మహారాష్ట్రలోని అమరావతికి చెందిన డాక్టర్ సందేశ్ గుల్హానే స్కాట్లాండ్లో ఎంపీగా ఎన్నికై అరుదైన ఘనత సాధించారు. ఇప్పటివరకు భారతీయ మూలాలున్నవారిలో ఎవరూ స్కాటిష్ పార్లమెంటుకు ఎన్నిక కాలేదు.
గుల్హానే తల్లిదండ్రులు ప్రకాశ్, పుష్పాల స్వస్థలం అమరావతి. వారు లండన్లో ఉండేవారు. అక్కడే పుట్టిన సందేశ్ గుల్హానే.. వృత్తిరీత్యా ఎముకల వైద్యుడు. వైద్య రంగంలో మంచి పేరు పొందడం సహా సామాజిక సేవలు అందిస్తూ క్రమంగా రాజకీయ రంగంలోనూ అడుగుపెట్టారు. ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీ అయ్యారు.
ఇదీ చూడండి: ప్రార్థనాస్థలంలో గ్యాలరీ కూలి ఇద్దరు మృతి
ఇదీ చూడండి: 'ఇజ్రాయెల్-పాలస్తీనా ఇకనైనా శాంతించాలి'