ETV Bharat / international

ప్రపంచంపై 'కరోనా' కరాళ నృత్యం.. 2 లక్షలు దాటిన మృతులు

author img

By

Published : Apr 26, 2020, 5:21 AM IST

Updated : Apr 26, 2020, 6:41 AM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా మృత్యుఘంటికలు మోగిస్తూనే ఉంది. ఇప్పటివరకు మొత్తం 2 లక్షల మందికిపైగా ఈ వైరస్ బలితీసుకుంది. కేసుల సంఖ్య 29 లక్షలు దాటిపోయింది. అమెరికా, ఐరోపాలో అత్యధికంగా మరణాలు సంభవిస్తుండగా.. వైరస్ తొలుత ఉద్భవించిన చైనాలో మాత్రం కరోనా ప్రభావం దాదాపుగా తగ్గిపోయింది.

coronavirus
కరోనా

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయ తాండవం చేస్తోంది. ఇప్పటివరకు 2 లక్షలకు పైగా మందిని ఈ మహమ్మారి పొట్టనబెట్టుకుంది. రోజురోజుకూ పెరుగుతున్న కేసుల సంఖ్యతో.. ప్రస్తుతం 29 లక్షలకు చేరింది. పలు దేశాల్లో వైరస్ ప్రభావం కొనసాగుతుండటం వల్ల ఈ సంఖ్య మరింత పెరగనున్నట్లు స్పష్టమవుతోంది.

కొవిడ్ ధాటికి అమెరికా, ఐరోపా దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. ప్రపంచంలోని మూడో వంతు కేసులు అమెరికా కేంద్రంగానే నమోదయ్యాయి. అమెరికాలో గత 24 గంటల వ్యవధిలో 2,710 మంది మృతి చెందారు. అగ్రరాజ్యంలో మొత్తం 9.56 లక్షల మందికి ఈ మహమ్మారి సోకగా... 1.16 లక్షల మంది కోలుకున్నారు. మొత్తం 54 వేల మంది ఈ వైరస్​కు బలయ్యారు.

coronavirus tracker
వివిధ దేశాల్లో కరోనా తీరు

ఇటలీ 26 వేలు

కరోనాతో దుర్భర స్థితిలోకి జారుకున్న ఇటలీలో మరో 415 మంది మరణించారు. 24 గంటల వ్యవధిలో 2,357 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఐరోపా దేశాల్లో అత్యధికంగా ఇటలీలోనే 26,384 మంది ఇప్పటివరకు మరణించినట్లు వెల్లడించారు. మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 1,95,000కు చేరినట్లు స్పష్టం చేశారు.

చైనాలో

మరోవైపు చైనాలో వైరస్ దాదాపుగా తగ్గుముఖం పట్టింది. ఇప్పటివరకు మొత్తం 82,816 కేసులు నమోదు కాగా...77, 346 మంది కోలుకున్నారు. 4,632 మంది మరణించారు. కేవలం 838 మంది ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. శనివారం కొత్తగా 12 కేసులు నమోదైనట్లు వెల్లడించారు.

సింగపూర్​

సింగపూర్​లో మరో 618 మందికి కరోనా పాజిటివ్​గా తేలినట్లు అధికారులు ప్రకటించారు. మొత్తం బాధితుల సంఖ్య 12,693 చేరినట్లు తెలిపారు. దేశంలో మొత్తం 12 మంది మరణించినట్లు స్పష్టం చేశారు. కొత్తగా గుర్తించిన కేసుల్లో 397 మంది వసతి గృహాల్లో ఉంటున్న విదేశీ వర్క్ పర్మిట్ హోల్డర్సే​ అని వెల్లడించారు.

గ్రీస్

గ్రీస్​లో 16 కొత్త కేసులు నమోదు కాగా.. మొత్తం బాధితుల సంఖ్య 2,506కి చేరింది. 24 గంటల వ్యవధిలో కరోనా మరణాలేవీ సంభవించలేదని అధికారులు స్పష్టం చేశారు. మృతుల సంఖ్య 130గా ఉన్నట్లు స్పష్టం చేశారు. వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్న వారి సంఖ్య తగ్గుముఖం పడుతున్నట్లు వెల్లడించారు.

లాక్​డౌన్ మినహాయింపులు

కరోనా ప్రభావం తగ్గకపోయినా పలు దేశాలు మాత్రం లాక్​డౌన్ ఆంక్షలను క్రమక్రమంగా సడలిస్తున్నాయి. కరోనాతో పోరాటం సాగిస్తూనే ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుంగిపోకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాయి. అత్యావసరాలతో పాటు పలు వ్యాపారాలు కొనసాగించేలా అనుమతులిస్తున్నాయి.

వస్త్ర పరిశ్రమలు సహా పలు అత్యావసరం కాని సేవలను మే 3 తర్వాత అనుమతించనున్నట్లు బెల్జియం ప్రకటించింది. యువ గ్రాడ్యుయేట్ల కోసం డెన్మార్క్ పాఠశాలలను తిరిగి ప్రారంభించింది. స్పెయిన్​లోనూ ఆంక్షలు సడలించారు. ఫ్రాన్స్​లో మే 11న లాక్​డౌన్​ ముగియనుండగా... విద్యార్థులను పాఠశాలలకు పంపే అంశంపై నిర్ణయాధికారం తల్లిదండ్రులదేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.

