ETV Bharat / international

బ్రిటీష్​ డిప్యూటీ హైకమిషనర్​గా అంబికా! - భారత్​-యూకేల మధ్య ద్వైపాక్షిక సంబంధాలప

అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఒక రోజు భారత్​లో బ్రిటీష్​ డిప్యూటీ కమిషనర్​గా జర్నలిజం విద్యాార్థిని అంబికా విధులు నిర్వర్తించారు. స్వదేశం సహా అంతర్జాతీయంగా మహిళలకు అన్ని రంగాల్లో బ్రిటన్ అందిస్తున్న సహకారంపై ప్రచారం కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించారు బ్రిటీష్​ హైకమిషన్ అధికారులు.

Ambalika Bannerjee,journalism student became British Dy High Commissioner
author img

By

Published : Oct 12, 2019, 11:09 PM IST

బ్రిటీష్​ డిప్యూటీ హైకమిషనర్​గా అంబికా!

కర్ణాటకకు చెందిన ఓ జర్నలిజం విద్యార్థినికి అరుదైన అవకాశం లభించింది. బెంగళూరులో నివాసం ఉండే అంబిక ఒక రోజు పాటు బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్​గా విధులు నిర్వర్తించారు. భారత్​, యూకేల మధ్య సంబంధాలు పెంపొందించడం సహా మహిళలకు బ్రిటన్ అందిస్తున్న సహకారానికి గుర్తింపు తెచ్చేందుకు పోటీలు నిర్వహించి అంబికాను ఎంపిక చేశారు బ్రిటన్​ అధికారులు. భారత్​-యూకేల మధ్య ద్వైపాక్షిక సంబంధాల గురించి తెలుసుకోవడానికి బ్రిటీష్​ డిప్యూటీ హై కమిషనర్​గా ఒక రోజు పాటు బాధ్యతలు చేపట్టారు.

ప్రత్యేక సమావేశాలు..

ప్రస్తుతం బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్​గా ఉన్న జెరెసీ పిల్​మోరే స్థానంలో బాధ్యతలు చేపట్టిన అంబికా అనంతరం పలు సమావేశాలు నిర్వహించారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ అధికారులు, వ్యాపారవేత్తలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

"ఈ రోజు పూర్తిగా ప్రణాళిక ప్రకారం అద్భుతంగా సాగుతోంది. బ్రిటీష్ హైకమిషనర్​ కార్యాలయ సిబ్బందిని బెంగళూరులో ఈరోజు కలుసుకున్నాను. అనంతరం టెస్కోను సందర్శించి దాని విధివిధానాలు సహా భారత్​, యూకే మధ్య సంబంధాలను పరిశీలించాను. ప్రత్యేకంగా లింగ సమానత్వంపై పోరాడే సామాజిక కార్యకర్త విద్యాలక్ష్మి గారిని అక్కడ కలుసుకున్నాను.-

-అంబికా, ఒకరోజు బ్రిటన్ డిప్యూటీ కమిషనర్

బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్​గా తనకు అరుదైన అవకాశం దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు అంబికా.

'ఇది ఒక్కరోజు పని కాదు. ఈ హోదాకు చేరుకోవడం, ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం సహా భారత్​-యూకేల మధ్య సంబంధాలపై అవగాహన పెంచుకునేందుకూ ఇదో అద్భుత అవకాశం. ఈ ప్రక్రియ కేవలం ఆరంభం మాత్రమే. ఇదొక గొప్ప అనుభూతి, చాలా ఆనందం కలిగింది.'

-అంబికా, ఒకరోజు బ్రిటన్ డిప్యూటీ కమిషనర్

మహిళల ప్రాధాన్యాన్ని తెలియజేయడానికే

ఈ సందర్భంగా మాట్లాడిన బ్రిటీష్​​ డిప్యూటీ హై కమిషనర్​ బెడ్​ఫోర్డ్...మహిళలకు బ్రిటన్ ఇస్తున్న ప్రాధాన్యాన్ని వివరించారు. బ్రిటన్​లోనే కాక అంతర్జాతీయంగా కూడా మహిళల సాధికారత కోసం కృషి చేస్తున్నట్లు వివరించారు.

'అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం చేశాం. మా పరిధిలో ఉన్న భారతీయ నెట్​వర్క్​లలో పోటీలు జరిపాం. డిప్యూటీ హైకమిషనర్​ హోదాను చేపట్టడానికి ఈ వారం పోటీలు నిర్వహించాం. యూకేతో పాటు అంతర్జాతీయంగా మహిళల సమస్యల పరిష్కారం సహా వారి గళాన్ని వినిపించడానికి బ్రిటన్ అందిస్తున్న సహకారాన్ని తెలిపేందుకే ఒకరోజు డిప్యూటీ కమిషనర్​ కార్యక్రమం చేపట్టాం. అంబికా ఈ రోజు సమావేశానికి అధ్యక్షత వహించారు. పెట్టుబడులు, వాణిజ్యం, రాజకీయం వంటి అంశాల్లో బ్రిటన్​, కర్ణాటకల మధ్య బంధం బలోపేతం చేయడానికి ఇక్కడ అధికారులు చేసే విధులను వారు పరిశీలించారు.'

--బెడ్​ఫోర్డ్​, బ్రిటన్​ డిప్యూటీ హై కమిషనర్.

బ్రిటన్​లో మంత్రిత్వ శాఖలను మహిళలే ఎక్కువగా నిర్వర్తిస్తున్నారని బెడ్​ఫోర్డ్ తెలిపారు. విదేశీ రాయబారులలో సగానికి పైగా మహిళలు ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఒక రోజు హైకమిషనర్​..

ఇటీవల 'ఒకరోజు హైకమిషనర్' పేరుతో నిర్వహించిన పోటీల్లో ఉత్తర్​ప్రదేశ్​లోని గోరఖ్​పుర్​కు చెందిన ఆయేషా ఖాన్​ విజయం సాధించారు. దీంతో భారత్​లో బ్రిటన్​ అత్యున్నత హోదా అయిన హైకమిషనర్​ హోదాను ఒక రోజు పాటు నిర్వర్తించారు. అక్టోబర్ 4న ఆయేషా విధులు నిర్వర్తించినట్లు ఓ ప్రకటనలో బ్రిటన్​ అధికారులు వెల్లడించారు.​ ​

ఇదీ చూడండి: 'కశ్మీర్​పై మోదీ చివరి అస్త్రాన్ని వినియోగించేశారు'

బ్రిటీష్​ డిప్యూటీ హైకమిషనర్​గా అంబికా!

కర్ణాటకకు చెందిన ఓ జర్నలిజం విద్యార్థినికి అరుదైన అవకాశం లభించింది. బెంగళూరులో నివాసం ఉండే అంబిక ఒక రోజు పాటు బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్​గా విధులు నిర్వర్తించారు. భారత్​, యూకేల మధ్య సంబంధాలు పెంపొందించడం సహా మహిళలకు బ్రిటన్ అందిస్తున్న సహకారానికి గుర్తింపు తెచ్చేందుకు పోటీలు నిర్వహించి అంబికాను ఎంపిక చేశారు బ్రిటన్​ అధికారులు. భారత్​-యూకేల మధ్య ద్వైపాక్షిక సంబంధాల గురించి తెలుసుకోవడానికి బ్రిటీష్​ డిప్యూటీ హై కమిషనర్​గా ఒక రోజు పాటు బాధ్యతలు చేపట్టారు.

ప్రత్యేక సమావేశాలు..

ప్రస్తుతం బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్​గా ఉన్న జెరెసీ పిల్​మోరే స్థానంలో బాధ్యతలు చేపట్టిన అంబికా అనంతరం పలు సమావేశాలు నిర్వహించారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ అధికారులు, వ్యాపారవేత్తలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

"ఈ రోజు పూర్తిగా ప్రణాళిక ప్రకారం అద్భుతంగా సాగుతోంది. బ్రిటీష్ హైకమిషనర్​ కార్యాలయ సిబ్బందిని బెంగళూరులో ఈరోజు కలుసుకున్నాను. అనంతరం టెస్కోను సందర్శించి దాని విధివిధానాలు సహా భారత్​, యూకే మధ్య సంబంధాలను పరిశీలించాను. ప్రత్యేకంగా లింగ సమానత్వంపై పోరాడే సామాజిక కార్యకర్త విద్యాలక్ష్మి గారిని అక్కడ కలుసుకున్నాను.-

-అంబికా, ఒకరోజు బ్రిటన్ డిప్యూటీ కమిషనర్

బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్​గా తనకు అరుదైన అవకాశం దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు అంబికా.

