ETV Bharat / international

కరోనా వ్యాప్తితో ఆ దేశాల్లో మళ్లీ లాక్​డౌన్!​ - బంగ్లాదేశ్​లో వారం పాటు లాక్​డౌన్

కరోనా విజృంభణతో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఆంక్షలను విధిస్తున్నాయి. తాజాగా బంగ్లాదేశ్​ వారంపాటు పూర్తిస్థాయి లాక్​డౌన్​ను విధించింది. ఫిలిప్పీన్స్​లో లాక్​డౌన్​ను మరోవారం పాటు పొడిగించింది ఆ దేశ ప్రభుత్వం.

lockdown imposed in some countries
లాక్​డౌన్​ల దిశగా ప్రపంచం
author img

By

Published : Apr 5, 2021, 10:17 PM IST

కరోనా వైరస్​ వ్యాప్తితో పలు దేశాలు లాక్​డౌన్​ దిశగా అడుగులు వేస్తున్నాయి. తాజాగా దేశవ్యాప్తంగా వారంపాటు లాక్​డౌన్​ విధిస్తున్నట్లు బంగ్లాదేశ్​ ప్రకటించింది. ప్రభుత్వ రవాణా సౌకర్యాలను బంద్​ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. వైరస్​ను కట్టడి చేయడానికి మార్కెట్లను పూర్తిగా మూసివేస్తున్నట్లు పేర్కొంది. లాక్​డౌన్​ భయంతో దేశ రాజధాని ఢాకాను వేలమంది వదిలివెళ్లిపోతున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై చిన్న వ్యాపారులు ఆందోళనలు చేపట్టారు. వైరస్​ను నియంత్రించడానికి సహకరించాలని ప్రజలను ఆ దేశ ప్రధాని షేక్ హసీనా కోరారు.

బంగ్లాదేశ్​లో 7,087 కొత్త కోసులు తాజాగా వెలుగుచూశాయి. 53 కొవిడ్​ మరణాలు సంభవించాయి.

ఫిలిప్పీన్స్​లో లాక్​డౌన్​ పొడగింపు..

కరోనా వ్యాప్తితో ఫిలిప్పీన్స్​లో లాక్​డౌన్​ను మరోవారం పాటు పొడిగిస్తున్నట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. లాక్​డౌన్​ విధించి వారం దాటినా వైరస్​ వ్యాప్తిలో ఏ మార్పు లేకపోవటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రోగులతో ఆసుపత్రులు నిండిపోయాయి. ఐసీయూల్లో పరిమితికి మించి రోగులు చికిత్స పొందుతున్నారు. రోమన్​ క్యాథలిక్​లు ఈస్టర్​ వేడుకలను ఆన్​లైన్​లోనే జరుపుకున్నారు.

లాక్​డౌన్​ విధించినా ఫిలిప్పీన్స్​లో గత వారం రోజూవారి కరోనా కేసులు 10,000 దాటాయి. ఇప్పటి వరకు 7,95,000 కరోనా కేసులు నమోదయ్యాయి. 13,425 మంది వైరస్​ బారినపడి మరణించారు.

బ్రిటన్​లో ప్రతివారం రెండుసార్లు పరీక్షలు..

బ్రిటన్​లో ప్రజలకు ప్రతివారం రెండుసార్లు కరోనా పరీక్షలు ఉచితంగానే చేయనున్నట్లు ప్రభుత్వం సోమవారం తెలిపింది. స్థానిక టెస్టింగ్​ కేంద్రాల వద్ద ప్రతి ఒక్కరికి పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. వాక్సినేషన్​ ప్రక్రియ విజయవంతం కావాలంటే పరీక్షలను ఎక్కువగా నిర్వహించి వైరస్​ వ్యాప్తిని కట్టడి చేయాలని బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​ అభిప్రాయపడ్డారు. నిబంధనలను సడలిస్తున్న నేపథ్యంలో టెస్టింగ్​లు చాలా అవసరమని చెప్పారు.

పాఠశాలల్లో, 10మంది దాటిన కంపెనీల్లో ప్రతిరోజూ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు దేశంలో 3 కోట్ల 14 లక్షల మంది మొదటి డోసును తీసుకున్నారు.

కరోనా వైరస్​ వ్యాప్తితో పలు దేశాలు లాక్​డౌన్​ దిశగా అడుగులు వేస్తున్నాయి. తాజాగా దేశవ్యాప్తంగా వారంపాటు లాక్​డౌన్​ విధిస్తున్నట్లు బంగ్లాదేశ్​ ప్రకటించింది. ప్రభుత్వ రవాణా సౌకర్యాలను బంద్​ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. వైరస్​ను కట్టడి చేయడానికి మార్కెట్లను పూర్తిగా మూసివేస్తున్నట్లు పేర్కొంది. లాక్​డౌన్​ భయంతో దేశ రాజధాని ఢాకాను వేలమంది వదిలివెళ్లిపోతున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై చిన్న వ్యాపారులు ఆందోళనలు చేపట్టారు. వైరస్​ను నియంత్రించడానికి సహకరించాలని ప్రజలను ఆ దేశ ప్రధాని షేక్ హసీనా కోరారు.

బంగ్లాదేశ్​లో 7,087 కొత్త కోసులు తాజాగా వెలుగుచూశాయి. 53 కొవిడ్​ మరణాలు సంభవించాయి.

ఫిలిప్పీన్స్​లో లాక్​డౌన్​ పొడగింపు..

కరోనా వ్యాప్తితో ఫిలిప్పీన్స్​లో లాక్​డౌన్​ను మరోవారం పాటు పొడిగిస్తున్నట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. లాక్​డౌన్​ విధించి వారం దాటినా వైరస్​ వ్యాప్తిలో ఏ మార్పు లేకపోవటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రోగులతో ఆసుపత్రులు నిండిపోయాయి. ఐసీయూల్లో పరిమితికి మించి రోగులు చికిత్స పొందుతున్నారు. రోమన్​ క్యాథలిక్​లు ఈస్టర్​ వేడుకలను ఆన్​లైన్​లోనే జరుపుకున్నారు.

లాక్​డౌన్​ విధించినా ఫిలిప్పీన్స్​లో గత వారం రోజూవారి కరోనా కేసులు 10,000 దాటాయి. ఇప్పటి వరకు 7,95,000 కరోనా కేసులు నమోదయ్యాయి. 13,425 మంది వైరస్​ బారినపడి మరణించారు.

బ్రిటన్​లో ప్రతివారం రెండుసార్లు పరీక్షలు..

బ్రిటన్​లో ప్రజలకు ప్రతివారం రెండుసార్లు కరోనా పరీక్షలు ఉచితంగానే చేయనున్నట్లు ప్రభుత్వం సోమవారం తెలిపింది. స్థానిక టెస్టింగ్​ కేంద్రాల వద్ద ప్రతి ఒక్కరికి పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. వాక్సినేషన్​ ప్రక్రియ విజయవంతం కావాలంటే పరీక్షలను ఎక్కువగా నిర్వహించి వైరస్​ వ్యాప్తిని కట్టడి చేయాలని బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​ అభిప్రాయపడ్డారు. నిబంధనలను సడలిస్తున్న నేపథ్యంలో టెస్టింగ్​లు చాలా అవసరమని చెప్పారు.

పాఠశాలల్లో, 10మంది దాటిన కంపెనీల్లో ప్రతిరోజూ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు దేశంలో 3 కోట్ల 14 లక్షల మంది మొదటి డోసును తీసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.