ETV Bharat / international

'6 వారాల్లో కరోనా కొత్త స్ట్రెయిన్‌కు టీకా!' - బ్రిటన్​లో కరోనా వైరస్​

బ్రిటన్​లో బయటపడ్డ కొత్తరకం కరోనా వైరస్‌పై సర్వత్రా ఆందోళన నెలకొంది. ఇప్పటికే యూకే నుంచి వచ్చే విమానాలపై భారత్​ సహా పలు దేశాలు ఆంక్షలు విధించాయి. అయితే ఈ కొత్త రకం కరోనా వైరస్​కు ఆరు వారాల్లో టీకా తీసుకురాగలమని ఫార్మా దిగ్గజం బయోఎన్​ టెక్​ ప్రకటించింది.

BioNTech
'6 వారాల్లో కరోనా స్ట్రెయిన్‌కు టీకా తెస్తాం'
author img

By

Published : Dec 22, 2020, 5:25 PM IST

జర్మనీకి చెందిన ప్రముఖ ఫార్మా దిగ్గజం 'బయోఎన్‌ టెక్‌' కరోనా వైరస్ కొత్త‌ స్ట్రెయిన్‌ విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. ఆరు వారాల్లో కొవిడ్‌-19 స్ట్రెయిన్‌కు టీకా తయారు చేయగలమని ప్రకటించింది.

"కొత్త స్ట్రెయిన్‌ మీద కొవిడ్‌-19 టీకా సమర్థంగానే పనిచేస్తుంది. ఒకవేళ అవసరమైతే ఈ రకం వైరస్‌పై నేరుగా ప్రయోగాలు ప్రారంభిస్తాం. ఆరు వారాల్లో కరోనా వైరస్ కొత్త‌ స్ట్రెయిన్‌కు బయోఎన్‌టెక్‌ టీకాను అందుబాటులోకి తీసుకురాగలదు."

- ఉగుర్‌ సాహిన్, బయోఎన్​టెక్​ సీఈఓ

మరోవైపు కొవిడ్‌-19కు సంబంధించి ఇప్పటికే ఫైజర్‌, బయోఎన్‌టెక్‌ సంస్థలు రూపొందించిన 'ఫైజర్‌ టీకా'ను అత్యవసరంగా ఉపయోగించేందుకు పలు దేశాలు అనుమతించాయి. అంతా సవ్యంగా ఉందనుకునేలోపు యూకేలో కొత్త రకం కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌ విజృంభిస్తోంది. ఈ క్రమంలో పలు దేశాలు యూకే విమానాలపై ఆంక్షలు విధించాయి. భారత్‌ కూడా అప్రమత్తమై ఆయా దేశాల విమానాలను తాత్కాలికంగా నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా బ్రిటన్‌ నుంచి వచ్చే వారికి ఆర్టీ పీసీఆర్‌ పరీక్షలు, ఐసోలేషన్‌ ఏర్పాట్లకు సమాయాత్తం చేసింది.

ఇవీ చూడండి

జర్మనీకి చెందిన ప్రముఖ ఫార్మా దిగ్గజం 'బయోఎన్‌ టెక్‌' కరోనా వైరస్ కొత్త‌ స్ట్రెయిన్‌ విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. ఆరు వారాల్లో కొవిడ్‌-19 స్ట్రెయిన్‌కు టీకా తయారు చేయగలమని ప్రకటించింది.

"కొత్త స్ట్రెయిన్‌ మీద కొవిడ్‌-19 టీకా సమర్థంగానే పనిచేస్తుంది. ఒకవేళ అవసరమైతే ఈ రకం వైరస్‌పై నేరుగా ప్రయోగాలు ప్రారంభిస్తాం. ఆరు వారాల్లో కరోనా వైరస్ కొత్త‌ స్ట్రెయిన్‌కు బయోఎన్‌టెక్‌ టీకాను అందుబాటులోకి తీసుకురాగలదు."

- ఉగుర్‌ సాహిన్, బయోఎన్​టెక్​ సీఈఓ

మరోవైపు కొవిడ్‌-19కు సంబంధించి ఇప్పటికే ఫైజర్‌, బయోఎన్‌టెక్‌ సంస్థలు రూపొందించిన 'ఫైజర్‌ టీకా'ను అత్యవసరంగా ఉపయోగించేందుకు పలు దేశాలు అనుమతించాయి. అంతా సవ్యంగా ఉందనుకునేలోపు యూకేలో కొత్త రకం కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌ విజృంభిస్తోంది. ఈ క్రమంలో పలు దేశాలు యూకే విమానాలపై ఆంక్షలు విధించాయి. భారత్‌ కూడా అప్రమత్తమై ఆయా దేశాల విమానాలను తాత్కాలికంగా నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా బ్రిటన్‌ నుంచి వచ్చే వారికి ఆర్టీ పీసీఆర్‌ పరీక్షలు, ఐసోలేషన్‌ ఏర్పాట్లకు సమాయాత్తం చేసింది.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.