంచి ఖాళీ చేయాలని రష్యా సూచించింది.

Russia Ukraine War
కీవ్​ సమీపంలోని బ్రోవరీ చెక్​పాయింట్​ వద్ద కాలిపోయిన యుద్ధ వాహనాలు
Russia Ukraine War
ఖర్కివ్​లో రష్యా దాడులకు ధ్వంసమైన ప్రాంతీయ పరిపాలనా భవనం

5 వేల మంది సైనికుల్ని కోల్పోయిన రష్యా!

యుద్ధంలో దాదాపు 5,000 మంది రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోవడమో, ఉక్రెయిన్‌కు పట్టుబడడమో జరిగి ఉంటుందని సీనియర్‌ నిఘా విభాగ అధికారి ఒకరు అంచనా వేశారు. కీవ్‌-ఖర్కివ్‌ నగరాల మధ్యనున్న ఒఖ్తిర్కా సైనిక స్థావరంపై రష్యా పదాతిదళం ఇస్కాండర్‌ బాలిస్టిక్‌ క్షిపణితో జరిపిన దాడిలో సుమారు 70 మంది ఉక్రెయిన్‌ సైనికులు చనిపోయినట్లు వెలుగుచూసింది.

Russia Ukraine War
కీవ్​లోని బ్రోవరీ చెక్​పాయింట్​ సమీపంలో పేలుడు జరిగిన ప్రాంతంలో రోడ్డుపై ఏర్పడిన గొయ్యి, దెబ్బతిన్న భవనాలు
Russia Ukraine War
రొమేనియాలోని బుకారెస్ట్​లో ఏర్పాటు చేసిన శిబిరంలో విశ్రాంతి తీసుకుంటున్న భారతీయ విద్యార్థులు

ఆ గుర్తులు ఉన్నాయేమో చూడండి

ఉక్రెయిన్‌లో కొన్ని నగరాల్లో భవనాలపై ఎర్ర రంగుతో వేసిన ఇంటూ, బాణం గుర్తులు కనిపించిన నేపథ్యంలో ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. రష్యన్‌ సేనలు వాటిపై దాడి చేసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రజలు తాము నివసించే భవనాల పైకప్పులపై ఏమైనా అనుమానాస్పద గుర్తులుంటే వాటిని తక్షణం కప్పివేయాలని సూచించింది.

భద్రతా మండలి నుంచి రష్యా తొలగింపునకు బ్రిటన్‌ ప్రతిపాదన

అంతర్జాతీయ ఆంక్షలకు తలొగ్గకుండా దురాక్రమణను కొనసాగిస్తున్న రష్యాపై మరింత కఠినంగా వ్యవహరించాలని బ్రిటన్‌ భావిస్తోంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోని శాశ్వత దేశాల జాబితా నుంచి రష్యాను తొలగించాలని బ్రిటన్‌ అనూహ్య ప్రతిపాదన చేసింది. రష్యాకు వ్యతిరేకంగా చేపట్టే చర్యల్లో ఇదీ భాగమని ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ తెలిపారు. ఉక్రెయిన్‌లో రక్తపాతానికి ముగింపు పలకాలని జర్మనీ ఛాన్స్‌లర్‌ ఓలాఫ్‌ షోల్జ్‌.. రష్యాను డిమాండ్‌ చేశారు. లేదంటే మరింత కఠిన ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు.

సాయానికి రెడ్‌క్రాస్‌ వినతి

యుద్ధం వల్ల ప్రభావితమైన ప్రజలను ఆదుకునేందుకు 27.2 కోట్ల డాలర్ల (సుమారు రూ.2,000 కోట్లు) సాయం చేయాల్సిందిగా రెడ్‌క్రాస్‌ సంస్థ విజ్ఞప్తి చేసింది. లక్షల మంది ప్రజలకు మానవతా సాయం అందించాల్సి ఉందని తెలిపింది. ఉక్రెయిన్‌లో పరిస్థితి గమనిస్తున్నామనీ, విచారణను ప్రారంభించడానికి యోచిస్తున్నామని అంతర్జాతీయ నేర న్యాయస్థానం చీఫ్‌ ప్రాసిక్యూటర్‌ చెప్పారు.

తలొగ్గేదే లేదు

రష్యా మామీద ఒత్తిడి పెంచాలనుకుంటోంది. నేను వారికి తలొగ్గేలా చేసేందుకే దాడుల్ని ముమ్మరం చేసిందనిపిస్తోంది. ఒకపక్క రాకెట్లతో దాడులు చేసుకుంటూ మరోపక్క వారు చెప్పినట్లు చేయడానికి మేం సిద్ధంగా లేం. రష్యాది కచ్చితంగా ఉగ్రచర్య.

