ETV Bharat / international

ఇటలీలో 1000 దాటిన మరణాలు- ప్రధాని భార్యకు వైరస్​!

author img

By

Published : Mar 12, 2020, 11:43 PM IST

కరోనా వైరస్​ ఇటలీని కలవరపెడుతోంది. తాజాగా వైరస్​ ధాటికి 189 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా ఆ దేశంలో మహమ్మారి బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 1000 దాటింది. మరోవైపు తన భార్యలో వైరస్​ లక్షణాలు కనపడడం వల్ల స్వీయ నిర్బంధాన్ని ప్రకటించారు కెనడా ప్రధాని.

Italy's virus death toll tops 1,000: official data
ఇటలీలో 1000 దాటిన మరణాలు- ప్రధాని భార్యకు వైరస్​!

ఇటలీని కరోనా వైరస్​ కుదిపేస్తోంది. ప్రాణాంతక వైరస్​తో తాజాగా 189 మంది ప్రాణాలు కోల్పోవడం వల్ల ఇటలీలో మృతుల సంఖ్య 1,016కు చేరింది. వైరస్​ విజృంభించిన రెండు వారాల్లోనే 1000కుపైగా మరణాలు సంభవించడం ఆ దేశ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

గురువారం ఒక్క రోజే 2 వేల 651మందికి ఈ వైరస్​ సోకింది. మొత్తం 15,113 మంది ఈ అంతర్జాతీయ మహమ్మారి బారిన పడ్డారు.

ప్రధాని భార్యకు వైరస్​...!

కెనడా ప్రధాని జస్టిన్​ ట్రూడో భార్యకు వైరస్​ పరీక్షలు నిర్వహిస్తున్నారు. బుధవారం బ్రిటన్​ నుంచి వచ్చిన సోఫియా.. దగ్గు, జలుబుతో సతమతవుతున్నారు. ప్రస్తుతం ఆమెకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన భార్యతో పాటు తాను కూడా స్వీయ నిర్బంధంలో ఉండనున్నట్టు ప్రకటించారు ట్రూడో.

ప్రధాని.. తన ఇంటి నుంచి ఫోన్లు, వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా అందుబాటులో ఉంటారని ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.

'ప్రజా ఆరోగ్య సంక్షోభం...'

కరోనా వైరస్​ను 'అత్యంత దారుణ ప్రజా ఆరోగ్య సంక్షోభం'గా ప్రకటించారు బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 590 కేసులే నమోదైనప్పటికీ... ఈ సంఖ్య 5 వేల నుంచి 10వేల మధ్యలో ఉండొచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

ఒలింపిక్స్​ను వాయిదా వేయాలి...

కరోనాతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొన్న తరుణంలో టోక్యో ఒలింపిక్స్​ను వచ్చే ఏడాదికి వాయిదా వేయాలని సూచించారు అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. ఖాళీగా ఉండే స్టేడియాల కన్నా మొత్తం ఒలింపిక్స్​నే వాయిదా వేయడం మంచిదని అభిప్రాయపడ్డారు.

ఇటలీని కరోనా వైరస్​ కుదిపేస్తోంది. ప్రాణాంతక వైరస్​తో తాజాగా 189 మంది ప్రాణాలు కోల్పోవడం వల్ల ఇటలీలో మృతుల సంఖ్య 1,016కు చేరింది. వైరస్​ విజృంభించిన రెండు వారాల్లోనే 1000కుపైగా మరణాలు సంభవించడం ఆ దేశ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

గురువారం ఒక్క రోజే 2 వేల 651మందికి ఈ వైరస్​ సోకింది. మొత్తం 15,113 మంది ఈ అంతర్జాతీయ మహమ్మారి బారిన పడ్డారు.

ప్రధాని భార్యకు వైరస్​...!

కెనడా ప్రధాని జస్టిన్​ ట్రూడో భార్యకు వైరస్​ పరీక్షలు నిర్వహిస్తున్నారు. బుధవారం బ్రిటన్​ నుంచి వచ్చిన సోఫియా.. దగ్గు, జలుబుతో సతమతవుతున్నారు. ప్రస్తుతం ఆమెకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన భార్యతో పాటు తాను కూడా స్వీయ నిర్బంధంలో ఉండనున్నట్టు ప్రకటించారు ట్రూడో.

ప్రధాని.. తన ఇంటి నుంచి ఫోన్లు, వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా అందుబాటులో ఉంటారని ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.

'ప్రజా ఆరోగ్య సంక్షోభం...'

కరోనా వైరస్​ను 'అత్యంత దారుణ ప్రజా ఆరోగ్య సంక్షోభం'గా ప్రకటించారు బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 590 కేసులే నమోదైనప్పటికీ... ఈ సంఖ్య 5 వేల నుంచి 10వేల మధ్యలో ఉండొచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

ఒలింపిక్స్​ను వాయిదా వేయాలి...

కరోనాతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొన్న తరుణంలో టోక్యో ఒలింపిక్స్​ను వచ్చే ఏడాదికి వాయిదా వేయాలని సూచించారు అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. ఖాళీగా ఉండే స్టేడియాల కన్నా మొత్తం ఒలింపిక్స్​నే వాయిదా వేయడం మంచిదని అభిప్రాయపడ్డారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.