ETV Bharat / international

కరోనా టీకా పేరుతో సైబర్​ మోసాలు​ - covid cyber attacks in brittan

సైబర్​ నేరగాళ్లు రోజు రోజుకు కొత్త పంథాను ఎంచుకుంటున్నారు. తాజాగా కరోనా టీకా పేరుతో నయా మోసాలకు పాల్పడుతున్నారు. వాక్సిన్​ పొందాలంటే బ్యాంక్ వివరాలు, నగదు చెల్లించాలని అడుగుతున్నారు. దీనికి సంబంధించి కేసులు బ్రిటన్​లో వెలుగుచూస్తున్నాయి.

Public warned against COVID-19 vaccine scams in UK
కరోనా టీకా పేరుతో సైబర్​ మోసాలు
author img

By

Published : Jan 10, 2021, 5:24 AM IST

బ్రిటన్‌లో కరోనా టీకా పేరుతో సైబర్‌ నేరగాళ్లు కొత్త తరహా మోసానికి తెరలేపారు. వాక్సిన్​ కావాలంటే బ్యాంకు వివరాలతో పాటు నగదు చెల్లించాలని అడుగుతున్నట్లు బ్రిటన్​ జాతీయ నేర గణాంక విభాగం (ఎన్​సీఏ) తెలిపింది. వృద్ధులు, వైరస్​ ప్రభావం ఎక్కువగా ఉన్నవారినే సైబర్​ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నారని పేర్కొంది. తాను టీకా పంపిణీ చేసే వ్యక్తి నంటూ ఓ వ్యక్తి.. 92 ఏళ్ల మహిళ నుంచి 160 పౌండ్లు తీసుకున్నట్లు తెలిపింది.

టీకా ఉచితం

కరోనా వ్యాక్సిన్లు జాతీయ ఆరోగ్య సేవా ఆసుపత్రుల ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు బ్రిటన్​ ప్రభుత్వం తెలిపింది. ఇందుకు ప్రజల నుంచి ఎటువంటి వ్యక్తిగత వివరాలను అడగమని స్పష్టం చేసింది. టీకాను పొందాలంటే బ్యాంకు వివరాలు, డబ్బు చెల్లించాలని అడిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాల్సిందిగా ప్రజల్ని కోరింది. సైబర్​ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

ఇప్పటి వరకు టీకాకు సంబంధించిన 57 సైబర్ మోసాల కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం వెల్లడించింది.

ఇదీ చూడండి: జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్​ షురూ

బ్రిటన్‌లో కరోనా టీకా పేరుతో సైబర్‌ నేరగాళ్లు కొత్త తరహా మోసానికి తెరలేపారు. వాక్సిన్​ కావాలంటే బ్యాంకు వివరాలతో పాటు నగదు చెల్లించాలని అడుగుతున్నట్లు బ్రిటన్​ జాతీయ నేర గణాంక విభాగం (ఎన్​సీఏ) తెలిపింది. వృద్ధులు, వైరస్​ ప్రభావం ఎక్కువగా ఉన్నవారినే సైబర్​ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నారని పేర్కొంది. తాను టీకా పంపిణీ చేసే వ్యక్తి నంటూ ఓ వ్యక్తి.. 92 ఏళ్ల మహిళ నుంచి 160 పౌండ్లు తీసుకున్నట్లు తెలిపింది.

టీకా ఉచితం

కరోనా వ్యాక్సిన్లు జాతీయ ఆరోగ్య సేవా ఆసుపత్రుల ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు బ్రిటన్​ ప్రభుత్వం తెలిపింది. ఇందుకు ప్రజల నుంచి ఎటువంటి వ్యక్తిగత వివరాలను అడగమని స్పష్టం చేసింది. టీకాను పొందాలంటే బ్యాంకు వివరాలు, డబ్బు చెల్లించాలని అడిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాల్సిందిగా ప్రజల్ని కోరింది. సైబర్​ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

ఇప్పటి వరకు టీకాకు సంబంధించిన 57 సైబర్ మోసాల కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం వెల్లడించింది.

ఇదీ చూడండి: జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్​ షురూ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.