- జెలెన్‌స్కీ, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు

కర్ణాటక వైద్య విద్యార్థి మృతి

ఉక్రెయిన్‌-రష్యా మధ్య జరుగుతున్న భీకర యుద్ధంలో భారతీయ వైద్య విద్యార్థి ఒకరు మృతి చెందారు. ఖర్కివ్‌ నగరంలో మంగళవారం ఉదయం జరిగిన ఫిరంగి దాడిలో కర్ణాటకు చెందిన నవీన్‌ శేకరప్ప గ్యానగౌడర్‌ (22) ప్రాణాలు కోల్పోయారు. ఖర్కివ్‌ నేషనల్‌ మెడికల్‌ యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌(నాలుగో సంవత్సరం) చదువుతున్న ఆయన స్వస్థలం హవేరి జిల్లాలోని చెలగేరి. నవీన్‌ మరణాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి, కర్ణాటక విపత్తుల నివారణ సంస్థ కమిషనర్‌ డాక్టర్‌ మనోజ్‌ రాజన్‌ ధ్రువీకరించారు.

విషాద వార్త తెలియడంతో నవీన్‌ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. నవీన్‌ ఇంటికి భారీ సంఖ్యలో స్థానికులు తరలివచ్చారు. సుమారు 30 మంది భారతీయ విద్యార్థులతో ఖర్కివ్‌లోని ఓ బంకరులో తలదాచుకున్న నవీన్‌ ఆహార పదార్థాల కోసం వెలుపలకు వచ్చినప్పుడు ఫిరంగి దాడిలో చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఉక్రెయిన్‌తో గత నెల 24న యుద్ధం ప్రారంభమైన తర్వాత భారతీయ పౌరుడు చనిపోవడం ఇదే ప్రథమం. వైద్య విద్యార్థి మృతి పట్ల ప్రధాని మోదీ, కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి :

Russia Ukraine War: ఉక్రెయిన్‌పై యుద్ధంలో ఆరో రోజైన మంగళవారం రష్యా మరింత దూకుడు పెంచింది. 56 రాకెట్లు, 113 క్షిపణులను ఉక్రెయిన్‌ నగరాలపై ప్రయోగించి పెను విధ్వంసాన్ని మిగిల్చింది. అనేక భవంతులు నేలమట్టమయ్యాయి. ఇంతవరకు 14 మంది చిన్నారులు సహా 352 మంది పౌరులు మృతి చెందినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది. ఒకపక్క కీవ్‌ నగరాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేస్తూనే మరోపక్క.. రెండో అతిపెద్ద నగరమైన ఖర్కివ్‌పైనా రష్యా మళ్లీ గురిపెట్టింది. క్షిపణి దాడిలో ఆ నగర నడిబొడ్డున ఉన్న అతిపెద్ద భవంతి 'ఫ్రీడం స్క్వేర్‌' నామరూపాల్లేకుండా పోయింది. దాడి సమయంలో అదొక అగ్నిగోళాన్ని తలపించింది. కనీసం ఆరుగురి మృతదేహాలు లభ్యమైనట్లు తెలుస్తున్నా ఈ దాడిలో ప్రాణనష్టంపై పూర్తి వివరాలు వెల్లడికాలేదు. సోవియెట్‌ యూనియన్‌ హయాం నుంచి పరిపాలన కేంద్రంగా ఈ భవంతి ఉంది. అక్కడి ప్రసూతి వార్డును.. బాంబుల నుంచి రక్షణ కల్పించే ప్రాంతంగా అప్పటికప్పుడు మార్చారు. '..ఈ దాడి రష్యా ప్రభుత్వ ఉగ్ర చర్య. దీనిని ఎవరూ మరిచిపోలేరు. ఎవరూ క్షమించలేరు. మేమేంటో రుజువు చేసుకుంటున్నాం' అని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు. రష్యా విమానాలు, హెలికాప్టర్లు, క్షిపణులు ఉక్రెయిన్‌ మీదుగా వెళ్లకుండా పూర్తిస్థాయి నిషేధం విధించాలని నాటోను కోరారు. కీవ్‌లో ఒక టీవీ టవర్‌పైనా దాడి జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారు. పుతిన్‌తో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌ ఫోన్‌లో మాట్లాడి సైనిక దాడి ముగించాలని మరోసారి సూచించారు.

Russia Ukraine War
ఖర్కివ్​లోని ప్రాంతీయ పరిపాలన భవనంపై క్షిపణి దాడి వీడియో దృశ్యాలు
Russia Ukraine War
రష్యా దాడుల అనంతరం ఖర్కివ్​లో భీతావహ స్థితి

క్లస్టర్‌ బాంబుల్ని ప్రయోగించారా?