సున్నా ఆక్యుపెన్సీ

ఫ్రాన్స్​లోని పర్యాటకం, ఆతిథ్య రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. దేశంలోని హోటళ్లలో ఏప్రిల్ నెలలో ఆక్యుపెన్సీ సున్నా శాతానికి పడిపోయినట్లు వెల్లడించారు. మే, జూన్​లలోనూ ఇదే పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందన్నారు.

ఇదీ చదవండి: 'రాపిడ్​ టెస్ట్ కిట్లతో కరోనా పరీక్షలు నిర్వహించవద్దు'

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయ తాండవం చేస్తోంది. ఇప్పటివరకు 2 లక్షలకు పైగా మందిని ఈ మహమ్మారి పొట్టనబెట్టుకుంది. రోజురోజుకూ పెరుగుతున్న కేసుల సంఖ్యతో.. ప్రస్తుతం 29 లక్షలకు చేరింది. పలు దేశాల్లో వైరస్ ప్రభావం కొనసాగుతుండటం వల్ల ఈ సంఖ్య మరింత పెరగనున్నట్లు స్పష్టమవుతోంది.

కొవిడ్ ధాటికి అమెరికా, ఐరోపా దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. ప్రపంచంలోని మూడో వంతు కేసులు అమెరికా కేంద్రంగానే నమోదయ్యాయి. అమెరికాలో గత 24 గంటల వ్యవధిలో 2,710 మంది మృతి చెందారు. అగ్రరాజ్యంలో మొత్తం 9.56 లక్షల మందికి ఈ మహమ్మారి సోకగా... 1.16 లక్షల మంది కోలుకున్నారు. మొత్తం 54 వేల మంది ఈ వైరస్​కు బలయ్యారు.

coronavirus tracker
వివిధ దేశాల్లో కరోనా తీరు

ఇటలీ 26 వేలు

కరోనాతో దుర్భర స్థితిలోకి జారుకున్న ఇటలీలో మరో 415 మంది మరణించారు. 24 గంటల వ్యవధిలో 2,357 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఐరోపా దేశాల్లో అత్యధికంగా ఇటలీలోనే 26,384 మంది ఇప్పటివరకు మరణించినట్లు వెల్లడించారు. మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 1,95,000కు చేరినట్లు స్పష్టం చేశారు.

చైనాలో

మరోవైపు చైనాలో వైరస్ దాదాపుగా తగ్గుముఖం పట్టింది. ఇప్పటివరకు మొత్తం 82,816 కేసులు నమోదు కాగా...77, 346 మంది కోలుకున్నారు. 4,632 మంది మరణించారు. కేవలం 838 మంది ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. శనివారం కొత్తగా 12 కేసులు నమోదైనట్లు వెల్లడించారు.

సింగపూర్​

సింగపూర్​లో మరో 618 మందికి కరోనా పాజిటివ్​గా తేలినట్లు అధికారులు ప్రకటించారు. మొత్తం బాధితుల సంఖ్య 12,693 చేరినట్లు తెలిపారు. దేశంలో మొత్తం 12 మంది మరణించినట్లు స్పష్టం చేశారు. కొత్తగా గుర్తించిన కేసుల్లో 397 మంది వసతి గృహాల్లో ఉంటున్న విదేశీ వర్క్ పర్మిట్ హోల్డర్సే​ అని వెల్లడించారు.

గ్రీస్

గ్రీస్​లో 16 కొత్త కేసులు నమోదు కాగా.. మొత్తం బాధితుల సంఖ్య 2,506కి చేరింది. 24 గంటల వ్యవధిలో కరోనా మరణాలేవీ సంభవించలేదని అధికారులు స్పష్టం చేశారు. మృతుల సంఖ్య 130గా ఉన్నట్లు స్పష్టం చేశారు. వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్న వారి సంఖ్య తగ్గుముఖం పడుతున్నట్లు వెల్లడించారు.

లాక్​డౌన్ మినహాయింపులు

కరోనా ప్రభావం తగ్గకపోయినా పలు దేశాలు మాత్రం లాక్​డౌన్ ఆంక్షలను క్రమక్రమంగా సడలిస్తున్నాయి. కరోనాతో పోరాటం సాగిస్తూనే ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుంగిపోకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాయి. అత్యావసరాలతో పాటు పలు వ్యాపారాలు కొనసాగించేలా అనుమతులిస్తున్నాయి.

వస్త్ర పరిశ్రమలు సహా పలు అత్యావసరం కాని సేవలను మే 3 తర్వాత అనుమతించనున్నట్లు బెల్జియం ప్రకటించింది. యువ గ్రాడ్యుయేట్ల కోసం డెన్మార్క్ పాఠశాలలను తిరిగి ప్రారంభించింది. స్పెయిన్​లోనూ ఆంక్షలు సడలించారు. ఫ్రాన్స్​లో మే 11న లాక్​డౌన్​ ముగియనుండగా... విద్యార్థులను పాఠశాలలకు పంపే అంశంపై నిర్ణయాధికారం తల్లిదండ్రులదేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.

సున్నా ఆక్యుపెన్సీ

ఫ్రాన్స్​లోని పర్యాటకం, ఆతిథ్య రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. దేశంలోని హోటళ్లలో ఏప్రిల్ నెలలో ఆక్యుపెన్సీ సున్నా శాతానికి పడిపోయినట్లు వెల్లడించారు. మే, జూన్​లలోనూ ఇదే పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందన్నారు.

ఇదీ చదవండి: 'రాపిడ్​ టెస్ట్ కిట్లతో కరోనా పరీక్షలు నిర్వహించవద్దు'

Last Updated : Apr 26, 2020, 6:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.