ETV Bharat / international

స్థిరంగానే కరోనా కేసులు: డబ్ల్యూహెచ్​ఓ

author img

By

Published : Feb 9, 2020, 5:45 AM IST

Updated : Feb 29, 2020, 5:16 PM IST

కరోనాకు సంబంధించిన కేసులు స్థిరంగా ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. గత నాలుగు రోజులుగా కేసుల సంఖ్య అంతగా పెరగలేదని తెలిపింది. కరోనా రోగులకు చికిత్సకు ఆటంకం ఎదురవుతోందన్న వార్తలను ఖండించింది. మరోవైపు ప్రాంతాల పేరుతో వైరస్​లను పిలవకుండా డబ్ల్యూహెచ్​ఓ జాగ్రత్త పడుతోంది.

Novel coronavirus case numbers 'stabilising': WHO
గుడ్​ న్యూస్-స్థిరంగానే కరోనా కేసులు: డబ్ల్యూహెచ్​ఓ

కరోనా వైరస్​కు సంబంధించి చైనాలో రోజూవారిగా నమోదవుతున్న కేసులు సంఖ్య స్థిరంగానే ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) స్పష్టం చేసింది. ఇది మంచి వార్తే అయినప్పటికీ.. వైరస్ ప్రభావం అత్యున్నత స్థాయికి చేరిందని ఇప్పుడే ఓ అంచనాకు రాలేమని తెలిపింది.

"హుబే నగరంలో నమోదవుతున్న కేసుల సంఖ్య స్థిరంగా ఉంది. నాలుగు రోజుల వ్యవధిలో కేసుల సంఖ్య అంతగా పెరగలేదు. ఈ మంచి వార్త... నియంత్రణ చర్యల ఫలితమే కావచ్చు. కానీ దీనిపై ఇప్పుడే ఓ అంచనాకు రావడం తొందరపాటే అవుతుంది.''

-మైఖేల్ ర్యాన్, డబ్ల్యూహెచ్​ఓ హెల్త్ ఎమర్జెన్సీ ప్రోగ్రామ్ అధ్యక్షుడు

ట్రోల్స్​ పైనా పోరాటం

చైనాలో వైరస్​ సోకిన వ్యక్తులకు చికిత్స చేయడానికి ఆటంకాలు ఎదురవుతున్నాయన్న వార్తలను ఖండించారు డబ్ల్యూహెచ్​ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ గెబ్రెయెసస్. చైనాకు పంపనున్న అంతర్జాతీయ నిపుణుల బృందానికి సంబంధించి అక్కడి అధికారులతో చర్చించినట్లు తెలిపారు.

"మేము వైరస్​తో మాత్రమే పోరాడటం లేదు. వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి మేం చేసే చర్యలను తక్కువ చేస్తూ... తప్పుడు వార్తలను ప్రచారం చేసే ట్రోల్స్​, కుట్రలపైనా పోరాడుతున్నాం."

-టెడ్రోస్ అధనామ్ గెబ్రెయెసస్, డబ్ల్యూహెచ్​ఓ డైరెక్టర్ జనరల్

పేరుపై రగడ!

నగరాలు, ప్రాంతాల పేర్లతో వైరస్​లను పిలవకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ జాగ్రత్త పడుతోంది. తాజా సంచలనం అయిన కరోనా వైరస్​ను తాత్కాలికంగా '2019-ఎన్​సీఓవీ అక్యూట్ రెస్పిరేటరీ డిసీజ్​'గా నామకరణం చేస్తూ ఇదివరకే ప్రకటించింది. అయితే వైరస్​ పేరుకు సంబంధించి తుది నిర్ణయం మరికొద్ది రోజుల్లో డబ్ల్యూహెచ్​ఓ ప్రకటించనుంది. డబ్ల్యూహెచ్​ఓ, అంతర్జాతీయ వైరస్​ వర్గీకరణ కమిటీ కలిసి సంయుక్తంగా వైరస్​ పేరుకు సంబంధించి తుది నిర్ణయం తీసుకోనున్నాయి.