'ఇది ఒక్కరోజు పని కాదు. ఈ హోదాకు చేరుకోవడం, ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం సహా భారత్​-యూకేల మధ్య సంబంధాలపై అవగాహన పెంచుకునేందుకూ ఇదో అద్భుత అవకాశం. ఈ ప్రక్రియ కేవలం ఆరంభం మాత్రమే. ఇదొక గొప్ప అనుభూతి, చాలా ఆనందం కలిగింది.'

-అంబికా, ఒకరోజు బ్రిటన్ డిప్యూటీ కమిషనర్

మహిళల ప్రాధాన్యాన్ని తెలియజేయడానికే

ఈ సందర్భంగా మాట్లాడిన బ్రిటీష్​​ డిప్యూటీ హై కమిషనర్​ బెడ్​ఫోర్డ్...మహిళలకు బ్రిటన్ ఇస్తున్న ప్రాధాన్యాన్ని వివరించారు. బ్రిటన్​లోనే కాక అంతర్జాతీయంగా కూడా మహిళల సాధికారత కోసం కృషి చేస్తున్నట్లు వివరించారు.

'అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం చేశాం. మా పరిధిలో ఉన్న భారతీయ నెట్​వర్క్​లలో పోటీలు జరిపాం. డిప్యూటీ హైకమిషనర్​ హోదాను చేపట్టడానికి ఈ వారం పోటీలు నిర్వహించాం. యూకేతో పాటు అంతర్జాతీయంగా మహిళల సమస్యల పరిష్కారం సహా వారి గళాన్ని వినిపించడానికి బ్రిటన్ అందిస్తున్న సహకారాన్ని తెలిపేందుకే ఒకరోజు డిప్యూటీ కమిషనర్​ కార్యక్రమం చేపట్టాం. అంబికా ఈ రోజు సమావేశానికి అధ్యక్షత వహించారు. పెట్టుబడులు, వాణిజ్యం, రాజకీయం వంటి అంశాల్లో బ్రిటన్​, కర్ణాటకల మధ్య బంధం బలోపేతం చేయడానికి ఇక్కడ అధికారులు చేసే విధులను వారు పరిశీలించారు.'

--బెడ్​ఫోర్డ్​, బ్రిటన్​ డిప్యూటీ హై కమిషనర్.

బ్రిటన్​లో మంత్రిత్వ శాఖలను మహిళలే ఎక్కువగా నిర్వర్తిస్తున్నారని బెడ్​ఫోర్డ్ తెలిపారు. విదేశీ రాయబారులలో సగానికి పైగా మహిళలు ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఒక రోజు హైకమిషనర్​..

ఇటీవల 'ఒకరోజు హైకమిషనర్' పేరుతో నిర్వహించిన పోటీల్లో ఉత్తర్​ప్రదేశ్​లోని గోరఖ్​పుర్​కు చెందిన ఆయేషా ఖాన్​ విజయం సాధించారు. దీంతో భారత్​లో బ్రిటన్​ అత్యున్నత హోదా అయిన హైకమిషనర్​ హోదాను ఒక రోజు పాటు నిర్వర్తించారు. అక్టోబర్ 4న ఆయేషా విధులు నిర్వర్తించినట్లు ఓ ప్రకటనలో బ్రిటన్​ అధికారులు వెల్లడించారు.​ ​

ఇదీ చూడండి: 'కశ్మీర్​పై మోదీ చివరి అస్త్రాన్ని వినియోగించేశారు'

New Delhi, Oct 12 (ANI): Priyanka Chopra and Farhan Akhtar starrer 'The Sky is Pink' which hit theatres on Friday, opened to lukewarm response.The film managed to garner Rs. 2.50 crore on its first day. But it is facing stiff competition from last week's releases 'War' and 'Joker', according to Box Office India.Shonali Bose's directorial is an incredible love story of a couple spanning 25 years which is narrated by their teenage daughter - Aisha (Zaira Wasim). Aisha becomes a motivational speaker after being diagnosed with pulmonary fibrosis.The film was screened at the 2019 Toronto Film Festival on September 13 and was attended by the complete cast and crew excluding Zaira Wasim. 'The Sky is Pink' marks the Bollywood comeback of Priyanka after a hiatus of almost three years. It is co-produced by Priyanka, Ronnie Screwvala and Siddharth Roy Kapur.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.