నగరాలపై దాడులకు దిగడంతో పాటు మూడు జన సమ్మర్థ ప్రాంతాలపై క్లస్టర్‌ బాంబుల్ని రష్యా వాడినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇది నిజమైతే రష్యాపై ఇతర దేశాలు మరింతగా ఆంక్షలు విధించే అవకాశం ఉంది. పౌరుల ఆవాసాలు, ఆసుపత్రులు, పాఠశాలలపై దాడులు చేయలేదని, సైనిక స్థావరాలే తమ లక్ష్యమని రష్యా పదేపదే చెబుతోంది. వీడియో దృశ్యాలు మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. లక్ష్యాన్ని సాధించేవరకు వెనక్కి తగ్గబోమని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తాజాగానూ స్పష్టం చేయడం గమనార్హం. బెలారస్‌ నుంచి సైనిక బలగాలు యుద్ధంలోకి దిగాయని ఉక్రెయిన్‌ సైనిక వర్గాలు తెలిపినా తదుపరి వివరాలు వెల్లడించలేదు. ఖేర్సన్‌ ప్రధాన ఓడరేవును రష్యా స్తంభింపజేసిందని తెలిపాయి. పిల్లల్ని చంపడానికి క్షిపణులు ప్రయోగించడం ద్వారా రష్యా అనాగరిక, విచక్షణ రహిత విధానాలు అనుసరిస్తోందని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తప్పుపట్టారు.

Russia Ukraine War
క్షిపణి దాడికి గురైన ఖర్కివ్​లోని ప్రాంతీయ పరిపాలనా భవనం, ధ్వంసమైన వాహనాలు
Russia Ukraine War
దాడుల్లో దెబ్బతిన్న ఖర్కివ్​లోని సిటీహాల్​ భవనం

ఇసుక నింపిన ట్రాక్టర్‌ టైర్లతో అడ్డంకులు

రష్యాను నిలువరించడానికి ఉక్రెయిన్‌ ప్రజలు జాతీయ రహదారులపై పలు ప్రాంతాల్లో ట్రాక్టర్‌ టైర్లలో ఇసుక నింపి అడ్డంగా వేస్తున్నారు. ఇసుక బస్తాలనూ దీనికోసం వాడుతున్నారు. 'రష్యా సైనికుడా.. ఆగు! మీ కుటుంబాన్ని గుర్తు తెచ్చుకో. నిష్కళంక అంతరాత్మతో ఇంటికి వెళ్లు' వంటి అర్థమిచ్చే నినాదాలు పలుచోట్ల కనిపిస్తున్నాయి. తాగునీటి సరఫరా మార్గాలు, విద్యుత్తు సరఫరా వ్యవస్థలపైనా రష్యా దాడి చేయడంతో అనేకమంది ప్రజలు అల్లాడిపోతున్నారు. విద్యుత్తు పంపిణీ తీగలకు సమీపంలో ఉన్న ప్రజలు అక్కడి నుంచి ఖాళీ చేయాలని రష్యా సూచించింది.

Russia Ukraine War
కీవ్​ సమీపంలోని బ్రోవరీ చెక్​పాయింట్​ వద్ద కాలిపోయిన యుద్ధ వాహనాలు
Russia Ukraine War
ఖర్కివ్​లో రష్యా దాడులకు ధ్వంసమైన ప్రాంతీయ పరిపాలనా భవనం

5 వేల మంది సైనికుల్ని కోల్పోయిన రష్యా!

యుద్ధంలో దాదాపు 5,000 మంది రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోవడమో, ఉక్రెయిన్‌కు పట్టుబడడమో జరిగి ఉంటుందని సీనియర్‌ నిఘా విభాగ అధికారి ఒకరు అంచనా వేశారు. కీవ్‌-ఖర్కివ్‌ నగరాల మధ్యనున్న ఒఖ్తిర్కా సైనిక స్థావరంపై రష్యా పదాతిదళం ఇస్కాండర్‌ బాలిస్టిక్‌ క్షిపణితో జరిపిన దాడిలో సుమారు 70 మంది ఉక్రెయిన్‌ సైనికులు చనిపోయినట్లు వెలుగుచూసింది.

Russia Ukraine War
కీవ్​లోని బ్రోవరీ చెక్​పాయింట్​ సమీపంలో పేలుడు జరిగిన ప్రాంతంలో రోడ్డుపై ఏర్పడిన గొయ్యి, దెబ్బతిన్న భవనాలు
Russia Ukraine War
రొమేనియాలోని బుకారెస్ట్​లో ఏర్పాటు చేసిన శిబిరంలో విశ్రాంతి తీసుకుంటున్న భారతీయ విద్యార్థులు

ఆ గుర్తులు ఉన్నాయేమో చూడండి

ఉక్రెయిన్‌లో కొన్ని నగరాల్లో భవనాలపై ఎర్ర రంగుతో వేసిన ఇంటూ, బాణం గుర్తులు కనిపించిన నేపథ్యంలో ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. రష్యన్‌ సేనలు వాటిపై దాడి చేసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రజలు తాము నివసించే భవనాల పైకప్పులపై ఏమైనా అనుమానాస్పద గుర్తులుంటే వాటిని తక్షణం కప్పివేయాలని సూచించింది.