"ఎలాంటి ప్రాంతాల పేర్లతో సంబంధం లేకుండా మధ్యంతర పేరును ప్రకటించడం చాలా ముఖ్యమని మేం అనుకుంటున్నాం. ఇప్పటికే చాలా వార్తా సంస్థలు ఈ వైరస్​ను వుహాన్​ లేదా చైనాగా పిలుస్తున్నాయి. అందుకే ఏ నగరానికి అప్రతిష్టలు రాకుండా చూడాలనుకుంటున్నాం."

-మారియా వాన్ కెర్కోవ్​, డబ్ల్యూహెచ్​ఓ ఎమర్జింగ్ డిసీజ్ యూనిట్ హెడ్

2015లో వెలువరించిన డబ్ల్యూహెచ్​ఓ మార్గనిర్దేశకాల ప్రకారం వ్యాధులకు ప్రాంతాల పేర్లు పెట్టడం నిషేధం. ఎబోలా, జికా వంటి ప్రాంతాల పేర్లతో పాటు, ఓ వర్గాన్ని ప్రతిబింబించే 'స్పానిష్ ఫ్లూ' వంటి పేర్లనూ ఉపయోగించకూడదని ఈ మార్గనిర్దేశకాలు స్పష్టం చేస్తున్నాయి.

ఇదీ చదవండి: బొమ్మల దిగుమతిపై సుంకాల పెంపు.. ఉపాధికి గండి!

కరోనా వైరస్​కు సంబంధించి చైనాలో రోజూవారిగా నమోదవుతున్న కేసులు సంఖ్య స్థిరంగానే ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) స్పష్టం చేసింది. ఇది మంచి వార్తే అయినప్పటికీ.. వైరస్ ప్రభావం అత్యున్నత స్థాయికి చేరిందని ఇప్పుడే ఓ అంచనాకు రాలేమని తెలిపింది.

"హుబే నగరంలో నమోదవుతున్న కేసుల సంఖ్య స్థిరంగా ఉంది. నాలుగు రోజుల వ్యవధిలో కేసుల సంఖ్య అంతగా పెరగలేదు. ఈ మంచి వార్త... నియంత్రణ చర్యల ఫలితమే కావచ్చు. కానీ దీనిపై ఇప్పుడే ఓ అంచనాకు రావడం తొందరపాటే అవుతుంది.''

-మైఖేల్ ర్యాన్, డబ్ల్యూహెచ్​ఓ హెల్త్ ఎమర్జెన్సీ ప్రోగ్రామ్ అధ్యక్షుడు

ట్రోల్స్​ పైనా పోరాటం

చైనాలో వైరస్​ సోకిన వ్యక్తులకు చికిత్స చేయడానికి ఆటంకాలు ఎదురవుతున్నాయన్న వార్తలను ఖండించారు డబ్ల్యూహెచ్​ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ గెబ్రెయెసస్. చైనాకు పంపనున్న అంతర్జాతీయ నిపుణుల బృందానికి సంబంధించి అక్కడి అధికారులతో చర్చించినట్లు తెలిపారు.

"మేము వైరస్​తో మాత్రమే పోరాడటం లేదు. వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి మేం చేసే చర్యలను తక్కువ చేస్తూ... తప్పుడు వార్తలను ప్రచారం చేసే ట్రోల్స్​, కుట్రలపైనా పోరాడుతున్నాం."

-టెడ్రోస్ అధనామ్ గెబ్రెయెసస్, డబ్ల్యూహెచ్​ఓ డైరెక్టర్ జనరల్

పేరుపై రగడ!

