ETV Bharat / international

'బీబీసీ 100 విమెన్ లిస్ట్'లో మానసి, రిధిమ - bilkis bano latest news

భారత్​కు చెందిన నలుగురు మహిళలు ప్రఖ్యాత 'బీబీసీ 100 విమెన్2020'లిస్ట్​లో చోటు సంపాదించారు. పారా బాడ్మింటన్ క్రీడాకారిణి మానసి జోషితోపాటు, వాతావరణ మార్పుపై పోరాడిన రిధిమా పాండే ఈ అరుదైన గౌరవం దక్కించుకున్నవారిలో ఉన్నారు.

Para-athlete, climate activist among Indian women on BBC's top 100 for 2020
'బీబీసీ100 విమెన్ లిస్టు'లో భారత నారీమణులు
author img

By

Published : Nov 24, 2020, 7:23 PM IST

Updated : Nov 24, 2020, 7:36 PM IST

పారా బాడ్మింటన్​ క్రీడాకారిణి మానసి జోషి, వాతావరణ మార్పుపై పోరాడిన రిధిమా పాండేకు 'బీబీసీ 100 విమెన్ 2020' జాబితాలో చోటు లభించింది. వీరితో పాటు 82ఏళ్ల బిల్కిస్​ బానో, తమిళనాడుకు చెందిన ఇసాయ్​వాణికి ఈ గౌరవం దక్కింది. ప్రపంచంలోనే అత్యంత స్ఫూర్తిదాయకమైన, ప్రభావశీల మహిళలతో ఈ జాబితా రూపొందించారు. ప్రముఖ మహిళల నుంచి ప్రతిభ ఉన్నా గుర్తింపునకు నోచుకోనివారినీ లిస్టులో చేర్చారు.

'హౌ విమెన్​ లీడ్ ఛేంజ్ ఇన్ 2020' ఈ సంవత్సరం ఇతివృత్తంగా ఉంది. కరోనాపై ముందుండి పోరాడిన మహిళా వైద్య సిబ్బందికి సైతం ఇందులో చోటు కల్పించారు.

నలుగరు భారతీయులు

మానసి జోషి పారా బాడ్మింటన్ సింగిల్స్​లో ప్రపంచ రెండో ర్యాంకులో కొనసాగుతున్నారు. ఎన్నో రికార్డులు నెలకొల్పి యువతకు స్ఫూర్తిగా నిలిచారు.

ఇదీ చదవండి : 'దివ్యాంగుల గొంతుకగా మారడం గర్వంగా ఉంది'

తొమ్మిదేళ్ల వయసులోనే రిధిమా పాండే కేంద్రానికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారు. వాతావరణ మార్పుపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవటంపై ప్రశ్నించారు. భారత్​తోపాటు మరో నాలుగు దేశాలపైనా ఐక్యరాజ్యసమితిలో పిటిషన్​ దాఖలు చేశారు.

ఇదీ చదవండి : పర్యావరణ పరిరక్షణకై ఐరాసలో భారత యువతి ఫిర్యాదు

జాతీయ పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా 82ఏళ్ల బిల్కిస్​ బానో పోరాడారు.

ఇదీ చదవండి : మోదీ నా కుమారుడితో సమానం: షాహీన్​బాగ్ ఉద్యమకారిణి

ఇసాయ్​వాణి... గాన అనే తమిళ శాస్త్రీయ సంగీతాన్ని ఆలపించి ఎందరికో స్ఫూర్తినిచ్చారు. కేవలం పురుషులే ఈ సాధన చేయగలరన్న నానుడిని పక్కనపెట్టి యువ గాయనీమణులకు ఆదర్శంగా నిలిచారు.

పారా బాడ్మింటన్​ క్రీడాకారిణి మానసి జోషి, వాతావరణ మార్పుపై పోరాడిన రిధిమా పాండేకు 'బీబీసీ 100 విమెన్ 2020' జాబితాలో చోటు లభించింది. వీరితో పాటు 82ఏళ్ల బిల్కిస్​ బానో, తమిళనాడుకు చెందిన ఇసాయ్​వాణికి ఈ గౌరవం దక్కింది. ప్రపంచంలోనే అత్యంత స్ఫూర్తిదాయకమైన, ప్రభావశీల మహిళలతో ఈ జాబితా రూపొందించారు. ప్రముఖ మహిళల నుంచి ప్రతిభ ఉన్నా గుర్తింపునకు నోచుకోనివారినీ లిస్టులో చేర్చారు.

'హౌ విమెన్​ లీడ్ ఛేంజ్ ఇన్ 2020' ఈ సంవత్సరం ఇతివృత్తంగా ఉంది. కరోనాపై ముందుండి పోరాడిన మహిళా వైద్య సిబ్బందికి సైతం ఇందులో చోటు కల్పించారు.

నలుగరు భారతీయులు

మానసి జోషి పారా బాడ్మింటన్ సింగిల్స్​లో ప్రపంచ రెండో ర్యాంకులో కొనసాగుతున్నారు. ఎన్నో రికార్డులు నెలకొల్పి యువతకు స్ఫూర్తిగా నిలిచారు.

ఇదీ చదవండి : 'దివ్యాంగుల గొంతుకగా మారడం గర్వంగా ఉంది'

తొమ్మిదేళ్ల వయసులోనే రిధిమా పాండే కేంద్రానికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారు. వాతావరణ మార్పుపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవటంపై ప్రశ్నించారు. భారత్​తోపాటు మరో నాలుగు దేశాలపైనా ఐక్యరాజ్యసమితిలో పిటిషన్​ దాఖలు చేశారు.

ఇదీ చదవండి : పర్యావరణ పరిరక్షణకై ఐరాసలో భారత యువతి ఫిర్యాదు

జాతీయ పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా 82ఏళ్ల బిల్కిస్​ బానో పోరాడారు.

ఇదీ చదవండి : మోదీ నా కుమారుడితో సమానం: షాహీన్​బాగ్ ఉద్యమకారిణి

ఇసాయ్​వాణి... గాన అనే తమిళ శాస్త్రీయ సంగీతాన్ని ఆలపించి ఎందరికో స్ఫూర్తినిచ్చారు. కేవలం పురుషులే ఈ సాధన చేయగలరన్న నానుడిని పక్కనపెట్టి యువ గాయనీమణులకు ఆదర్శంగా నిలిచారు.

Last Updated : Nov 24, 2020, 7:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.