భద్రతా మండలి నుంచి రష్యా తొలగింపునకు బ్రిటన్‌ ప్రతిపాదన

అంతర్జాతీయ ఆంక్షలకు తలొగ్గకుండా దురాక్రమణను కొనసాగిస్తున్న రష్యాపై మరింత కఠినంగా వ్యవహరించాలని బ్రిటన్‌ భావిస్తోంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోని శాశ్వత దేశాల జాబితా నుంచి రష్యాను తొలగించాలని బ్రిటన్‌ అనూహ్య ప్రతిపాదన చేసింది. రష్యాకు వ్యతిరేకంగా చేపట్టే చర్యల్లో ఇదీ భాగమని ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ తెలిపారు. ఉక్రెయిన్‌లో రక్తపాతానికి ముగింపు పలకాలని జర్మనీ ఛాన్స్‌లర్‌ ఓలాఫ్‌ షోల్జ్‌.. రష్యాను డిమాండ్‌ చేశారు. లేదంటే మరింత కఠిన ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు.

సాయానికి రెడ్‌క్రాస్‌ వినతి

యుద్ధం వల్ల ప్రభావితమైన ప్రజలను ఆదుకునేందుకు 27.2 కోట్ల డాలర్ల (సుమారు రూ.2,000 కోట్లు) సాయం చేయాల్సిందిగా రెడ్‌క్రాస్‌ సంస్థ విజ్ఞప్తి చేసింది. లక్షల మంది ప్రజలకు మానవతా సాయం అందించాల్సి ఉందని తెలిపింది. ఉక్రెయిన్‌లో పరిస్థితి గమనిస్తున్నామనీ, విచారణను ప్రారంభించడానికి యోచిస్తున్నామని అంతర్జాతీయ నేర న్యాయస్థానం చీఫ్‌ ప్రాసిక్యూటర్‌ చెప్పారు.

తలొగ్గేదే లేదు

రష్యా మామీద ఒత్తిడి పెంచాలనుకుంటోంది. నేను వారికి తలొగ్గేలా చేసేందుకే దాడుల్ని ముమ్మరం చేసిందనిపిస్తోంది. ఒకపక్క రాకెట్లతో దాడులు చేసుకుంటూ మరోపక్క వారు చెప్పినట్లు చేయడానికి మేం సిద్ధంగా లేం. రష్యాది కచ్చితంగా ఉగ్రచర్య.

- జెలెన్‌స్కీ, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు

కర్ణాటక వైద్య విద్యార్థి మృతి

ఉక్రెయిన్‌-రష్యా మధ్య జరుగుతున్న భీకర యుద్ధంలో భారతీయ వైద్య విద్యార్థి ఒకరు మృతి చెందారు. ఖర్కివ్‌ నగరంలో మంగళవారం ఉదయం జరిగిన ఫిరంగి దాడిలో కర్ణాటకు చెందిన నవీన్‌ శేకరప్ప గ్యానగౌడర్‌ (22) ప్రాణాలు కోల్పోయారు. ఖర్కివ్‌ నేషనల్‌ మెడికల్‌ యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌(నాలుగో సంవత్సరం) చదువుతున్న ఆయన స్వస్థలం హవేరి జిల్లాలోని చెలగేరి. నవీన్‌ మరణాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి, కర్ణాటక విపత్తుల నివారణ సంస్థ కమిషనర్‌ డాక్టర్‌ మనోజ్‌ రాజన్‌ ధ్రువీకరించారు.

విషాద వార్త తెలియడంతో నవీన్‌ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. నవీన్‌ ఇంటికి భారీ సంఖ్యలో స్థానికులు తరలివచ్చారు. సుమారు 30 మంది భారతీయ విద్యార్థులతో ఖర్కివ్‌లోని ఓ బంకరులో తలదాచుకున్న నవీన్‌ ఆహార పదార్థాల కోసం వెలుపలకు వచ్చినప్పుడు ఫిరంగి దాడిలో చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఉక్రెయిన్‌తో గత నెల 24న యుద్ధం ప్రారంభమైన తర్వాత భారతీయ పౌరుడు చనిపోవడం ఇదే ప్రథమం. వైద్య విద్యార్థి మృతి పట్ల ప్రధాని మోదీ, కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి :

Last Updated : Mar 2, 2022, 7:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.