నగరాలు, ప్రాంతాల పేర్లతో వైరస్​లను పిలవకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ జాగ్రత్త పడుతోంది. తాజా సంచలనం అయిన కరోనా వైరస్​ను తాత్కాలికంగా '2019-ఎన్​సీఓవీ అక్యూట్ రెస్పిరేటరీ డిసీజ్​'గా నామకరణం చేస్తూ ఇదివరకే ప్రకటించింది. అయితే వైరస్​ పేరుకు సంబంధించి తుది నిర్ణయం మరికొద్ది రోజుల్లో డబ్ల్యూహెచ్​ఓ ప్రకటించనుంది. డబ్ల్యూహెచ్​ఓ, అంతర్జాతీయ వైరస్​ వర్గీకరణ కమిటీ కలిసి సంయుక్తంగా వైరస్​ పేరుకు సంబంధించి తుది నిర్ణయం తీసుకోనున్నాయి.

"ఎలాంటి ప్రాంతాల పేర్లతో సంబంధం లేకుండా మధ్యంతర పేరును ప్రకటించడం చాలా ముఖ్యమని మేం అనుకుంటున్నాం. ఇప్పటికే చాలా వార్తా సంస్థలు ఈ వైరస్​ను వుహాన్​ లేదా చైనాగా పిలుస్తున్నాయి. అందుకే ఏ నగరానికి అప్రతిష్టలు రాకుండా చూడాలనుకుంటున్నాం."

-మారియా వాన్ కెర్కోవ్​, డబ్ల్యూహెచ్​ఓ ఎమర్జింగ్ డిసీజ్ యూనిట్ హెడ్

2015లో వెలువరించిన డబ్ల్యూహెచ్​ఓ మార్గనిర్దేశకాల ప్రకారం వ్యాధులకు ప్రాంతాల పేర్లు పెట్టడం నిషేధం. ఎబోలా, జికా వంటి ప్రాంతాల పేర్లతో పాటు, ఓ వర్గాన్ని ప్రతిబింబించే 'స్పానిష్ ఫ్లూ' వంటి పేర్లనూ ఉపయోగించకూడదని ఈ మార్గనిర్దేశకాలు స్పష్టం చేస్తున్నాయి.

ఇదీ చదవండి: బొమ్మల దిగుమతిపై సుంకాల పెంపు.. ఉపాధికి గండి!

ZCZC
PRI GEN NAT
.NEWDELHI DEL60
NIA-ARREST
NIA arrests man in NSCN(IM) terror funding case
         New Delhi, Feb 8 (PTI) The NIA has arrested a person in connection with a terror funding case linked to the Naga insurgent group NSCN (IM), an official said on Saturday.
          Masasosang Ao, a resident of Dimapur, was arrested on Friday, an NIA spokesperson said.
          Masasosang, a close associate of main accused Alemla Jamir, was actively involved in the transfer/mobilisation of the terror funds for NSCN (IM), the official said.
          He was produced before the NIA Special Court, New Delhi and taken in police custody for further investigation.
          The National Investigation Agency (NIA), on December 20 last year, had registered a case against Alemla Jamir and others under the Unlawful Activities Prevention Act (UAPA) to probe the alleged terror financing charges linked to the NSCN(IM).
          Jamir was allegedly working for the National Socialist Council of Nagaland (Isak-Muivah) or NSCN (IM) and was arrested on December 18 last year from the domestic terminal of the Indira Gandhi International Airport while carrying Rs 72 lakh cash, the spokesperson said.
          Jamir is the wife of Phungthing Shimrang, "ex-army chief of Naga National Army and an executive member of Steering Committee of NSCN (IM) at domestic airport, Delhi," the official said.
          The money was part of a bigger criminal conspiracy relating to the channelizing of the extorted levy amount collected from the businessmen/contractors of Nagaland and neighbouring states, he said.
          The amount was being used for furtherance of terror activities of NSCN (IM), the official said.
          During further searches, Rs 1.2 crore was seized and more than three dozen bank accounts having deposits of more than Rs 3 crore suspected to be terror funds of NSCN(IM) have been identified, he said.
          Further investigation was underway. PTI CPS SKL
CK
02082207
NNNN
Last Updated : Feb 29, 2020, 5:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.