అనేక దేశాలను గజగజ వణికిస్తోంది కొవిడ్-19(కరోనా). ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్. ఈ విషయాన్ని తమ వ్యాపారానికి అనుకూలంగా మార్చుకుంది ఇటలీ జెనోవాలో ఓ ప్రముఖ బేకరి. కరోనా వైరస్ ఆకారంలో కేకులను తయారు చేసింది. దీనికి స్థానికుల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది.
నగరంలోని ప్రముఖ బేకరి 'మాంగినా 1876 బార్ అండ్ పాటిస్సెరీ'కి చెందిన ప్రధాన చెఫ్.. ఇతర సిబ్బందితో కలిసి సరదాగా మాట్లాడుతున్నారు. ఆ సమయంలో వారికి కరోనా వైరస్పై పేస్ట్రీలు తయారు చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది.
రెండు రకాల్లో..
అనుకున్నదే తడవుగా కరోనా వైరస్ను సీడీసీ కంప్యూటర్ రూపొందించిన చిత్రం ఆకారంలో కేక్ను తయారు చేశారు. మొత్తంగా రెండు ఆకృతుల్లో రూపొందించారు. ఒకదాన్లో చాకొలేట్ డోమ్పై జపనీస్ క్రీమ్.. ఆపైన నారింజ రంగు పువ్వులను పేర్చారు. మరోదాంట్లో నారింజ రంగుకు బదులుగా కాఫీని ఉపయోగించారు.
ఈ పేస్ట్రీలకు భారీ డిమాండ్ వస్తోన్నా.. కొంతమంది మాత్రం విమర్శిస్తున్నారు. ఇటువంటి విషయాల్లో సరదా ఏంటని ప్రశ్నిస్తున్నారు.
ఇటలీలో 17 మంది..
ఇటలీలో ఇప్పటివరకు 650 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. 17 మంది చనిపోయారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా 82 వేల కేసులు నమోదు కాగా 2,800 మంది మరణించారు.
ఇవీ చూడండి: