కరోనా బారిన పడి కోలుకున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్కు సేవలందించిన నర్సు తన అనుభవాలను పంచుకున్నారు. కరోనా వైరస్ సోకి అనారోగ్యం పాలైన బోరిస్.. వారం రోజులపాటు లండన్ సెయింట్ థామస్ ఆసుపత్రిలో చికిత్స పొందారు.
ఆయనకు సేవలందించేందుకు ఇద్దరు నర్సులను కేటాయించారు. వీరిలో ఒకరు.. పోర్చుగల్కు చెందిన లూయీ పీతర్మ. థామస్ ఆసుపత్రిలో నాలుగేళ్లుగా పనిచేస్తున్నారు.
గొప్ప అవకాశం..
ప్రధానికి ఆరోగ్య సిబ్బందిగా తనను ఎంపిక చేశారని తెలియగానే భయమేసిందని ఆమె తెలిపారు. ప్రధానికి 3 రోజుల పాటు సేవలందించడం తనకు దక్కిన గొప్ప అవకాశమని ఆమె అన్నారు.
"ఆసుపత్రిలో ఉన్నప్పుడు బోరిస్ అని పిలవాలన్నారు ప్రధాని. అలా పిలవడానికి కాస్త భయపడ్డాను. ఆయనకు దగ్గరుండి సేవలందించటం ఎంతో గర్వంగా ఉంది."
- లూయీ పీతర్మ
ప్రధాని నుంచి ప్రశంస..
కరోనా నుంచి కోలుకున్న జాన్సన్ ఏప్రిల్ 12న ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యారు. ఆ సమయంలో పీతర్మతో పాటు న్యూజిలాండ్కు చెందిన మరో నర్సు జెన్నీ మెక్జీని ప్రశంసించారు. తనను చాలా బాగా చూసుకున్నారని తెలిపారు.
ఇదీ చదవండి: కరోనాతో సహజీవనం: లాక్డౌన్ ఎత్తివేత దిశగా ప్రపంచం!